India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజకీయ సభల్లో వేదికపై ఉన్న అతిరథ మహారథులు అంటూ ప్రసంగాలు మొదలుపెడుతుంటారు. అసలు ఆ పదాన్ని ఎవరికి వాడాలి? అతిరథ మహారథులు అంటే ఎవరు? అనే విషయాన్ని తెలుసుకుందాం. యుద్ధంలో పాల్గొన్న యోధుల సామర్థ్యాన్ని తెలిపేందుకు ఈ పదాన్ని వాడతారు. ఏకకాలంలో 5వేల మందితో యుద్ధం చేసేవారిని రథి అని, 60వేల మందితో యుద్ధం చేస్తే అతిరథ అని, 7లక్షల మందితో యుద్ధం చేసేవారిని మహారథి అని అంటారు. వీరు మాత్రమే ఆ పిలుపునకు అర్హులు.
నైరుతి బంగాళాఖాతంలో పశ్చిమ వాయవ్య దిశగా 15 కి.మీ వేగంతో వాయుగుండం కదులుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. చెన్నైకి 280 కి.మీ, పుదుచ్చేరికి 320 కి.మీ, నెల్లూరుకి 370kmల దూరంలో కేంద్రీకృతమైనట్లు పేర్కొంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవించే అవకాశం ఉందని చెప్పింది.
రష్యాకు చెందిన ఓ వ్యక్తి 67 రోజుల పాటు సముద్రంలోనే ఉండి బతికి బట్టకట్టాడు. ఆగస్టు 9న మిఖాయిల్ పిచుగన్ (46), తన సోదరుడు (49), అతడి కుమారుడి(15)తో కలిసి చిన్న పడవలో తిమింగలాలను చూసేందుకు సఖాలిన్ ఐలాండ్కు వెళ్లారు. కొంతదూరం వెళ్లాక బోటు ఇంజిన్ పనిచేయలేదు. పిచుగన్ సోదరుడు, ఆయన కుమారుడు చలికి తట్టుకోలేక చనిపోయారు. దాదాపు 1,000 కి.మీ ప్రయాణించిన తర్వాత పడవ ఉస్త్-ఖెర్యుజోవా తీరానికి కొట్టుకువచ్చింది.
TG: ఐఏఎస్లు ఆమ్రపాలి, వాకాటి కరుణ, రోనాల్డ్ రాస్, వాణి ప్రసాద్ను రిలీవ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కాసేపట్లో ఉత్తర్వులు జారీ చేయనుంది. డీవోపీటీ ఆదేశాల మేరకు ఈ నలుగురూ ఏపీలో రిపోర్ట్ చేయాల్సి ఉంది. వీరు రిలీవ్ కానున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ, టూరిజం, మహిళ-శిశు సంక్షేమశాఖ, GHMC కమిషనర్ను ప్రభుత్వం వేరే అధికారులతో భర్తీ చేయనుంది.
దేశంలో నిరుద్యోగం పెరుగుతోందని ఆందోళన చెందుతున్న వేళ ఉద్యోగార్థులు ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారో ఓ కంపెనీ సీఈవో చెప్పుకొచ్చారు. Entourage కంపెనీ CEO అనన్య నారంగ్ తనకు వచ్చిన జాబ్ అప్లికేషన్ను Xలో పంచుకున్నారు. ఈ జాబ్కు తనకు అన్ని అర్హతలున్నాయని పేర్కొంటూ అనుభవాలు, తన స్కిల్స్ను చెప్పకుండా ఖాళీగా ఉంచేశారు. గూగుల్ నుంచి కాపీ చేసి అలానే పంపించేశారని, సొంతంగా ఆలోచించట్లేదని ఆమె మండిపడ్డారు.
అలనాటి అందాల తార, మాజీ ఎంపీ జయప్రదకు రాంపూర్ MP-MLA కోర్టు ఊరట కల్పించింది. ఎవిడెన్స్ లేని కారణంగా ఆమెపై కేసును కొట్టేసింది. 2019 ఎలక్షన్ల సమయంలో ఆమె ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ఓ రోడ్డును ఆరంభించిన వీడియో వైరలైంది. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఆ విచారణ ఇప్పటికి ముగిసింది. ఒకప్పుడు సమాజ్వాదీ పార్టీలో కీలకంగా ఉన్న జయప్రద ప్రస్తుతం యాక్టివ్ పాలిటిక్స్కు దూరమవ్వడం తెలిసిందే.
నైజీరియాలోని మాజియాలో ఫ్యూయెల్ ట్యాంకర్ పేలి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 94మంది ప్రాణాలు కోల్పోగా దాదాపు 50 మంది గాయపడ్డారు. ఎదురుగా ఉన్న ట్రక్కును తప్పించే క్రమంలో ఈ ట్యాంకర్ పడిపోయింది. అయితే ఫ్యూయెల్ తీసుకొనేందుకు స్థానికులు ఆ ట్యాంకర్ను చుట్టుముట్టారు. ఆ సమయంలోనే ట్యాంకర్ పేలిందని పోలీసులు తెలిపారు.
ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్ ఇండియా గెలవాలంటే శుభ్మన్ గిల్ కచ్చితంగా బాగా ఆడాల్సి ఉంటుందని మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ అభిప్రాయపడ్డారు. ‘భారత్ తరఫున గత పర్యటనల్లో వన్డౌన్ బ్యాటర్ పుజారా అద్భుతంగా ఆడారు. ఇప్పుడు ఆ స్థానంలో గిల్ ఆడుతున్నారు. టెస్టుల్లో గెలుపునకు 3, 4 స్థానాల ఆటగాళ్లు రన్స్ చేయడం కీలకం. ఇది గిల్కి రెండో పర్యటన కాబట్టి అతడిని సీనియర్ ప్లేయర్గానే పరిగణించాలి’ అని పేర్కొన్నారు.
AP: ఉచిత ఇసుక అంశంలో ఫిర్యాదులు రావడంపై CM చంద్రబాబు సీరియస్ అయ్యారు. దీనిపై చర్చించేందుకే ఎల్లుండి పార్టీ సమావేశం నిర్వహిస్తున్నామని క్యాబినెట్ భేటీలో తెలిపారు. ఇసుక అంశంలో MLAల జోక్యంపై వచ్చిన ఫిర్యాదులపై చర్చిస్తామన్నారు. లబ్ధిదారులపై రవాణా ఛార్జీలు తప్ప ఇతర ఛార్జీలు పడకూడదని, ఇసుక తవ్వుకుని తీసుకెళ్తే రుసుము వసూలు చేయొద్దన్నారు. అక్రమాలు జరగకుండా ఇన్ఛార్జ్ మంత్రులు చర్యలు తీసుకోవాలన్నారు.
యూట్యూబ్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. స్లీప్ టైమర్, రీసైజబుల్ మినీ ప్లేయర్, ఫేవరెట్ ప్లే లిస్ట్, బ్యాక్ స్పీడ్ కంట్రోల్ వంటి వాటిని పరిచయం చేసింది. ఈ ఫీచర్లు ఎలా పనిచేస్తాయో స్పష్టంగా వివరించింది. ఒకవేళ యూట్యూబ్ చూస్తూ యూజర్ పడుకున్నా వీడియో పాస్ అయ్యేలా స్లీప్ టైమర్ ఉండనుంది. బ్యాక్ స్పీడ్ 0.25 సెకండ్స్ నుంచి 0.05 సెకండ్స్ చేసుకునేలా వెసులుబాటు కల్పించింది.
Sorry, no posts matched your criteria.