India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఒడిశాలోని కోరాపుట్, మల్కన్గిరి జిల్లాల్లో వరదల్లోనూ ఇద్దరు వైద్యులు చూపిన ధైర్యసాహసాలను నెటిజన్లు అభినందిస్తున్నారు. బరియా గ్రామంలోని ప్రజలు కలుషిత నీటిని తాగడంతో అనారోగ్యానికి గురయ్యారు. ఇది తెలుసుకున్న వైద్యులు అనంత్ కుమార్ దార్లీ, సుజీత్ కుమార్ రోగుల ప్రాణాలు కాపాడేందుకు సాహసమే చేశారు. వీరిద్దరూ వరద నీటిలో ఈదుకుంటూ గ్రామానికి చేరుకొని రోగులకు చికిత్స అందించారు.
AP: ప్రభుత్వ స్కూళ్లలో CBSE సిలబస్ రద్దు చేయడం ఏంటని మాజీ CM జగన్ ప్రశ్నించారు. CM చంద్రబాబు పేదల వ్యతిరేకి అని మరోసారి నిరూపించుకున్నారని విమర్శించారు. ‘CBSE రద్దు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను దూరం చేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులపై చంద్రబాబు, లోకేశ్కు వివక్ష ఎందుకు? వాళ్లు ఎప్పటికీ అలాగే కిందిస్థాయిలో ఉండాలా? సీబీఎస్ఈని రద్దు చేయడం ఎంతవరకు సమంజసం?’ అని ఆయన ట్వీట్ చేశారు.
బంగ్లాదేశ్తో ఈనెల 19 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్కు టీమ్ఇండియా సిద్ధమవుతోంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగే తొలి టెస్టులో స్పిన్నర్లు అశ్విన్, జడేజా, కుల్దీప్ జట్టులో ఆడతారని పీటీఐ పేర్కొంది. రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరించనున్న ఈ జట్టులో అక్షర్ పటేల్కు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఈ రెండు టెస్టుల సిరీస్లో గెలిచేదెవరో కామెంట్ చేయండి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అత్యధికంగా రూ.100+కోట్ల షేర్ కలెక్ట్ చేసిన సినిమాలు కలిగిన హీరోగా నిలిచారు. ఆయన నటించిన ఆరు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రూ.వంద కోట్లకు పైగా సాధించాయి. ఆయన తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు (5), చిరంజీవి(3), రామ్ చరణ్(2), అల్లు అర్జున్(2), యంగ్ టైగర్ ఎన్టీఆర్ (1) ఉన్నారు. కాగా, రూ.50+ కోట్ల షేర్ కలెక్ట్ చేసిన సినిమాలు అత్యధికంగా మహేశ్ ఖాతాలో ఉన్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ను దేశంలో అత్యంత ఖరీధైన స్పోర్ట్స్ ఈవెంట్గా పరిగణిస్తారు. అయితే, ప్రపంచంలోనే రిచెస్ట్ స్పోర్ట్స్ లీగ్ ఏంటో మీకు తెలుసా? నేషనల్ ఫుట్బాల్ లీగ్ (NFL). దీని విలువ 18 బిలియన్ డాలర్లు. దీని తర్వాత మేజర్ లీగ్ బేస్బాల్ (MLB) 11.5 బిలియన్ డాలర్లు, నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ (NBA), IPL-9 బిలియన్ డాలర్లు, ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (EPL), నేషనల్ హాకీ లీగ్ (NHL) ఉన్నాయి.
ఫెడరల్ రిజర్వ్ (US Fed) వడ్డీ రేట్లను తగ్గించనుందన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. సెప్టెంబర్ 18న ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ ఈ విషయంపై ప్రకటన చేయనున్నారు. ఆర్థిక మాంద్యం భయాలు వీడడం, ద్రవ్యోల్బణం తగ్గడంతో ఫెడ్ కీలక వడ్డీ రేట్లను తగ్గించడానికి సిద్ధమవుతున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల కొన్ని నెలల ముందు ఫెడ్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
TG: రాజీవ్ విగ్రహాన్ని తొలగించేదెవడని CM రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణ ప్రకటించిన సోనియమ్మకు కృతజ్ఞతగా మీరే రాజీవ్ విగ్రహం పెట్టాల్సింది పోయి కూల్చేస్తామంటారా? ఎవడ్రా తొలగించేది ఒక్కడు రండి? ఎప్పుడు వస్తారో డేట్ చెప్పండి. పదేళ్లు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని సన్నాసి నువ్వు. సచివాలయం సాక్షిగా చెబుతున్న బిడ్డా.. మీ ఫామ్హౌస్లో జిల్లేళ్లు మొలిపిస్తాం’ అని వార్నింగ్ ఇచ్చారు.
TG: ఎన్నికల్లో ఓటమి షాక్ నుంచి ఇంకా కేసీఆర్ తేరుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రెగ్యులర్గా ఫామ్ హౌస్లో KCRకు షాక్ ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పారు. దొరల గడీలు బద్దలై ప్రజా పాలన వచ్చిందనే విషయం ఆయనకు అర్థం కావట్లేదని తెలిపారు. తెలంగాణను కబళించే ఈ మిడతల దండును పొలిమేర్లు దాటించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందన్నారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని పేర్కొన్నారు.
TG: రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో KTRపై CM రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. ‘ఇప్పుడు ట్విటర్ పిట్ట ట్విటర్లో పోస్టులు పెడుతున్నాడు. అమెరికా వెళ్లి కంప్యూటర్ చదువుకున్నా అని చెబుతున్నాడు. ఆ కంప్యూటర్ను పుట్టించి, ఈ దేశానికి పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ. లేకపోతే నువ్వు గుంటూరులో ఇడ్లీ, వడ అమ్ముకునేవాడివి. సిద్దిపేట రైల్వేస్టేషన్లో చాయ్, సమోసా అమ్ముకునేవాడివి’ అని ఫైర్ అయ్యారు.
AP: విశాఖ స్టీల్ ప్లాంట్లో బ్లాస్ట్ ఫర్నేస్-3ను నిలిపేయడం రాజకీయ చిచ్చుకి ఆజ్యం పోసింది. ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు కేంద్రం చూస్తోందని విపక్షాలంటున్నాయి. ప్లాంట్ను కాపాడలేకుంటే కేంద్రం నుంచి కూటమి బయటకు రావాలని డిమాండ్ చేస్తున్నాయి. గతంలో ప్రత్యేక హోదా విషయంలోనూ TDPని విపక్షాలు ఇలాగే కార్నర్ చేశాయి. ఏదేమైనా స్టీల్ ప్లాంట్కు వ్యతిరేకంగా తీసుకునే ఏ నిర్ణయమైనా APలో రాజకీయంగా పెను దుమారమే రేపనుంది.
Sorry, no posts matched your criteria.