India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తేది: సెప్టెంబర్ 13, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున 4:51 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:04 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:12 గంటలకు
అసర్: సాయంత్రం 4:36 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:20 గంటలకు
ఇష: రాత్రి 7.32 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
తేది: సెప్టెంబర్ 13, శుక్రవారం
దశమి: రా.10.30 గంటలకు
పూర్వాషాఢ: రా.9.35 గంటలకు
వర్జ్యం: ఉ.7.21-8.56 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉ.8.23-9.12 గంటల వరకు,
మ.12.27-1.16 గంటల వరకు,
✵సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత
✵TG: బీఆర్ఎస్ హయాంలో పీఏసీ పదవి MIMకి ఎందుకిచ్చారు? : రేవంత్
✵ఏపీ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి: సీఎం చంద్రబాబు
✵TG: కౌశిక్ రెడ్డి, అరికెపూడి సవాళ్లతో ఉద్రిక్తత.. ఇద్దరిపై కేసు నమోదు
✵సైబరాబాద్ సీపీ ఆఫీస్ ఎదుట ధర్నా.. హరీశ్ రావు అరెస్ట్
✵AP:ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల గడువు పొడిగింపు
✵ఎకరాకు రూ.25 వేల పరిహారమివ్వాలి: YS షర్మిల
TG: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంట్లో రేపు పార్టీ కీలక సమావేశం జరుగుతుందని బీఆర్ఎస్ ప్రకటించింది. తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని గాంధీ వ్యాఖ్యానించడంతో బీఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు నివాసం నుంచి గాంధీ ఇంటికి బయల్దేరి వెళ్లనున్నట్లు వెల్లడించింది. ఈ భేటీలో పాడి కౌశిక్ రెడ్డి కూడా పాల్గొంటారని తెలిపింది. కాగా కేశంపేట పీఎస్ నుంచి బీఆర్ఎస్ నేతలు విడుదలయ్యారు.
జరుగుతున్నది పోలీసుల సమావేశం. మాట్లాడుతున్నది హోం మంత్రి. అలాంటి చోట ఏకంగా ఆ మంత్రి హ్యాండ్బాగే చోరీకి గురైంది. UKలో ఈ ఘటన జరిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి మంత్రి పర్సును రికవర్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో దొంగలు పెరిగారని సదరు మంత్రి డేమ్ డయానా విమర్శించారు. జైళ్లలో రద్దీ తగ్గించేందుకు కొంతమంది ఖైదీలను విడుదల చేయాలని సర్కారు నిర్ణయించిన రోజే ఈ చోరీ జరగడం గమనార్హం.
ప్లాస్టిక్ మన జీవితాల్లో భాగమైపోయింది. ఆఖరికి చిన్నపిల్లలకు కూడా ప్లాస్టిక్ బాటిల్స్లో పాలు ఇస్తున్నాం. ఇది ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వేడిచేసిన పాలను అందులో పోస్తే మైక్రోప్లాస్టిక్ పిల్లల కడుపులోకి వెళ్లి జీర్ణసంబంధిత సమస్యలు వస్తాయంటున్నారు. వారి ఎదుగుదల, రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. హైక్వాలిటీ స్టీల్ బాటిళ్లు లేదా గ్లాస్లో పాలు ఇవ్వడం సురక్షితమంటున్నారు.
డైరెక్టర్ శంకర్-సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్లో తెరకెక్కిన బ్లాక్బస్టర్ మూవీ శివాజీ మరోసారి థియేటర్లలో అలరించనుంది. ఈ నెల 20న 4K వెర్షన్లో మేకర్స్ రీరిలీజ్ చేయనున్నారు. కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో టికెట్ ధర రూ.99 మాత్రమే ఉంటుందని తెలిపారు. 2007లో విడుదలైన ఈ చిత్రంలో సుమన్, శ్రియా, వివేక్, రఘువరన్ కీలక పాత్రల్లో నటించారు. 2012లో ఈ మూవీని 3D డాల్బీ అట్మాస్లో రీరిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
AP: వరద నష్టం ఎన్యూమరేషన్ ప్రక్రియలో జాప్యం జరగడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టం అంచనాలకే ఇంత ఆలస్యమైతే బాధితులకు పరిహారం ఎప్పటికి ఇవ్వగలమని అధికారులను నిలదీశారు. రేపటిలోగా ఎన్యూమరేషన్ పూర్తిచేయాలని ఆదేశించారు. ఇది పూర్తయితేనే కేంద్రానికి వివరాలు పంపగలమనే విషయాన్ని గుర్తుపెట్టుకుని పనిచేయాలని సూచించారు.
TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఏఎస్పీ రవిచందన్ ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. తన ఇంటిపై దాడి చేసిన అరెకపూడి గాంధీపై కేసు నమోదు చేయాలంటూ కౌశిక్ సహా బీఆర్ఎస్ నేతలంతా సైబరాబాద్ సీపీ ఆఫీస్ వద్ద సాయంత్రం ఆందోళనకు దిగారు. ఈక్రమంలోనే పోలీసులతో కౌశిక్ గొడవకు దిగారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.