India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
2003లో రిలీజైన ‘దేవదాస్’ సినిమా షారుఖ్ ఖాన్ కెరీర్లో ఓ లాండ్ మార్క్ మూవీగా నిలిచింది. అయితే ఆ సినిమాలో తాను నటించాలనుకోలేదని ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. ‘నా కెరీర్లో అప్పటి వరకు భారీతనంతో కూడిన సినిమా లేదు. స్వర్గంలో ఉన్న నా తల్లిదండ్రులు నన్ను చూస్తుంటారని నా నమ్మకం. వారు పైనుంచి నన్ను చూసి గర్వపడేలా చేయాలనుకున్నాను. అందుకే సన్నిహితులు వద్దన్నా ఆ సినిమా ఒప్పుకొన్నాను’ అని వివరించారు.
అస్సాంలోని డిమా హసావో జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. అగర్తల-ముంబై మధ్య నడిచే లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్(12520) పట్టాలు తప్పింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు సా.4 గంటలకు డిమా హసావో జిల్లాలోని దిబ్లాంగ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రైలు ఇంజిన్, నాలుగు కోచ్లు పట్టాలు తప్పినట్లు సమాచారం. ప్రాణనష్టం జరిగిందా? అనేది తెలియాల్సి ఉంది.
TG: మూసీ ప్రాజెక్ట్ పనులు దక్కించుకున్న సంస్థపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని CM రేవంత్ ఫైర్ అయ్యారు. ‘ముచ్చింతల్లో KCR, మైహోం రామేశ్వర్, చినజీయర్ కలిసి సమతామూర్తి విగ్రహం ఏర్పాటు చేశారు. దాన్ని అద్భుతమంటూ స్వయంగా PM మోదీనే వచ్చి ఆవిష్కరించారు. ఆ విగ్రహం కట్టిన సంస్థే ఇప్పుడు మూసీ ప్రాజెక్ట్ పనులు చేపడుతోంది. అప్పుడు లేని ఆరోపణలు, అపోహలు ఇప్పుడెందుకు వస్తున్నాయి?’ అని ప్రశ్నించారు.
AP: టీడీపీ నేత గాజుల ఖాదర్ బాషా తనను లైంగికంగా వేధించారని ఓ యువతి ఆరోపించింది. రేషన్ కార్డు, ఇంటి స్థలం, పెన్షన్ ఇప్పిస్తానని నమ్మించి లైంగిక దాడి చేశారని పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఖాదర్ బాషా రాష్ట్ర మంత్రికి ప్రధాన అనుచరుడని సమాచారం. ఈ ఆరోపణలపై ఖాదర్ బాషా స్పందించాల్సి ఉంది.
NOTE: బాధితురాలి ప్రైవసీ దృష్ట్యా వీడియోను పబ్లిష్ చేయడం లేదు.
బెంగళూరు వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ 134 పరుగుల ఆధిక్యంలో ఉంది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా బ్యాటర్లు చేతులెత్తేయడంతో 46 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్కు దిగిన NZ రెండో రోజు ఆట ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. కాన్వే(91), యంగ్(33) పరుగులు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్, అశ్విన్, జడేజా తలో వికెట్ తీశారు.
TG: రాష్ట్రాన్ని, నగరాన్ని బాగుచేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తనకు ఇప్పటికే ఆస్తి, అంతస్తులు, పదవి అన్నీ వచ్చాయని చెప్పారు. ఈ సమయంలో ఎవ్వరినో మోసం చేయాల్సిన అవసరం లేదన్నారు. మూసీ ప్రాజెక్టుకు వెచ్చించే రూ.1.50 లక్షల కోట్లలో తాము ఒక్క రూపాయి కూడా ఆశించట్లేదని సీఎం తెలిపారు. తమ మంత్రులు కూడా ప్రజలకు మేలు చేసేందుకే పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
యూపీలోని బిజ్నోర్ జిల్లాలో రైతు తగ్వీర్ సింగ్(60) తనపై దాడి చేసిన చిరుతను కొట్టి చంపారు. కలాఘర్ ప్రాంతంలోని భిక్కవాలా గ్రామంలో తగ్వీర్ తన పొలంలో పని చేస్తుండగా ఓ చిరుత అకస్మాత్తుగా దాడి చేసింది. అతడిని పొదల్లోకి తీసుకెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అయితే తన దగ్గరున్న కర్రతో చిరుత తలపై బాదడంతో అది మృతి చెందింది. తగ్వీర్ పరిస్థితి సైతం విషమంగా ఉంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకునే నేతలు మూడు నెలలు ఆ పరీవాహక ప్రాంతంలో ఉండాలని CM రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. KTR,హరీశ్, ఈటల మూసీ ఒడ్డున ఇళ్లలో ఉంటే తానే కిరాయి చెల్లిస్తానన్నారు. లేదంటే ఖాళీ చేయించిన ఇళ్లలో అయినా ఉండొచ్చన్నారు. ఆ టైంలో వారికి ఆహారం సహా ఇతర సౌకర్యాలూ చెల్లించాలని కమిషనర్ దానకిషోర్ను ఆదేశిస్తున్నట్లు చెప్పారు. వారు ఉండలేరని, ఉంటే ఈ ప్రాజెక్టు వెంటనే ఆపేస్తానని CM ఛాలెంజ్ విసిరారు.
ఇండియాలోని యూజర్లకు షాకిచ్చేందుకు అమెజాన్ ప్రైమ్ సిద్ధమైంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు వచ్చే ఏడాది నుంచి తమ ప్లాట్ఫామ్లో యాడ్స్ను జోడించనున్నట్లు ప్రకటించింది. యాడ్ ఫ్రీ కంటెంట్ కోసం మరింత ధర వెచ్చించి సబ్స్క్రిప్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటి రేట్ల వివరాలను త్వరలోనే వెల్లడించనుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా, కెనడా, US, UK తదితర దేశాల్లోని యూజర్లకు యాడ్స్తో కూడిన కంటెంట్ను ప్రైమ్ అందిస్తోంది.
అడ్వాన్స్ బుకింగ్ రిజర్వేషన్ పీరియడ్ను 120 నుంచి 60 రోజులకు తగ్గిస్తూ ఇండియన్ రైల్వే తీసుకున్న నిర్ణయం <<14380594>>IRCTC<<>>పై నెగటివ్ ఇంపాక్ట్ చూపించింది. నేడు ఆ షేర్లు 2.3% అంటే రూ.21.70 నష్టపోయి రూ.870 వద్ద క్లోజయ్యాయి. ఈ సంస్థకు 80-85% ఆదాయం ఆన్లైన్ బుకింగ్ ద్వారా వస్తుండటమే ఇందుకు కారణం. రైల్వే నిర్ణయంతో రెవెన్యూ తగ్గొచ్చని ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు. లైఫ్టైమ్ హై నుంచి IRCTC షేర్లు 25% నష్టపోయాయి.
Sorry, no posts matched your criteria.