India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రముఖ పిజ్జా తయారీ సంస్థ డొమినోస్ తన బిజినెస్ మార్కెటింగ్ను పెంచుకోవడంలో ఎప్పుడూ కొత్త ఎత్తుగడలతో ఆశ్చర్యపరుస్తుంటుంది. పిజ్జా హట్ వల్ల ఇబ్బందులు ఎదురవడంతో గతంలో ‘పేవింగ్ ఫర్ పిజ్జా’ అనే క్యాంపెయిన్ను విదేశాల్లో డొమినోస్ స్టార్ట్ చేసింది. దీనిద్వారా కస్టమర్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చింది. ఇలా 21వేల గుంతలు పూడ్చగా ఒక్కసారిగా 14 శాతం అమ్మకాలు పెరిగాయి.
AP: ప్రకాశం బ్యారేజీ కౌంటర్ వెయిట్లను ఢీకొట్టిన బోట్లు YCP నేతలకు చెందినవేనని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. బ్యారేజీని కూల్చివేసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకురావాలనే కుట్రతోనే బోట్లను ఢీకొట్టేలా చేశారన్నారు. ప్రజాప్రతినిధిగా జగన్ వ్యవహరించట్లేదని దుయ్యబట్టారు. మాజీ ఎంపీ కోసం జైలుకు వెళ్లి పరామర్శించిన జగన్ వరదలతో కష్టాలు అనుభవిస్తున్న ప్రజల బాధలు పట్టావా అని మండిపడ్డారు.
పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ‘దేవర’ సినిమా కన్నడ వెర్షన్కూ ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పారు. అయితే, మొత్తం డబ్బింగ్ను కేవలం 4 గంటల్లోనే పూర్తిచేసినట్లు లిరిసిస్ట్ వరదరాజ్ తెలిపారు. ఎంతో చక్కగా కన్నడలో ఉచ్చరించారని ప్రశంసించారు. గతంలో RRR సినిమా డబ్బింగ్ను 5 గంటల్లో పూర్తిచేస్తే దేవరకు 4 గంటలే తీసుకున్నారని కొనియాడారు. కన్నడ పట్ల ఆయన చూపిస్తోన్న ప్రేమకు ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు.
TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీని కలిసి రాష్ట్రానికి ఆర్థిక సాయం కోరనున్నట్లు తెలుస్తోంది. భేటీ విషయమై సీఎంవో ప్రధాని అపాయింట్మెంట్ కోరింది. వరద నష్టంపై మోదీకి రేవంత్ నివేదిక ఇవ్వనున్నారు. దీంతో పాటు పలువురు కేంద్రమంత్రులను ఆయన కలిసే అవకాశముంది.
వినాయక ఉత్సవాల్లో కొంతమంది యువకులు భక్తితో కాకుండా ఎంజాయ్ చేసేందుకు మండపాలు పెడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. భజన పాటలు వినిపించాల్సిన మండపాల్లో ఐటమ్ సాంగ్స్ వినబడుతున్నాయి. మరికొందరైతే యువతులతో అసభ్యకర డాన్సులు చేయిస్తున్నారు. మద్యం తాగి నిమజ్జన ఉత్సవాల్లో స్టెప్పులేస్తున్నారు. కొన్ని చోట్ల రాజకీయ నాయకులు, హీరోలు, క్రికెటర్ల రూపాల్లో విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
తనపై కొత్తగా వస్తున్న ఆరోపణలపై ఎందుకు స్పందించడం లేదని సెబీ చీఫ్ మాధబీ బుచ్ను US షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ ప్రశ్నించింది. అగోరా అడ్వైజరీ నుంచి డబ్బు అందుకోవడం, పరస్పర విరుద్ధ ప్రయోజనాలపై కాంగ్రెస్ నేత <<14067765>>పవన్ ఖేరా<<>> చేసిన ఆరోపణల్లోని అంశాలను ప్రస్తావిస్తూ Xలో పోస్ట్ పెట్టింది. కొన్నాళ్ల కింద ఆమెపై పెట్టిన పోస్టుల కిందే దీన్నీ జోడించింది. ‘కొన్ని వారాలుగా బుచ్ సైలంట్గా ఉంటున్నారు’ అని పేర్కొంది.
మదర్సాల్లో విద్యాబోధన సమగ్రంగా లేదని NCPCR తెలిపింది. ఇది విద్యాహక్కు చట్టానికి విరుద్ధమంది. UP మదర్సా బోర్డుపై అలహాబాద్ హైకోర్టిచ్చిన తీర్పుపై సవాల్ పిటిషన్ నేపథ్యంలో అఫిడవిట్ సమర్పించింది. ‘మెరుగైన విద్యను పొందే హక్కును మదర్సాలు కాలరాస్తున్నాయి. పిల్లల ఎదుగుదలకు అవసరమైన వాతావరణం, అవకాశాలు అక్కడ లేవు. పైగా ముస్లిమేతరులకు ఇస్లామిక్ విద్యను అందిస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాయి’ అని పేర్కొంది.
తమిళ హీరో విజయ్ ఇటీవల తన సినిమాల్లో సీనియర్ హీరోయిన్లతో నటిస్తున్నారు. ‘ది గోట్’లో స్నేహ, లియోలో త్రిషతో జతకట్టిన ఆయన తన తదుపరి మూవీలో ఫీమేల్ లీడ్ పాత్రకు సిమ్రాన్ను తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మూవీని హెచ్.వినోత్ డైరెక్ట్ చేయనున్నారు. ఇది విజయ్కు చివరి మూవీ కాగా, అనంతరం ఆయన పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి సారించనున్నారు.
పారిస్ పారాలింపిక్స్లో మెడల్ సాధించిన ఆర్చర్ శీతల్ దేవి చేసిన ట్వీట్ వైరలవుతోంది. తనని తాను ఉద్దేశించుకుంటూ మంచి-చెడు రెండూ ఉంటాయని, భయపడకుండా ముందుకెళ్లాలని ఆమె ట్వీట్లో పేర్కొన్నారు. ‘ఎవరికైనా ఉదారంగా సహాయం చేయాలి. సోషల్ మీడియాలో ప్రశంసలు కోరుకోవద్దు. ఎవరినైనా క్షమించాలి, కానీ వారు చేసింది మర్చిపోవద్దు. కష్టంగా ఉన్నా నిజం వైపు ఉండాలి. ప్రియమైన వారితో సంతోష క్షణాలు ఆస్వాదించాలి’ అని తెలిపారు.
రిజర్వేషన్ల రద్దుపై మాట్లాడిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ రిజర్వేషన్ వ్యతిరేక వైఖరిని బయటపెట్టారని HM అమిత్ షా అన్నారు. BJP ఉన్నంత వరకు ఎవరూ వాటిని రద్దు చేయలేరని, జాతి భద్రతకు విఘాతం కలిగించలేరని తెలిపారు. ‘దేశ విభజనకు కుట్రలు చేసేవారికి (JKNC) మద్దతివ్వడం, జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం రాహుల్ గాంధీ, కాంగ్రెస్కు అలవాటుగా మారాయి. భాష, మతం, ప్రాంతం పేరుతో ఆయన చిచ్చు పెడుతున్నారు’ అని విమర్శించారు.
Sorry, no posts matched your criteria.