India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పశ్చిమ బెంగాల్లో బంగాళదుంపల ధరలు పెరగడంతో ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయొద్దని సీఎం మమతా బెనర్జీ ఆదేశించారు. కాగా వ్యాపారులు ‘పుష్ప’ మూవీ తరహాలో వాటిని అక్రమంగా తరలిస్తూ పట్టుబడుతున్నారు. బెంగాల్, ఝార్ఖండ్ సరిహద్దులో రెండ్రోజుల్లో పోలీసులు 20కి పైగా లారీలను సీజ్ చేశారు. వాహనాల పైభాగంలో పశువుల మేత, కింద బంగాళదుంపల బస్తాలను అమర్చి కొందరు చేస్తున్న స్మగ్లింగ్ను పోలీసులు అడ్డుకున్నారు.

AP: రేషన్ బియ్యంతో తమ కుటుంబానికి సంబంధం లేదని, సిట్ విచారణకైనా సిద్ధమని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. 6 నెలల నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే ప్రభుత్వం ఎందుకు కంట్రోల్ చేయలేదని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టును నాశనం చేయొద్దని కోరారు. ప్రభుత్వ చర్యలతో ఎగుమతిదారులు భయపడుతున్నట్లు చెప్పారు. కేసులు ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసన్నారు.

TG: దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అయినా రూ.21వేల కోట్ల రుణమాఫీ జరిగిందా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలను ప్రశ్నించారు. ఒకవేళ జరిగినట్లు నిరూపిస్తే తామంతా వచ్చి క్షమాపణలు చెబుతామని ప్రధాని మోదీ, కేసీఆర్లకు సవాల్ విసిరారు. దేశంలో BJP ఎక్కడైనా రుణమాఫీ చేసిందా అని ప్రశ్నించారు. ఫార్మాసిటీ కడతామంటే, ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామంటే అడ్డుపడుతున్నాయని, రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందని సీఎం నిలదీశారు.

కొన్ని ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెడితే అధిక వడ్డీ రేటుతో దీర్ఘకాలంలో మంచి రాబడి వస్తుందని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. అలాంటి కొన్ని స్కీములు..
➤ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్: 8.2%
➤ సుకన్య సమృద్ధి యోజన : 8%- 8.2%
➤ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్: 7.7%
➤ కిసాన్ వికాస్ పాత్ర: 7.5%
➤ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్: 7.4%
➤ పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్: 7.1%

అడిలైడ్లో జరుగుతున్న BGT రెండో టెస్టులో బౌలింగ్ చేస్తూ టీమ్ఇండియా బౌలర్ బుమ్రా ఇబ్బంది పడ్డారు. 81వ ఓవర్ వేస్తున్న సమయంలో గ్రౌండ్లో కిందపడగా, ఫిజియో వచ్చి చికిత్స అందించారు. బుమ్రాకు గాయమైందనే ఆందోళన నేపథ్యంలో బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ క్లారిటీ ఇచ్చారు. గాయం కాలేదని కేవలం కాళ్లు తిమ్మిరెక్కాయన్నారు. రెండో ఇన్సింగ్స్లో 128/5 వద్ద ఉన్న భారత్ గెలవాలంటే బుమ్రా మరోసారి చెలరేగాల్సిన అవసరం ఉంది.

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాల్లో భాగంగా నేడు HYD ట్యాంక్బండ్పై ఎయిర్ షో నిర్వహించనున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో షో జరగనుండగా, సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎయిర్ షో జరగనుంది. దీంతో మధ్యాహ్నం 2 గంటల నుంచి షో ముగిసే వరకు ట్యాంక్బండ్పై ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

భారతీయ వంటల్లో పసుపు ఓ భాగం. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అలాగని అధికంగా పసుపు వాడితే ఆరోగ్య సమస్యలొస్తాయని నిపుణులు అంటున్నారు. డయేరియా, గ్యాస్ సమస్యలతో పాటు పసుపులో ఉన్న వేడి కలిగించే లక్షణం అలర్జీకి కారణమవుతుందట. గర్భిణీలు పసుపు తీసుకునే విషయంలో జాగ్రత్తలు వహించాలని, మోతాదు మించితే గర్భాశయ కండరాలపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.

TG: KCR, రేవంత్ కవల పిల్లలని, ఆ పార్టీల DNA ఒకటే అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం రాబోతోందని తెలిపారు. పదేళ్లలో KCR, ఏడాది గడిచినా రేవంత్ ఒక్క రేషన్ కార్డ్ ఇవ్వలేదన్నారు. హామీలను కాంగ్రెస్ మరిచిపోయిందని ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్కి 8 సీట్లు, BJPకి 8 సీట్లు వచ్చాయని, రాష్ట్రంలో BJP బలపడాలని ప్రజలు కోరుకుంటున్నారని సరూర్నగర్ సభలో చెప్పారు.

AP: సీఎం చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి అసభ్య వ్యాఖ్యలు చేయడం బాధాకరమని మంత్రి గొట్టిపాటి రవి అన్నారు. ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినా వైసీపీ నేతల బుద్ధి మారలేదని ఎద్దేవా చేశారు. అధికారం ఇచ్చింది ప్రతీకారం తీర్చుకునేందుకు కాదని వైసీపీ గుర్తించాలని చెప్పారు. అక్రమ కేసులతో చంద్రబాబును జైలుకు పంపినందుకే ప్రజలు ఛీకొట్టారన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడమనేది కల అని మంత్రి వ్యాఖ్యానించారు.

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Sorry, no posts matched your criteria.