India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బీసీ ఉద్యమ నేత కృష్ణయ్య BJP నుంచి రాజ్యసభ స్థానాన్ని తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆయన YCPకి, రాజ్యసభకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా కృష్ణయ్య <<14226660>>మాట్లాడుతూ<<>> తన 50 ఏళ్ల పోరాటంలో ఎంపీ చిన్న పదవని చెప్పారు. దాని వల్ల తన స్థాయి తగ్గిందన్న ఆయన ఇప్పుడు మళ్లీ అదే పదవి తీసుకోవడం కరెక్టేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. TDP, YCP, ఇప్పుడు బీజేపీలో చేరికపై విమర్శిస్తున్నారు.

TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్తారు. మూడు రోజులపాటు ఆయన అక్కడే ఉంటారు. బుధవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో జైపుర్ వెళ్తారు. అక్కడ జరిగే బంధువుల వివాహంలో ఆయన పాల్గొంటారు. అనంతరం మళ్లీ హస్తిన చేరుకుని కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. ఆ తర్వాత క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, టీపీసీసీ కమిటీల ఎంపికపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చిస్తారని వార్తలు వస్తున్నాయి.

మోదీ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న జార్జ్ సొరోస్ వైఖరికే కట్టుబడ్డారో లేదో చెప్పాలని అమెరికాను BJP డిమాండ్ చేసింది. భారత్పై విషం చిమ్ముతున్న OCCRP మీడియా సంస్థకు సొరోస్తో పాటు US డీప్స్టేట్ ఫండింగ్ ఇవ్వడాన్ని గుర్తుచేసింది. వీటితో చేతులు కలిపే రాహుల్ గాంధీ భారత ప్రతిష్ఠను దిగజారుస్తున్నారని ఆరోపించింది. OCCRP కొందరి ఒత్తిడితో తప్పుడు రాతలు రాస్తోందని ఫ్రెంచ్ జర్నలిస్టు బయటపెట్టారని తెలిపింది.

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటించిన ‘తంగలాన్’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రసారమవుతోంది. పా.రంజిత్ తెరకెక్కించిన ఈ మూవీలో మాళవిక మోహనన్ హీరోయిన్గా నటించారు. కాగా ఈ సినిమా ఆగస్ట్ 15న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టినట్లు టాక్.

సినీ నటుడు మోహన్ బాబు తన శేషజీవితం ప్రశాంతంగా గడిపేందుకు శంషాబాద్ సమీపంలోని జల్పల్లిలో విశాలమైన ఇల్లు కట్టుకున్నారు. ఇందులో గార్డెన్, స్విమ్మింగ్పూల్, సిబ్బంది గదులతోపాటు సకల సౌకర్యాలతో నిర్మించారు. ప్రస్తుతం ఈ ఇంటి విలువ రూ.కోట్లలో ఉంటుంది. ఫిల్మ్ నగర్లో ఉండే ఇల్లు లక్ష్మీ ప్రసన్నకు ఇచ్చేశారు. ఇప్పుడు జల్పల్లి నివాసాన్ని స్వాధీనం చేసుకునేందుకు మంచు మనోజ్ ప్రయత్నిస్తున్నారన్నది ఆరోపణ.

TG: అదానీ-మోదీ ఫొటోలు ప్రింట్ చేసిన టీ షర్టులతో రాహుల్ గాంధీ పార్లమెంటుకు వెళ్లడం కరెక్టయినప్పుడు, అదానీ-రేవంత్ ఫొటోలతో టీషర్టులు వేసుకున్న తమను అసెంబ్లీకి ఎందుకు రానివ్వలేదని కేటీఆర్ X వేదికగా ప్రశ్నించారు. ‘రాహుల్ గాంధీ గారు ఇది ఎలాంటి వంచన? మీ అడుగుజాడల్లో నడిచి అదానీ-రేవంత్ అఫైర్ను బయటపెడదామనుకున్నాం. కానీ మమ్మల్ని రానివ్వలేదు. దీనికి మీరు సమాధానం చెప్పాలి’ అని పేర్కొన్నారు.

తాము యుద్ధం ముగిస్తే హమాస్ తమపై దాడి చేస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. అందుకే తాము యుద్ధం విరమించబోమని ఆయన స్పష్టం చేశారు. యుద్ధానికి 14 నెలలు పూర్తైన సందర్భంగా నెతన్యాహు మాట్లాడారు. ‘యుద్ధాన్ని ఆపితే హమాస్ కోలుకుని మళ్లీ బలపడుతుంది. అందుకే దాని సైనిక, పరిపాలన సామర్థ్యాలను తుడిచిపెట్టేస్తా. భవిష్యత్లో మాపై దాడులు జరగకుండా చేస్తా. హమాస్ వినాశనమే మా టార్గెట్’ అని ఆయన పేర్కొన్నారు.

TG: ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి ఎప్పుడు వస్తారా అని అధికార పక్షంతో పాటు రాజకీయ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. నిన్న తొలి రోజు శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరు కాని సంగతి తెలిసిందే. దీంతో ‘ఆయన ఇక ఫామ్ హౌస్కే పరిమితం అవుతారా? తమ పార్టీ నేతలకు దిశానిర్దేశాలతోనే కాలం గడిపేస్తారా?’ అంటూ అధికార పక్షం విమర్శిస్తోంది. ఈనెల 16 నుంచి కొనసాగే సమావేశాలకైనా ఆయన వస్తారేమో చూడాలి.

మంచు ఫ్యామిలీ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తనకు ముప్పు పొంచి ఉందని, రక్షణ కల్పించాలని మోహన్బాబు వాట్సాప్లో ఇచ్చిన ఫిర్యాదుపై కొడుకు మనోజ్, కోడలు మౌనికపై FIR నమోదైంది. తనపై దాడి చేశారని, ప్రాణహాని ఉందంటూ మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుపై మోహన్బాబుకు చెందిన 10 మంది అనుచరులపై పహాడిషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రపంచంలో 135 దేశాలవారు ఇంగ్లిష్లోనే చదువుకుంటున్నట్లు ‘డ్యులింగో లాంగ్వేజ్ రిపోర్ట్ 2024’ వెల్లడించింది. రెండో స్థానంలో స్పానిష్, మూడో ప్లేస్లో ఫ్రెంచ్ ఉన్నట్లు తెలిపింది. స్పానిష్ 33 దేశాల్లో, ఫ్రెంచ్ను 16 దేశాల్లో అభ్యసిస్తున్నట్లు వివరించింది. ప్రపంచంలో అత్యధిక మంది అభ్యసిస్తున్న పదో భాషగా హిందీ నిలిచింది. ఇంగ్లిష్ సర్టిఫికేషన్ కోర్సుకు ప్రాధాన్యమిస్తున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది.
Sorry, no posts matched your criteria.