News September 9, 2024

నేడు జీఎస్టీ కౌన్సిల్ 54వ స‌మావేశం

image

ఈ రోజు GST కౌన్సిల్ 54వ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ట‌ర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్‌ పాలసీలు, ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియంలపై జీఎస్‌టీ మిన‌హాయింపు, స్లాబ్ మార్పుల‌పై ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే డిమాండ్లు వెల్లువెత్తాయి. ఇక GST కాంపెన్సేషన్ సెస్‌ కొనసాగింపుపై స్పష్టత వ‌చ్చే అవకాశం ఉంది. సెస్‌ను ఈ ఆర్థిక ఏడాది మొత్తానికి పొడిగించే అవకాశం ఉన్నట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాల స‌మాచారం.

News September 9, 2024

బాధితులకు బాసటగా నిలిచిన ఆపద్బాంధవులు

image

AP: విరామం లేదు. విశ్రాంతి లేదు. ఆగస్టు 31న వరదలు వచ్చినప్పటి నుంచి వాటిల్లో చిక్కుకున్న వారిని రక్షించాలన్న ఏకైక లక్ష్యంతో NDRF, SDRF, పోలీసు, అగ్నిమాపక సిబ్బంది నిరంతరాయంగా, నిర్విరామంగా సేవలు అందించారు . వేల మంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లక్షలాదిగా ఆహారం, నీరు, పాలు ప్యాకెట్లు అందించి వారి ఆకలి తీర్చారు. ముంపు సమయంలో బెజవాడలో విస్తృత సేవలు అందించిన వీరికి సెల్యూట్ చేయాల్సిందే.

News September 9, 2024

Stock Market: నష్టాలతో మొదలు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమ‌వారం న‌ష్టాలబాట‌ప‌ట్టాయి. అమెరికాలో ఆగస్ట్​ నెల జాబ్స్​ డేటా అంచనాల కన్నా తక్కువగా రావడంతో ఆర్థిక మాంధ్యం భయాలు వెంటాడుతున్నాయి. దీంతో సెన్సెక్స్ 200 పాయింట్ల న‌ష్టంతో 80,987 వ‌ద్ద‌, నిఫ్టీ 90 పాయింట్ల న‌ష్టంతో 24,767 వ‌ద్ద ట్రేడ్ అవుతున్నాయి. గ‌త సెష‌న్‌లో అమెరికా స్టాక్​ మార్కెట్​లు భారీగా నష్టపోవ‌డంతో దేశీయ ఇన్వెస్ట‌ర్ల సెంటిమెంట్ బలహీనపడినట్టు తెలుస్తోంది.

News September 9, 2024

కాళోజీకి CM రేవంత్ నివాళులు

image

TG: తెలంగాణ ఉద్యమ ప్రతిధ్వని, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రజా కవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా CM రేవంత్ నివాళులర్పించారు. కాళోజీ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు CM శుభాకాంక్షలు తెలియజేశారు.

News September 9, 2024

బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి తింటున్నారా?

image

నిద్ర లేచిన రెండు గంటలలోగా బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. టిఫిన్ హెవీగా తినవచ్చు. రోజంతా పనులు చేస్తాం కాబట్టి ఎలాంటి సమస్య ఉండదు. బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు, పెరుగు, పనీర్, సాల్మన్ వంటి ప్రొటీన్ ఫుడ్స్ తీసుకోవాలి. అలాగే అల్పాహారంలో ఫైబర్, కార్బొహైడ్రేట్స్ ఉండేలా చూసుకోవాలి. ఫ్రూట్ జ్యూస్, వైట్ బ్రెడ్, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. మాంసం, సమోసా, పకోడీ, పూరీ వంటివి తీసుకోవద్దు.

News September 9, 2024

రూల్స్ అతిక్రమిస్తే లైసెన్స్ రద్దు: మంత్రి పొన్నం

image

TG: రోడ్డు భద్రత నిబంధనలు అతిక్రమిస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దుతో పాటు కఠిన శిక్షలు పడేలా చట్టం తీసుకొస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, రోడ్డు ప్రమాదాలు, సిగ్నల్ జంపింగ్ వంటి విషయాల్లో సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. లక్డీకాపూల్‌లో రవాణాశాఖ సాంకేతిక అధికారులతో ఆయన సమావేశమయ్యారు.

News September 9, 2024

పీజీ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి

image

TG: పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన సీపీగేట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ పూర్తయింది. 21,505 మందికి సీట్లు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 13న సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు. అన్ని యూనివర్సిటీల పరిధిలోని కాలేజీల్లో 99 కోర్సుల్లో సీట్లు కేటాయించారు. అత్యధికంగా ఓయూ పరిధిలో 9వేల మందికి సీట్లు అలాట్ చేశారు.

News September 9, 2024

నేడు ‘నేతన్నకు చేయూత’ నిధులు విడుదల

image

TG: నేతన్నకు చేయూత పథకానికి సంబంధించిన నిధులను సీఎం రేవంత్ నేడు విడుదల చేయనున్నారు. దీంతో 36,133 మంది అర్హులు లబ్ధిపొందనున్నారు. IIHT ప్రారంభోత్సవంలో భాగంగా ఆయన నిధులు విడుదల చేస్తారు. మూడేళ్ల కాలపరిమితి గల ఈ పథకం రెండో విడత 2021 సెప్టెంబర్‌లో మొదలై 2024 ఆగస్టుతో ముగిసింది. రికరింగ్ అకౌంట్లలో కార్మికులు జీతంలోని 8% జమ చేస్తే ప్రభుత్వం దాదాపు రెట్టింపు ఇచ్చి మొత్తాన్ని మూడేళ్ల తర్వాత అందిస్తోంది.

News September 9, 2024

భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త

image

AP: వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం, విశాఖ, తూ.గో, ప.గో, అల్లూరి జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరంలో గంటకు 40-50కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, తీరం వెంట 70కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. కళింగపట్నం, భీమిలి, గంగవరం, కాకినాడ పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

News September 9, 2024

నేడు ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పు

image

TG: పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై నేడు హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. BRS నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలివ్వాలని బీఆర్ఎస్, బీజేపీలు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై గత నెల 7నే ఇరు పక్షాల వాదనలు పూర్తవ్వగా, కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.