News September 12, 2024

రాహుల్ గాంధీ-ప్రణితి షిండే పెళ్లంటూ ప్రచారం!

image

దేశంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కమ్ పొలిటీషియన్ రాహుల్ గాంధీ(54) త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే కుమార్తె, సోలాపూర్ ఎంపీ ప్రణితి షిండే(44)ను ఆయన వివాహం చేసుకుంటారని సమాచారం. దీంతో వారిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీనిపై ఇరు కుటుంబాలు, కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రకటనా చేయలేదు.

News September 12, 2024

ఏచూరి భౌతికకాయం AIIMSకు అప్పగింత

image

అనారోగ్యంతో <<14084560>>చనిపోయిన<<>> సీతారాం ఏచూరి పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఎల్లుండి సీపీఎం కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్‌కు తీసుకురానున్నారు. ఆయనకు చైనా, వియత్నాం, రష్యా, వెనిజుల కమ్యూనిస్టు నేతలు నివాళులర్పించనున్నారు. కాగా బోధన, పరిశోధనల కోసం ఏచూరి భౌతికకాయాన్ని కుటుంబీకులు ఢిల్లీ AIIMSకు డొనేట్ చేశారు.

News September 12, 2024

ఏపీ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి: సీఎం చంద్రబాబు

image

AP: రెండు రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం ఇవాళ సచివాలయంలో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంట నష్టం, భారీగా ఆస్తి నష్టం జరిగిందని సీఎం వారికి వివరించారు. ఏపీ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరారు. ప్రాథమికంగా రూ.6,882 కోట్ల నష్టం వాటిల్లిందని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపిన విషయం తెలిసిందే.

News September 12, 2024

సీతారాం ఏచూరితో సంభాషణలు మిస్సవుతా: రాహుల్ గాంధీ

image

అనారోగ్యంతో కన్నుమూసిన కమ్యూనిస్టు దిగ్గజం సీతారాం ఏచూరికి రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబం, స్నేహితులు, అనుచరులకు సానుభూతి వ్యక్తం చేశారు. ‘సీతారాం ఏచూరి ఓ స్నేహితుడు. భారత్ అన్న ఆలోచనకు రక్షకుడు. దేశంపై ఆయనకు మంచి అవగాహన ఉంది. తరచూ మా మధ్య జరిగే సంభాషణలను ఇకపై నేను మిస్సవుతాను’ అని ట్వీట్ చేశారు. కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలూ ఏచూరి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

News September 12, 2024

కోలుకుంటున్న రవితేజ.. LATEST PHOTO

image

హీరో రవితేజకు ఇటీవల షూటింగ్‌లో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అభిమానులు ఆందోళనకు లోనవుతుండటంతో చిన్నగాయమేనని రవితేజ అప్‌డేట్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ప్రమాదం తర్వాత తొలిసారిగా రవి ఫొటో బయటికొచ్చింది. డైరెక్టర్ బాబీతో భేటీ అనంతరం తీసిన ఆ ఫొటోలో ఆయన చేతికి కట్టుతో కనిపిస్తున్నారు. దీంతో రవితేజ త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్స్‌లో పాల్గొనాలంటూ ఫ్యాన్స్ విష్ చేస్తున్నారు.

News September 12, 2024

BRS హయాంలో పీఏసీ పదవి MIMకి ఎందుకిచ్చారు? : రేవంత్

image

TG: BRS నేతలు సైకలాజికల్ గేమ్ ఆడుతున్నారని CM రేవంత్ మండిపడ్డారు. ఎవరి కోసం ప్రత్యేక రాజ్యాంగం ఉండదన్నారు. ‘BRS హయాంలో పీఏసీ పదవి MIMకి ఎందుకిచ్చారు? ఎవరూ పార్టీ మారకపోతే మాకే మేలు. అసెంబ్లీలో మా బలం 65. BJP, BRS మా ప్రభుత్వాన్ని 3నెలల్లో కూల్చేస్తాం అంటున్నాయి. ఫిరాయింపు చట్టం కఠినంగా ఉంటే ఆ పరిస్థితి రాదు. హైకోర్టు తీర్పుని అధ్యయనం చేయలేదు. దానిపై ఇప్పుడే స్పందించలేను’ అని అన్నారు.

News September 12, 2024

పేదల సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన మేధావి: CBN

image

AP: సీతారాం ఏచూరి మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ‘అట్టడుగు వర్గాలతో ఏచూరికి మంచి అనుబంధం ఉంది. పేదల సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన మేధావి. దేశ రాజకీయాల్లో గౌరవస్థానం పొందారు’ అని చంద్రబాబు అన్నారు. ప్రజాపోరాట యోధుడిని కోల్పోయామని మంత్రి లోకేశ్ అన్నారు. ఏచూరికి కన్నీటి నివాళి అర్పిస్తున్నట్లు చెప్పారు.

News September 12, 2024

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌కు భారత్

image

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు సెమీస్‌కు చేరింది. కొరియాపై నేడు జరిగిన మ్యాచ్‌లో 3-1 గోల్స్ తేడాతో గెలుపొంది లీగ్ దశలో మరో మ్యాచ్ మిగిలుండగానే సెమీస్‌లో అడుగు పెట్టింది. టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా దిగిన భారత్, లీగ్ దశలో ఇప్పటి వరకూ ఓడిపోలేదు. హర్మన్‌ప్రీత్ సేన ఈ నెల 14న లీగ్ చివరి మ్యాచ్ పాకిస్థాన్‌తో ఆడనుండటం గమనార్హం.

News September 12, 2024

పాత పాటలు ఇష్టం.. న్యూస్ ఛానళ్లు చూడని ఏచూరి

image

సీతారాం ఏచూరికి 1960-70ల నాటి హిందీ పాటలంటే ఇష్టం. హిందీ, ఇంగ్లిష్ సినిమాలు చూసేవారు. న్యూస్ ఛానళ్లు మాత్రం అస్సలు చూడనని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దేవుడంటే నమ్మకం లేదని, ఆధ్యాత్మిక ఉన్నతికి, మతానికి సంబంధం లేదన్నారు. నాస్తిక ఆధ్యాత్మికతను విశ్వసిస్తా అనేవారు. పొలిటీషియన్ కాకుంటే బహుశా ఎకనామిక్ ఫ్రొఫెసర్, పొలిటికల్ విద్యావేత్త అయ్యేవాడినన్నారు. తనపని గురించి ఆలోచిస్తూ రాత్రుళ్లు నిద్రపోయేవారు కాదు.

News September 12, 2024

ఏచూరి పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం: రేవంత్

image

TG: సీతారాం ఏచూరి మరణంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏచూరి చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తి దాయకమన్నారు. ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటని అభిప్రాయపడ్డారు. రాజ్యసభ ఎంపీగా, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యునిగా, ఆర్థికవేత్తగా, సామాజిక కార్యకర్తగా ఆయన దేశంలో అందరికీ సుపరిచితులయ్యారని.. ఏచూరి లేని లోటు పూడ్చలేనిదని సీఎం అన్నారు.