News October 17, 2024

గ్రూప్-1 అభ్యర్థులను కలుస్తా: కేటీఆర్

image

TG: ఒక్క ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను రద్దు చేయాలంటూ ఆందోళన చేస్తున్న అభ్యర్థులకు ఆయన మద్దతు తెలిపారు. ఇవాళ HYDలోని అశోక్ నగర్ లేదా తెలంగాణ భవన్‌లో వారిని కలుస్తానని ట్వీట్ చేశారు. మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని, అరెస్టు చేసిన అభ్యర్థులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

News October 17, 2024

నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

AP: వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అనంతపురం, సత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, వైఎస్సార్, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వానలు పడతాయని అంచనా వేసింది. వాయుగుండం నేడు తీరం దాటే సమయంలో 55 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే ఆస్కారం ఉందని పేర్కొంది. రాష్ట్రంలోని వివిధ పోర్టులకు హెచ్చరికలు చేసింది.

News October 17, 2024

మరోసారి ‘నామినేటెడ్’ పండుగ?

image

AP: రాష్ట్రంలో మరోసారి నామినేటెడ్ పదవుల భర్తీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నెల 23న రెండో జాబితాను సీఎం చంద్రబాబు విడుదల చేస్తారని సమాచారం. ఈ సారి మహిళా నేతలకు భారీగా పదవులు దక్కే అవకాశముంది. టీడీపీకి 60 శాతం, జనసేనకు 30, బీజేపీకి 10 శాతం చొప్పున కేటాయించనున్నట్లు సమాచారం. ఈ పదవుల కేటాయింపు ముగిసిన వెంటనే టీడీపీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభించనుంది.

News October 17, 2024

కేసులు పరిష్కరించాకే గ్రూప్-1 పరీక్షలు పెట్టాలి: రాకేశ్ రెడ్డి

image

TG: కోర్టు కేసులన్నీ పరిష్కరించిన తర్వాతనే రాష్ట్రంలో గ్రూప్-1 పరీక్షలు నిర్వహించాలని BRS నేత రాకేశ్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘జీఓ 29 వర్సెస్ 55తోపాటు అనేక కేసులు ఉన్నాయి. ప్రభుత్వం వీటిని పరిష్కరించి పరీక్ష నిర్వహిస్తుందా? లేదా పట్టించుకోకుండా నిర్వహిస్తుందా? కోర్టు తీర్పు తర్వాత మళ్లీ మెయిన్స్ పరీక్ష పెడతారా? ఈ విషయంలో అభ్యర్థులు సందిగ్ధంలో ఉన్నారు’ అని ఆయన ట్వీట్ చేశారు.

News October 17, 2024

నేడు హరియాణా సీఎంగా సైనీ ప్రమాణస్వీకారం

image

హరియాణా సీఎంగా రెండోసారి నాయబ్ సింగ్ సైనీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ శాసనసభాపక్షం ఆయన పేరును ఏకగ్రీవంగా ఆమోదించడంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. సైనీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ హాజరుకానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వెళ్లనున్నారు.

News October 17, 2024

IND vs NZ : నేడైనా వరుణుడు కరుణించేనా!

image

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజు ఆట టాస్ కూడా పడకుండానే రద్దు అయ్యింది. ఇవాళ కూడా బెంగళూరులో వర్షం పడే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వరుణుడు కరుణిస్తే మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఇవాళ 15 నిమిషాల ముందే ఆట ప్రారంభించాలని అంపైర్లు నిర్ణయించారు. ఉదయం 9.15 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు కొనసాగనుంది.

News October 17, 2024

డ్రగ్స్, గంజాయి అమ్మేవారు సంఘ విద్రోహులే: సీఎం

image

APలో డ్రగ్స్ నియంత్రణపై ఉక్కుపాదం మోపుతామని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. హోంమంత్రి అనిత నేతృత్వంలో దీనిపై ఓ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. DIG రవికృష్ణ నేతృత్వంలో యాంటీ నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్ నియమించి, 600 మంది సిబ్బందిని కేటాయిస్తున్నామన్నారు. డ్రగ్స్, గంజాయి విక్రయించే వారిని సంఘ విద్రోహులుగా ప్రకటిస్తామన్నారు. అక్రమ మద్యం తీసుకొస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

News October 17, 2024

1.5 మిలియన్ డాలర్లకు అమ్ముడైన ‘GOT’ సింహాసనం

image

గేమ్ ఆఫ్ థ్రోన్స్(GOT) సిరీస్ చూసిన వారికి అందులోని కత్తులతో కూడిన ఐరన్ థ్రోన్ ఎంత కీలకమో తెలిసే ఉంటుంది. ఆ షో అంతా సింహాసనంపై ఆధిపత్యం కోసమే సాగుతుంది. ఐరన్ థ్రోన్‌కు ఉన్న ఫ్యాన్స్ సంఖ్య తక్కువేం కాదు. ఈ నేపథ్యంలో దానికి ఇటీవల నిర్వహించిన వేలంలో ఓ అజ్ఞాత వ్యక్తి ఏకంగా 1.5 మిలియన్ డాలర్లకు దక్కించుకున్నాడు. వేలం సంస్థ హెరిటేజ్ ఆక్షన్స్ ఈ విషయాన్ని వెల్లడించింది.

News October 17, 2024

సానియా మీర్జా మళ్లీ పెళ్లి.. నిజమెంత?

image

పాక్ మాజీ క్రికెటర్ మాలిక్ నుంచి విడాకులు తీసుకున్న సానియా మీర్జా మరోసారి పెళ్లి చేసుకున్నారా? సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది. సనా జావేద్ అనే నటిని మాలిక్ రెండో పెళ్లి చేసుకున్నారు. ఆమె మాజీ భర్త ఉమైర్ జస్వాల్‌కు తాజాగా వివాహం కాగా, అతడు పెళ్లాడింది సానియానేనంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే, సానియా పిల్లలతో కలిసి దుబాయ్‌లో ఉన్నారని.. ఆ వార్తలన్నీ అవాస్తవమని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

News October 17, 2024

VIPలకు NSG భద్రత కట్

image

దేశంలోని వీఐపీలకు ఎన్‌ఎస్‌జీ భద్రతను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై వీరి భద్రతను సీఆర్‌పీఎఫ్ పర్యవేక్షిస్తుందని తెలుస్తోంది. జెడ్ ప్లస్ కేటగిరిలో చంద్రబాబు, యోగి ఆదిత్యనాథ్, అద్వానీ, రాజ్‌నాథ్ సింగ్, మాయావతి, సర్బానంద సోనోవాల్, అజాద్, ఫరూక్ అబ్దుల్లాకు భద్రత ఉపసంహరించనున్నారు. వీరి సెక్యూరిటీని CRPF చూసుకుంటుంది.