News October 17, 2024

సీఎం రేవంత్ కామెంట్స్‌పై రేపు మాట్లాడతా: KTR

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్‌మీట్‌పై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. మూసీ పునరుజ్జీవం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను రేపు సాయంత్రం 4 గంటలకు బీఆర్ఎస్ భవన్‌లో ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తానని ఆయన ట్వీట్ చేశారు. మూసీ ప్రాజెక్ట్‌ గురించి సీఎం రేవంత్ చేసిన కామెంట్స్‌పై మాట్లాడతానని చెప్పారు.

News October 17, 2024

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. మళ్లీ వర్షాలు

image

AP: ఈనెల 22న మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని IMD ప్రకటించింది. దీని ప్రభావంతో రేపు కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, NTR, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని వెల్లడించింది. కాగా వాయుగుండం ఇవాళే తీరం దాటిన విషయం తెలిసిందే.

News October 17, 2024

‘జై హనుమాన్‌’లో హీరోగా రిషబ్ శెట్టి?

image

ప్రశాంత్‌వర్మ తెరకెక్కించనున్న ‘జై హనుమాన్‌’లో హీరోగా కన్నడ స్టార్ హీరో రిషబ్‌శెట్టి నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ డైరెక్షన్‌లో తేజా సజ్జ హీరోగా వచ్చిన ‘హనుమాన్’ పెద్ద హిట్టయిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే దానికి కొనసాగింపుగా తెరకెక్కించనున్న ‘జై హనుమాన్‌’లో ఎవరు లీడ్ రోల్ పోషిస్తారనే ఆసక్తి నెలకొంది. రిషబ్‌శెట్టి ‘కాంతార’తో తెలుగులోనూ పాపులర్ అయ్యారు. ఈ ఎంపికపై మీ కామెంట్?

News October 17, 2024

వృద్ధాప్యంలోనూ కలలు నెరవేర్చుకుంటున్నారు!

image

ఎంతో కష్టమైన NEETలో వృద్ధులు ఉత్తీర్ణులై సత్తా చాటుతున్నారు. వైద్యులు కావాలన్న తమ కలను సాకారం చేసుకుంటున్నారు. SBI రిటైర్డ్ ఉద్యోగి NEETలో సీటు పొందగా.. MHRTCలోని రిటైర్డ్ జూ.అసిస్టెంట్‌(64 ఏళ్లు) రాజేంద్ర భావ్‌సర్‌ కూడా వైద్య విద్య కోర్సులో చేరారు. తన పేరు ముందు డా. ఉండాలనే కోరికను నెరవేర్చుకోనున్నారు. NEET UG పరీక్ష రాయగా MBBS/BDS సీటు వచ్చింది. కానీ, స్పీచ్-లాంగ్వేజ్ పాథాలజీలో చేరారు.

News October 17, 2024

46 పరుగులకు ఆలౌట్.. కెప్టెన్ రోహిత్ ఏమన్నారంటే?

image

న్యూజిలాండ్‌తో టెస్టులో తొలి ఇన్నింగ్సులో భారత్ 46 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పిచ్‌ను తానే తప్పుగా అంచనా వేసినట్లు కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పారు. పిచ్ ఫ్లాట్‌గా ఉంటుందని భావించానని, సరిగా అర్థం చేసుకోలేకపోయానన్నారు. మరోవైపు రాహుల్ స్థానాన్ని పదే పదే మార్చడం ఇష్టం లేకనే కోహ్లీని ఫస్ట్ డౌన్‌లో పంపినట్లు పేర్కొన్నారు. జట్టులో ప్లేయర్లు సామర్థ్యానికి తగినట్లుగా ఆడలేకపోయారన్నారు.

News October 17, 2024

లాకర్లోని వస్తువులు పోతే పరిహారం వస్తుందా?

image

బ్యాంకులను బట్టి పరిహారం వేరుగా ఉంటుంది. దొంగతనం, తడిచి పాడవడం, షాట్ సర్క్యూట్ వంటి కారణాలతో లాకర్లోనివి దెబ్బతిన్నా, పోయినా పూర్తి నష్టం భర్తీ కాదు. కొన్ని బ్యాంకులు అద్దెకు 100 రెట్ల వరకు క్లెయిమ్ ఇస్తాయి. ఇంకొన్ని బ్యాంకులు లాకర్లలో కస్టమర్లు ఏం ఉంచుతారో చూడము కాబట్టి ఏ పరిహారం ఇవ్వమంటున్నాయి. అందుకే లాకర్ తీసుకునే ముందే ఈ రూల్స్ తెలుసుకోవాలి. లాకర్లో డబ్బు ఉంచరాదు కాబట్టి నోట్లు పోతే ఇక అంతే.

News October 17, 2024

నువ్వో వెదవ.. నువ్వు హౌలే: రేవంత్VsKTR

image

TG: రాష్ట్ర రాజకీయాలు బూతులమయంగా మారుతున్నాయి. ఈరోజు మూసీ పునరుజ్జీవన ప్రజెంటేషన్‌ ఇస్తూ సీఎం రేవంత్.. కేటీఆర్‌ను వెదవ అని సంబోధించారు. మరోవైపు తెలంగాణ భవన్‌లో హైడ్రా బాధితులతో సమావేశమైన KTR.. రేవంత్‌ను ‘ఓ హౌలే సీఎం’ అని తీవ్ర పదజాలం వాడారు. మేస్త్రీ ఇళ్లు కడితే ‘వీడు కూల్చివేస్తాడు’ అని హాట్ కామెంట్స్ చేశారు. వీళ్ల వ్యాఖ్యలపై మీ కామెంట్?

News October 17, 2024

KTR.. రాజ్‌నాథ్ కారు కింద పడుకోకపోయినవ్?: రేవంత్

image

TG: దామగుండం రాడార్ స్టేషన్‌పై KTR అనవసర రాద్ధాంతం చేస్తున్నారని CM రేవంత్ మండిపడ్డారు. ‘111 జీవో కింద గండిపేట వద్ద ఫాంహౌస్ కట్టుకున్న బుద్ధిలేని ఎదవ నీతులు చెబుతున్నారు. దేశ రక్షణ విషయంలో కొన్నిసార్లు రాజీపడాలి. మొన్న రాజ్‌నాథ్ సింగ్ వచ్చినప్పుడు నిరసన తెలపాల్సింది. ఆయన కారు కింద పడుకోకపోయినవ్? ఎవరు వద్దన్నారు? నిన్ను ఎవరైనా హౌస్ అరెస్ట్ చేశారా? లేదు కదా?’ అని ప్రశ్నించారు.

News October 17, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నారాయణపేట, గద్వాల, నాగర్ కర్నూల్, MBNR, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, జనగామ, వరంగల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, NZB, జగిత్యాల, కరీంనగర్, కొత్తగూడెం, ఖమ్మం తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది.

News October 17, 2024

‘ఎమర్జెన్సీ’కి సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది: కంగన

image

తన సినిమా ఎమర్జెన్సీకి సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిందని నటి కంగనా రనౌత్ వెల్లడించారు. సర్టిఫికేట్ రావడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామన్నారు. అభిమానులు సహనంతో ఉండి మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాగా ఇందులో ఇందిరా గాంధీని, ఒక వర్గం ప్రజలను తప్పుగా చూపించారంటూ అభ్యంతరాలు వ్యక్తం అయిన సంగతి తెలిసిందే.