News October 16, 2024

బాలయ్య-బోయపాటి కొత్త సినిమా టైటిల్ ఇదే..

image

బాలకృష్ణ, బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త చిత్రం టైటిల్‌ను అనౌన్స్ చేశారు. బ్లాక్‌బస్టర్ హిట్ ‘అఖండ’కు సీక్వెల్‌గా ‘అఖండ-2 తాండవం’ రానున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ట్వీట్ చేసింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని పేర్కొంది. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించనుండగా బాలకృష్ణ కూతురు తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరించనున్నారు.

News October 16, 2024

విషాదం.. గుండెపోటుతో ఐదేళ్ల చిన్నారి మృతి

image

TG: ఐదేళ్ల చిన్నారి గుండెపోటుతో మరణించిన ఘటన కరీంనగర్(D) జమ్మికుంటలో జరిగింది. రాజు-జమున కుమార్తె ఉక్కులు(5) నిన్న ఉదయం కళ్లు తిరుగుతున్నాయని చెప్పింది. చిన్నారిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా హన్మకొండకు రిఫర్ చేశారు. అక్కడ వైద్యులు పరీక్షిస్తుండగా ఉక్కులు చనిపోయింది. ఆమెకు పుట్టినప్పటి నుంచే గుండె సంబంధిత సమస్య ఉండొచ్చని, పేరెంట్స్ గుర్తించకపోవడంతో మృతి చెంది ఉంటుందని వైద్యులు తెలిపారు.

News October 16, 2024

తమిళనాడులో చలికాలంలో వర్షాలు.. ఎందుకిలా?

image

దేశంలో ఎక్కువ భాగాలకు నైరుతి రుతుపవనాల వల్ల జూన్-అక్టోబర్ వరకు వర్షాలు కురుస్తాయి. అయితే పశ్చిమ కనుమల వల్ల నైరుతి రుతుపవనాలు తమిళనాడు తూర్పు తీరానికి విస్తరించలేవు. ఫలితంగా అక్కడ పొడి వాతావరణం ఉంటుంది. నైరుతి రుతుపవనాలు OCTలో హిమాలయాలను తాకి వెనుదిరుగుతాయి. వాటినే ఈశాన్య రుతుపవనాలు అంటారు. ఇవి తమిళనాడుతో పాటు మధ్య, దక్షిణ భారతంలోని కొన్ని ప్రాంతాల్లో DEC వరకు వర్షాలను కురిపిస్తాయి.

News October 16, 2024

ఏంటీ ‘రాడార్ స్టేషన్’?

image

TG: వికారాబాద్ అడవుల్లో నిన్న కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ శంకుస్థాపన చేసిన రాడార్ స్టేషన్‌ పూర్తి పేరు ‘వెరీ లో ఫ్రీక్వెన్సీ(VLF) రాడార్ కమ్యూనికేషన్ స్టేషన్’. ఇండియన్ నేవీకి సంబంధించిన ఓడలు, జలాంతర్గాముల్లోని సిబ్బందితో మాట్లాడటంతో పాటు ఇతర రేడియో కమ్యూనికేషన్‌కు దీన్ని ఉపయోగిస్తారు. ఇది 3 KHz నుంచి 30 KHz రేంజ్‌లో తరంగాలను ప్రసారం చేస్తుంది. ఈ సిగ్నల్ నీటి లోపల కూడా 40మీ. వరకూ వెళ్లగలదు.

News October 16, 2024

సముద్రం లేని తెలంగాణలో రాడార్ స్టేషన్ ఎందుకంటే?

image

సముద్రమే లేని తెలంగాణలో ఇండియన్ నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేయడం వెనుక ఓ కారణం ఉంది. భారత్‌కు తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రంలో నిత్యం నేవీ జలాంతర్గాములు ప్రయాణిస్తూ ఉంటాయి. వాటి కమ్యూనికేషన్‌కు 2 సముద్రాల మధ్య దాదాపు సమాన దూరంలో ఉన్న వికారాబాద్ అడవి సరైనదిగా నేవీ భావించినట్లు సమాచారం. భారత్‌లో ఇది రెండో రాడార్ స్టేషన్. మొదటిది తమిళనాడులోని తిరునల్వేలి వద్ద ఏర్పాటు చేశారు.

News October 16, 2024

నేడు J&K సీఎంగా ఒమర్ ప్రమాణస్వీకారం

image

జమ్మూకశ్మీర్ సీఎంగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11.30 గంటలకు శ్రీనగర్‌లోని ఎస్కేఐసీసీలో ఆయనతో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఇతర కూటమి సభ్యులు హాజరుకానున్నారు. మరోవైపు హరియాణా సీఎం అభ్యర్థిని బీజేపీ నేడో రేపో ప్రకటించే అవకాశం ఉంది.

News October 16, 2024

సికింద్రాబాద్‌లో విగ్రహ ధ్వంసంపై స్పందించిన పవన్

image

TG: సికింద్రాబాద్‌లో ముత్యాలమ్మ <<14352353>>విగ్రహాన్ని<<>> దుండగులు ధ్వంసం చేయడం ఆందోళన కలిగించిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఇది దుర్మార్గమని, దేవాలయాలు, ప్రార్థనా మందిరాలను ఏ మతం వారైనా సామూహికంగా కాపాడుకోవాలన్నారు. గత ఐదేళ్లలో ఏపీలో ఆలయాలను ఇలా అపవిత్రం చేయడం చూసినట్లు పేర్కొన్నారు. ఇలాంటి వాటిని నిలువరించేందుకు కఠిన చర్యలు అవసరమని చెప్పారు.

News October 16, 2024

సంతానం లేని వారికి గుడ్ న్యూస్!

image

TG: ప్రభుత్వాస్పత్రుల్లో ఉచిత ఐవీఎఫ్ సేవలు అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అవసరమైన మెడిసిన్, పరికరాలను కొనుగోలు చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. సమస్య తీవ్రత ఎక్కువగా ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో మాత్రమే IVF సేవలు ఉండగా, ఇకపై జిల్లాల్లోనూ అందుబాటులోకి రానున్నాయి.

News October 16, 2024

VEENA-VANI: విడిపోని బంధానికి 22 ఏళ్లు

image

TG: అవిభక్త కవలలు వీణా-వాణి 22వ వసంతంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం వీరు హైదరాబాద్‌లోని శిశువిహార్‌లో ఉంటూ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. కాగా 2006లో వీరిద్దరినీ వేరు చేసేందుకు ముంబైలోని బ్రీచ్ కండి ఆస్పత్రి వైద్యులు ప్రయత్నించినా కుదర్లేదు. ఆ తర్వాత వివిధ దేశాలకు చెందిన స్పెషలిస్టులు వచ్చినా వారిని విడదీయలేక చేతులెత్తేశారు. వయసు పెరుగుతుండటంతో రోజురోజుకు నరకయాతన అనుభవిస్తున్నారు.

News October 16, 2024

పోలవరానికి రూ.2,348 కోట్లు, 2027 నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశం

image

AP: పోలవరం మెయిన్ డ్యాం పనులకు కేంద్రం రూ.2,348 కోట్లను అడ్వాన్సుగా చెల్లించడంతో ప్రాజెక్టు నిర్మాణాన్ని 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని కాంట్రాక్టు కంపెనీలు మేఘా, బావర్‌లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వారంలోగా డయాఫ్రం వాల్, 14 రోజుల్లోగా ECRF డ్యాం డిజైన్లను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను నవంబర్ 1న ప్రారంభించి 2025 నవంబర్ నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు.