News December 7, 2024

తెలంగాణలోనే ఎక్కువ సిజేరియన్లు

image

తెలంగాణలో సిజేరియన్లు ఎక్కువగా ఉన్నట్లు NFHS ఆధారంగా ఢిల్లీలోని జార్జ్ ఇన్‌స్టిట్యూట్ స్టడీ తెలిపింది. ఇక్కడ మొత్తం ప్రసవాల్లో 60.7% సిజేరియన్లేనని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇది 21.5 శాతంగా ఉంది. అత్యల్పంగా నాగాలాండ్‌లో 5.2% సిజేరియన్లు జరుగుతున్నాయి. దక్షిణాదిలోనే సిజేరియన్లు ఎక్కువగా ఉన్నాయి. సహజ ప్రసవాలపై భయం, ముహూర్తాలు చూసుకోవడం, ఆర్థిక స్తోమత వంటి అంశాలు సిజేరియన్లకు కారణాలవుతున్నాయి.

News December 7, 2024

TFDC ఛైర్మన్‌గా నిర్మాత దిల్ రాజు

image

TG: సినీ నిర్మాత దిల్ రాజుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా రాజును నియమిస్తూ CS శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో ఆయన రెండేళ్లపాటు కొనసాగుతారు. కాగా గత ఎన్నికల్లో దిల్ రాజు కాంగ్రెస్ తరఫున MP లేదా MLAగా పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగలేదు. తెర వెనుక ఆయన కాంగ్రెస్‌కు మద్దతిచ్చినట్లు టాక్.

News December 7, 2024

గాజాలో మిన్నంటిన ఆకలి కేకలు

image

ఇజ్రాయెల్ దాడులతో గాజా ప్రజలు ఆహారం లేక అలమటిస్తున్నారు. ఖాన్ యూనిస్‌లో ఉన్న శరణార్థి శిబిరంలోని ఉచిత ఆహారం పంపిణీ చేస్తున్నా ఏమాత్రం సరిపోవడం లేదు. ఆ శిబిరం వద్ద మహిళలు, బాలికలు ఆహారం కోసం పోటీపడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఇప్పటివరకు ఐక్యరాజ్యసమితి ఆహారం పంపిణీ చేసింది. కానీ ఇటీవల దానిని నిలిపివేసింది. దీంతో అక్కడి ప్రజలకు ఆహారం అందటం లేదు.

News December 7, 2024

‘RRR’ రికార్డును బద్దలుకొట్టిన ‘పుష్ప-2’

image

ఓపెనింగ్ డేలో రూ.294 కోట్లు <<14809048>>కొల్లగొట్టిన<<>> పుష్ప-2 భారత సినీ చరిత్రలో తొలిరోజే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. అంతకుముందు ఈ రికార్డ్ RRR పేరిట ఉండేది. ఆ సినిమా వరల్డ్ వైడ్‌గా తొలిరోజు రూ.223 కోట్లు రాబట్టింది. తాజాగా ఆ రికార్డ్‌ను పుష్పరాజ్ బద్దలుకొట్టారు. ఇక నిన్న, ఇవాళ కలిపి ఈ చిత్రం రూ.400 కోట్లపైనే వసూళ్లు చేసే అవకాశం ఉందని సినీవర్గాలు అంటున్నాయి.

News December 7, 2024

నేడు నల్గొండ జిల్లాకు సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటిస్తారు. నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంలో ఉదయసముద్రం ఎత్తిపోతల పథకం ప్రారంభిస్తారు. అలాగే జిల్లాలో చేపట్టబోయే మరో 3 ఎత్తిపోతల పథకాల నిర్మాణ పనులకు CM అక్కడే శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మించిన యాదాద్రి థర్మల్ ప్లాంట్‌ యూనిట్-2ను ప్రారంభిస్తారు. అనంతరం నల్గొండలోని SLBC గ్రౌండ్‌లో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు.

News December 7, 2024

చలికాలంలో వేడి నీటితో స్నానం చేస్తున్నారా?

image

శీతాకాలంలో వేడి నీటితో స్నానం చేయడం వల్ల సౌకర్యవంతంగా ఉంటాం. కానీ అలా చేస్తే ఎన్నో నష్టాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చర్మం పొడిబారి చికాకు, దురద, పగుళ్లు వస్తాయి. శరీర ఉష్ణోగ్రత పెరిగి బీపీ పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే తలనొప్పి, వికారం, డీహైడ్రేషన్ లాంటి సమస్యలు కూడా వస్తాయి. వేడి నీటితో స్నానం వల్ల హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చే ప్రమాదముందని చెబుతున్నారు.

News December 7, 2024

హోమ్ మినిస్టర్‌గా ఏక్‌నాథ్ శిండే?

image

మహారాష్ట్ర హోమ్ మినిస్టర్‌ పోర్ట్‌ఫోలియోను మాజీ సీఎం ఏక్‌నాథ్ శిండే డిమాండ్ చేస్తున్నట్లు మహద్ శివసేన ఎమ్మెల్యే భరత్ గొగవాలే తెలిపారు. దీనిపై మహాయుతి కూటమిలో చర్చలు జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. కాగా మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్‌ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. శిండే డిప్యూటీగా ప్రమాణం చేశారు. ఈ నెల 11 లేదా 16న మంత్రి వర్గ ఏర్పాటు ఉంటుందని సమాచారం.

News December 7, 2024

భోజనంలో నెయ్యి తింటున్నారా?

image

తెలుగింటి భోజనంలో నెయ్యి ఖచ్చితంగా ఉంటుంది. నెయ్యి వెయ్యి రకాలుగా ఉపయోగపడుతుందని పెద్దలు చెబుతారు. ఇది భోజనాన్ని రుచిగా మార్చడమే కాకుండా ఆకలిని పెంచుతుంది. అన్నవాహిక మృదువుగా మారి ఆహారం తేలికగా కిందకు జారుతుంది. ఇది అజీర్ణం, మలబద్దకం, జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఎముకలను బలంగా, చర్మాన్ని ఆరోగ్యంగా, గుండెను పదిలంగా ఉంచుతుంది.

News December 7, 2024

చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ

image

టీమ్ ఇండియా క్రికెటర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించారు. SMAT (సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ) చరిత్రలో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాడిగా అభిషేక్ నిలిచారు. ఇప్పటివరకు ఆయన 4 శతకాలు బాదారు. ఆయన తర్వాత ఉన్ముక్త్ చంద్ (3), రుతురాజ్ గైక్వాడ్ (3), ఇషాన్ కిషన్ (3), శ్రేయస్ అయ్యర్ (3) ఉన్నారు. కాగా మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన సంగతి తెలిసిందే.

News December 7, 2024

నేడు బాపట్లకు చంద్రబాబు, లోకేశ్ పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఇవాళ బాపట్ల జిల్లాలో పర్యటిస్తారు. బాపట్లలోని మున్సిపల్ హైస్కూల్లో జరిగే మెగా పేరెంట్- టీచర్ మీటింగ్‌లో పాల్గొంటారు. ఈ సమావేశంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో వారు చర్చిస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడప మున్సిపల్ స్కూల్లో జరిగే పేరెంట్ మీటింగ్‌కు హాజరవుతారు.