India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓయో రూంలు/హోటళ్లలో ఐడెంటిటీ ప్రూఫ్ కోసం చాలా మంది ఆధార్ కార్డు ఇస్తారు. ఇలా చేయడం వల్ల మోసానికి గురవుతారని, అందులోని డేటాను దొంగిలించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బుకింగ్ టైంలో మాస్క్డ్ ఆధార్ కార్డును ఉపయోగించాలి. ఇందులో ఆధార్ నంబర్లోని మొదటి 8 నంబర్లు కనిపించవు. చివరి 4 అంకెలు మాత్రమే కనిపిస్తాయి. దీంతో మీ వివరాలు సురక్షితంగా ఉంటాయి. ఎవరూ దుర్వినియోగం చేయలేరు.
SHARE IT
కోల్కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలి హత్యాచారంపై నిరసనలు వ్యక్తం చేస్తున్న డాక్టర్లకు సుప్రీం కోర్టు అల్టిమేటం జారీ చేసింది. రేపు సాయంత్రం ఐదింటికల్లా వారంతా తమ విధులకు హాజరుకావాలని తేల్చిచెప్పింది. లేనిపక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలపై భారత వైద్య సంఘం(IMA) బెంగాల్ శాఖ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. వైద్యులకు అండగా నిలుస్తామని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
గుడ్డుతో శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయన్న సంగతి తెలిసిందే. కానీ చాలామంది పసుపు సొనను తినరు. రుచించకో లేక కొవ్వు పెరుగుతుందన్న భయంతోనో ఎగ్ వైట్స్ మాత్రమే తింటుంటారు. అది సరికాదంటున్నారు పోషకాహార నిపుణులు. పచ్చసొనలో విటమిన్ డీ, ఈ, బీ12, కే, బీ2, బీ9 ఉంటాయి. ఎముకల బలోపేతానికి, రోగ నిరోధక శక్తి పెరుగుదలకు, నరాల పనితీరు మెరుగుపడేందుకు, చర్మ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరకమని వారు వివరిస్తున్నారు.
TG: పార్టీ ఫిరాయింపులపై మాజీ మంత్రి హరీశ్ రావు సుద్దపూస కబుర్లు చెప్తున్నారని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు. ‘BRS పాలనలో ప్రతిపక్ష MLAల కోసం బేరసారాలు చేసిన హరీశ్రావుకు ఇప్పుడు రాజ్యాంగం గుర్తొచ్చిందా? రాజ్భవన్లో ప్రతిపక్ష MLAలతో KCR మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయిస్తుంటే ఏం చేశావు?’ అని ఘాటు విమర్శలు చేశారు. పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పును గౌరవిస్తామని చెప్పారు.
TG: వరద బాధితులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ శుభవార్త చెప్పారు. ప్రతి కుటుంబానికీ ₹10వేలు ఇస్తామని గతంలో ప్రకటించగా, దాన్ని ₹16,500కు పెంచినట్లు తెలిపారు. ‘మృతుల కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు, ₹5 లక్షలు అందిస్తాం. ఎకరానికి ₹10వేల నష్టపరిహారం చెల్లిస్తాం. తడిచిన ధాన్యాన్నీ కొనుగోలు చేస్తాం. డాక్యుమెంట్స్ కొట్టుకుపోయిన వారి కోసం పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తాం’ అని పేర్కొన్నారు.
TG: వరద నష్టాన్ని అంచనా వేయడం కోసం ఈ నెల 11న కేంద్ర బృందం రాష్ట్రానికి రానుందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. హోంశాఖ జాయింట్ సెక్రటరీ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులు వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటిస్తారన్నారు. బాధితులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలతో వీరు సమావేశమై నష్ట వివరాలను తెలుసుకుంటారని చెప్పారు.
ముంబై ఇండియన్స్ కనుక రోహిత్ శర్మను రిటెన్షన్ చేయకపోతే వేలంలో అతని కోసం యుద్ధమే జరుగుతుందని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నారు. రోహిత్ను ముంబై వదులుకుంటుందన్న వార్తల నేపథ్యంలో ఇర్ఫాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కెప్టెన్గా ఐదుసార్లు IPL ట్రోఫీ గెలిచిన అపార అనుభవం కలిగిన రోహిత్ జట్టుకు ఎంతో ప్రత్యేకతను తీసుకొస్తాడని అన్నారు. ప్రతి టీం అతనిలాంటి కెప్టెన్నే కోరుకుంటుందని చెప్పారు.
ఒక్కసారి ఛార్జ్ చేసి అత్యధిక దూరం ప్రయాణించిన విద్యుత్ వాహనంగా మెర్సిడెస్ బెంజ్కు చెందిన EQS 580 కారు గిన్నిస్ రికార్డు సృష్టించింది. బెంగళూరు నుంచి నవీ ముంబై వరకు ఒక్కసారి కూడా రీఛార్జ్ చేయకుండా 949 కిలోమీటర్ల పాటు ఆ కారు ప్రయాణించింది. గతంలో ఈ రికార్డు యూకేలో ఫోర్ట్ మస్టాంగ్(916.74 కిలోమీటర్లు) పేరిట ఉండేది. ఈ రికార్డును అటెంప్ట్ చేసిన ‘ఆటోకార్’ సంస్థను మెర్సిడెస్ సంస్థ అభినందించింది.
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించిన క్రెడిట్ ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి దక్కుతుందని పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ అన్నారు. ‘ఏ పార్టీ పునరుజ్జీవంలోనైనా అధినేతే కీలకం. PM నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయంగా పరిగణించే స్థాయికి చేరాలంటే రాహుల్ చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. జాతీయ నాయకుడిగా నిరూపించుకోవడానికి ఆయనకు ఇంకా సమయముంది’ అని PK అభిప్రాయపడ్డారు.
మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్పై జీఎస్టీ రేటు తగ్గింపుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. నవంబర్లో నిర్వహించే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై ప్రకటన చేస్తామని తెలిపారు. జీఎస్టీ తగ్గింపుపై మంత్రులతో ఓ కమిటీ వేశామని, అది అక్టోబర్-నవంబర్ వరకు రిపోర్ట్ ఇస్తుందని వెల్లడించారు. కాగా, ప్రస్తుతం ఆరోగ్య బీమాపై 18% జీఎస్టీ ఉంది. దాన్ని తగ్గించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Sorry, no posts matched your criteria.