News September 17, 2024

పనిచేయని UPI.. యూజర్ల ఇబ్బందులు

image

దేశవ్యాప్తంగా UPI సేవలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా చెల్లింపులు జరగట్లేదు. పేమెంట్ చేసే సమయంలో యూపీఐ నెట్‌వర్క్ స్లోగా ఉందని చూపిస్తోంది. దీంతో యూజర్లు డబ్బులు పంపలేక ఇబ్బంది పడుతున్నారు. మరి మీకూ ఈ సమస్య ఎదురవుతోందా? కామెంట్ చేయండి.

News September 17, 2024

వారి ఖాతాల్లో ఏడాదికి రూ.12,000

image

TG: భూమి లేని నిరుపేదల బ్యాంకు ఖాతాల్లో ఏడాదికి రూ.12 వేలు జమ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం(D) నాగులవంచలో దళిత బంధు 2వ విడత లబ్ధిదారులకు మంజూరి పత్రాలు అందజేశారు. త్వరలోనే పేదలకు ఇళ్లు ఇస్తామన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో మహిళలకు భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పారు. ప్రజాపాలన దినోత్సవాన్ని స్వాగతించకపోతే రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించినట్లేనని పేర్కొన్నారు.

News September 17, 2024

భారత ప్లేయర్లను ఉత్సాహపరచండి: ఆనంద్

image

చెస్ ఒలింపియాడ్-2024లో భారత ప్లేయర్లు సత్తా చాటుతున్నారని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా అన్నారు. ‘మీరు Chess Olympiad 2024లో భారత్ ఏ స్థాయిలో ఉందో తప్పకుండా తెలుసుకోవాలి. రౌండ్ 6 తర్వాత ఓపెన్ & మహిళల విభాగాల్లో భారత్ ఆధిక్యంలో ఉంది. వారిని ఉత్సాహపరచండి. ప్రపంచంలోని టాప్-5లో ఇద్దరు భారత ప్లేయర్లు ఉండటం ఇదే తొలిసారి’ అని ట్వీట్ చేశారు.

News September 17, 2024

నాక్కూడా CM కావాలనుంది: అజిత్ పవార్

image

CM పదవిపై NCP చీఫ్ అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రతి ఒక్క‌రూ త‌మ నాయ‌కుడు CM కావాల‌ని కోరుకుంటారు. నాకు కూడా ఆ కోరిక ఉంది. అయితే సీఎం అవ్వ‌డానికి మెజారిటీ మార్క్ చేరుకోవాలి. ప్ర‌తి ఒక్క‌రికి కోరుకున్న‌ది ద‌క్క‌దు. అయితే, దానికోసం అంబేడ్కర్ ఓటు హ‌క్కును క‌ల్పించారు. అంతిమంగా అది ఓట‌ర్ల చేతిలోనే ఉంది. 288 మంది ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ 145 మార్క్ చేరుకోవాలి’ అని పేర్కొన్నారు.

News September 17, 2024

చెన్నైలో ‘దేవర’ టీమ్.. త్వరలో ‘ఆయుధపూజ’ సాంగ్!

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న ‘దేవర’ సినిమా మరో పది రోజుల్లో రిలీజ్ కానుంది. ఈక్రమంలో మేకర్స్ ప్రమోషన్లలో భాగంగా చెన్నైకి బయల్దేరారు. అక్కడ పలు ఇంటర్వ్యూల్లో ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పాల్గొంటారు. ఈ సందర్భంగా రేపు లేదా ఎల్లుండి అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తోన్న ‘ఆయుధపూజ’ సాంగ్‌ను విడుదల చేయనున్నారు. దీనిపై త్వరలోనే ప్రకటన రానుంది.

News September 17, 2024

కొత్త సీఎంపై బీజేపీ రియాక్షన్

image

మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఒత్తిడి వల్లే ఆతిశీని కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా ఎంపిక చేశారని బీజేపీ విమర్శించింది. ముఖ్యమంత్రి ముఖం మాత్రమే మారిందని, అయితే అవినీతి శైలి అలాగే ఉంది కాబట్టి ఢిల్లీ ప్రజలు సమాధానం అడుగుతారని బీజేపీ దుయ్యబట్టింది. సొంత పార్టీలో ఎవరి మీదా నమ్మకం లేకనే తన కంటే బలహీనమైన వ్యక్తిని కేజ్రీవాల్ సీఎంగా ఎంపిక చేశారని ఆరోపించింది.

News September 17, 2024

థాంక్యూ పవన్ అన్న: మంత్రి లోకేశ్

image

AP: విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తున్నారని మంత్రి లోకేశ్‌ను ప్రశంసిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన <<14117846>>ట్వీట్‌<<>>పై నారా లోకేశ్ స్పందించారు. ‘థాంక్యూ పవన్ కళ్యాణ్ అన్న’ అంటూ Xలో రిప్లై ఇచ్చారు. ఇటు మంత్రి సంధ్యారాణి ఇంట్లో జరిగిన బర్త్ డే వేడుకల్ని తిరుమలలో జరిగినట్లు జగన్ ఫేక్ ప్రచారం చేయిస్తున్నారని లోకేశ్ దుయ్యబట్టారు. శ్రీవారితో పెట్టుకుంటే ఒక్క సీటు లేకుండా పోతారని హెచ్చరించారు.

News September 17, 2024

బాలాపూర్ లడ్డూ వేలం ద్వారా వచ్చిన డబ్బులను ఏం చేస్తారో తెలుసా?

image

1994 నుంచి బాలాపూర్ <<14121640>>లడ్డూ<<>> వేలం ద్వారా వచ్చిన డబ్బులను గ్రామాభివృద్ధికి ఉపయోగిస్తున్నారు. స్కూల్, రోడ్లు, ఆలయాల నిర్మాణం, సీసీ కెమెరాల ఏర్పాటు, వరద బాధితులను ఆదుకునేందుకు ఆ నిధులను ఉపయోగించారు. దేని కోసం ఎంత వెచ్చించారో అందరికీ తెలిసేలా బోర్డులను సైతం ఏర్పాటు చేస్తారు. వేలం ద్వారా వచ్చిన డబ్బులతో తమ ఊరి రూపురేఖలు మారిపోయాయని గ్రామస్థులు చెబుతున్నారు.

News September 17, 2024

సీఎం చంద్రబాబుని కలిసిన వైఎస్ సునీత

image

AP: వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత దంపతులు సీఎం చంద్రబాబుని కలిశారు. వివేకా హత్య కేసును విచారించిన అప్పటి సీబీఐ ఎస్పీ రాంసింగ్‌‌తో పాటు తనపై గత ప్రభుత్వంలో అక్రమ కేసు పెట్టారని సునీత ఆరోపించారు. వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు కుట్రపూరితంగా వ్యవహరించారని తెలిపారు. కృష్ణారెడ్డి ఫిర్యాదులో నిజానిజాలపై విచారణ చేయించాలని సీఎం చంద్రబాబుని సునీత కోరారు.

News September 17, 2024

మయన్మార్‌లో ‘యాగీ’ బీభత్సం.. 236 మంది మృతి

image

మయన్మార్‌లో యాగీ తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలకు వరదలు, కొండచరియలు విరిగి పడిన ఘటనలో 236 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో 77 మంది గల్లంతైనట్లు చెప్పారు. అయితే మరణాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 6.31 లక్షల మంది వరదలకు ప్రభావితమైనట్లు పేర్కొన్నారు. పెద్ద ఎత్తున రోడ్లు దెబ్బతినడంతో పాటు ఆస్తి నష్టం వాటిల్లింది.