News September 15, 2024

చంద్రబాబు గారూ.. ఇకనైనా కళ్లు తెరవండి: జగన్

image

AP: మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసే ఆలోచనను ప్రభుత్వం చేస్తోందని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. ‘పులివెందుల కాలేజీకి NMC 50 సీట్లిస్తే వద్దని లేఖ రాయడమేంటి? పక్క రాష్ట్రాలు మెడికల్ సీట్ల కోసం ప్రదక్షిణాలు చేస్తుంటే APకి వచ్చిన సీట్లను తిప్పి పంపడం ఏంటి? కరోనా సమయంలో ప్రజల్ని కాపాడింది ప్రజారోగ్య రంగమే. ఇకనైనా కళ్లు తెరవండి చంద్రబాబుగారు. పేదలకు ఉచిత వైద్య విద్య, వైద్యం అందించండి’ అని ఫైర్ అయ్యారు.

News September 15, 2024

గణేశ్ నిమజ్జనం.. మెట్రో రైళ్ల సమయం పెంపు

image

TG: ఎల్లుండి ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో మెట్రో రైలు సేవలను అధికారులు పొడిగించారు. ఈ నెల 17న అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్లు నడుస్తాయని పేర్కొన్నారు. చివరి స్టేషన్ నుంచి రాత్రి ఒంటిగంటకు మెట్రో రైలు బయల్దేరుతుందన్నారు. మరోవైపు అవసరాన్ని బట్టి నిమజ్జనం ముగిసే వరకు అదనపు రైళ్లు నడిపిస్తామని అధికారులు తెలిపారు.

News September 15, 2024

సవాలుగా మారిన బోట్ల తొలగింపు

image

AP: విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ సవాల్‌గా మారింది. ఇప్పటికే మూడు విధాలుగా ప్రయత్నించినప్పటికీ అధికారులకు నిరాశే ఎదురైంది. కట్ చేసిన బోట్లు బయటకు వచ్చినట్లే వచ్చి నీట మునిగాయి. దీంతో పడవలను బయటకు తీసేందుకు మరో ప్లాన్‌ను అబ్బులు టీమ్ రెడీ చేస్తోంది. ప్రస్తుతానికి పనులకు తాత్కాలిక బ్రేక్ పడింది. రేపు నీట మునిగిన పడవలను బయటకు తీసేందుకు ప్రయత్నాలు కొనసాగించనున్నారు.

News September 15, 2024

రూ.2 లక్షలపైన రుణమాఫీ.. సీఎం కీలక ప్రకటన

image

TG: రూ.2 లక్షల పైన రుణం ఉన్నవారు వడ్డీ చెల్లిస్తే మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పంద్రాగస్టు లోపల రూ.2 లక్షల వరకు రుణమాఫీ హామీ చేసినట్లు పేర్కొన్నారు. రుణమాఫీ విషయంలో తాడిచెట్టులా పెరిగిన ఓ వ్యక్తి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారని విమర్శించారు. హరీశ్ రాజీనామా చేస్తే సిద్దిపేటకు పట్టిన పీడ పోతుందని తాము సవాల్‌ను స్వీకరించామన్నారు. ఇప్పుడు ఆయన ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు.

News September 15, 2024

రాహుల్ గాంధీ ఓ టెర్రరిస్ట్: కేంద్రమంత్రి

image

రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి రవ్‌నీత్‌సింగ్ బిట్టూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ నంబర్ వన్ టెర్రరిస్ట్ అని వ్యాఖ్యానించారు. ఆయన తలపై కేంద్రం రివార్డు ప్రకటించాలని అన్నారు. సిక్కులను రాహుల్ విభజించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.

News September 15, 2024

కేంద్రంపై ఒత్తిడి పెంచాలి: సీపీఐ రామకృష్ణ

image

AP: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని CM చంద్రబాబుని CPI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. విలువైన ఉక్కు ఫ్యాక్టరీ ఆస్తులను కారుచౌకగా కట్టబెట్టేందుకు కేంద్రం చూస్తోందని ఆరోపించారు. ఉక్కు ఫ్యాక్టరీలో మూడో ప్లాంట్ కూడా మూసివేసేందుకు యత్నిస్తున్నారని అన్నారు. స్టీల్ ప్లాంట్‌కు సొంత ఐరన్ ఓర్ గనులు కేటాయించాలని కేంద్రాన్ని కోరాలని CBNకు ఆయన రాసిన లేఖలో పేర్కొన్నారు.

News September 15, 2024

BANతో టీ20లకు గిల్, పంత్‌ దూరం?

image

అక్టోబర్ 7 నుంచి బంగ్లాదేశ్‌తో జరిగే 3 మ్యాచుల టీ20 సిరీస్‌కు గిల్‌తో పాటు బుమ్రా, సిరాజ్, పంత్‌కు రెస్ట్ ఇవ్వనున్నట్లు సమాచారం. వర్క్ లోడ్‌ను మేనేజ్ చేసేందుకు, రాబోయే టెస్ట్ సిరీస్‌ల దృష్ట్యా వీరికి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించినట్లు బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ నేపథ్యంలో టీ20 టీమ్‌కు ఎవరెవరు సెలక్ట్ అవుతారనేది ఆసక్తిగా మారింది. పంత్ స్థానంలో ఇషాన్ కిషన్ జట్టులోకి వచ్చే ఛాన్సుంది.

News September 15, 2024

చేతబడి చేశారనే అనుమానంతో కుటుంబంలో ఐదుగురిని చంపేశారు

image

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో దారుణం జరిగింది. చేతబడి చేశారనే అనుమానంతో కుంట పీఎస్ పరిధి ఇట్కల్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని హత్య చేశారు. వారు చేతబడి చేయడంతోనే తమ కుటుంబంలోని వ్యక్తి అనారోగ్యానికి గురయ్యాడని భావించిన మరో కుటుంబం వీరిని దారుణంగా హతమార్చింది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

News September 15, 2024

కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పక నెరవేరుస్తుంది: రేవంత్

image

TG: ఎన్నో ఇబ్బందుల మధ్య సోనియా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అధికారంలోకి రాగానే రుణమాఫీ చేశామని తెలిపారు. గాంధీభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పక నెరవేరుస్తుందన్నారు. మహాలక్ష్మీ పథకంలో ఇప్పటి వరకు మహిళలు 85 కోట్ల ప్రయాణాలు చేశారని వెల్లడించారు. మోదీ, KCR హయాంలో గ్యాస్ సిలిండర్ రేట్లు భారీగా పెరిగాయని విమర్శించారు.

News September 15, 2024

రిటైర్మెంట్‌పై స్టార్ స్పిన్నర్ కీలక వ్యాఖ్యలు

image

తన ఆటను మెరుగుపరుచుకోలేదని భావించినప్పుడే రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తానని భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నారు. ఆటకు వీడ్కోలు పలకడం ఎప్పుడనేది ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. స్పిన్నర్ అనిల్ కుంబ్లే రికార్డును బద్దలు కొట్టాలని అనుకుంటున్నట్లు తెలిపారు. అయితే ప్రస్తుతానికి ఎలాంటి లక్ష్యాన్ని పెట్టుకోలేదని, దీంతో ఆటపై ప్రేమను కోల్పోదలుచుకోలేదన్నారు.