India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బంగ్లాదేశ్తో తొలి టెస్టుకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. కానీ టీమ్ ఇండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు మొండి చేయి చూపింది. సెలక్టర్లు కనీసం ఆయనను పరిగణనలోకి తీసుకోలేదు. అతడి స్థానంలో కేఎల్ రాహుల్ను జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ నుంచి అయ్యర్ అర్ధంతరంగా తప్పుకున్నారు. ఆ తర్వాత ఆయన భారత జట్టులో చోటుతోపాటు సెంట్రల్ కాంట్రాక్టు కూడా కోల్పోయారు.
భారత్, పాకిస్థాన్ జట్లు తరచూ ద్వైపాక్షిక సిరీస్లు ఆడాలని పాక్ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ అభిప్రాయపడ్డారు. ‘ఈ దేశాల మధ్య మ్యాచ్ అంటే ఉండే ఆసక్తి అంతాఇంతా కాదు. ఆఖరికి చంద్రుడిపై జరిగినా ఆ మ్యాచ్ చూసేందుకు జనం ఎగబడతారంటే అతిశయోక్తి లేదు. ఒకరి దేశంలో మరొకరు తరచూ ఆడాలి’ అని అభిలషించారు. భారత్ చివరిగా 2008లో ఆసియా కప్ కోసం పాక్లో పర్యటించింది. ఇక 2007 తర్వాత రెండు దేశాల మధ్య టెస్టులే జరగలేదు.
పారిస్ పారాలింపిక్స్ ముగింపు వేడుకలు గ్రాండ్గా ముగిశాయి. ఫ్రెంచ్ మ్యుజీషియన్లు, గ్రామీ అవార్డ్ విన్నర్ అండర్సన్ పాక్ల ప్రదర్శనతో స్టేడియం హోరెత్తింది. ఈ వేడుకల్లో భారత పతాకధారులుగా ఆర్చర్ హర్వీందర్ సింగ్, అథ్లెట్ ప్రీతి పాల్లు వ్యవహరించారు.
త్వరలోనే రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకనున్నట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు భారత్ చొరవ తీసుకుంటోంది. ఇందులో భాగంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ వారంలో రష్యా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మాస్కోలో పుతిన్తో ఆయన సమావేశం అవుతారని సమాచారం. కాగా ఇప్పటికే పుతిన్ శాంతి చర్చలకు అంగీకరించారు. ఇందుకు భారత్ మధ్యవర్తిత్వానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
AP: ప్రకాశం బ్యారేజీకి మళ్లీ వరద పెరిగింది. ఎగువ నుంచి 4.50 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో 70 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు సముద్రంలోకి వదిలేస్తున్నారు. పులిచింతల, మున్నేరు, కట్టలేరు నుంచి వస్తున్న ప్రవాహం బ్యారేజీలో కలుస్తోంది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 13 అడుగులకుపైగా నీటిమట్టం ఉండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
యూఎస్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ విజేతగా ఇటలీ స్టార్ ప్లేయర్ జన్నిక్ సిన్నర్ నిలిచారు. అమెరికాకు చెందిన టేలర్ ఫ్రిట్జ్పై 6-3, 6-4, 7-5 ఆధిక్యంతో గెలిచి తొలిసారి యూఎస్ ఓపెన్ ట్రోఫీని ముద్దాడారు. న్యూయార్క్లోని ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ఇద్దరి మధ్య రెండు గంటలకుపైగా జరిగింది. కాగా యూఎస్ ఓపెన్ మహిళల విజేతగా అరీనా సబలెంక నిలిచిన సంగతి తెలిసిందే.
టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ 634 రోజుల తర్వాత టెస్టుల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. బంగ్లాదేశ్తో జరగబోయే తొలి టెస్టుకు పంత్ను బీసీసీఐ ఎంపిక చేసింది. రోడ్డు ప్రమాదం తర్వాత టీ20, వన్డేల్లో ఆడినా సుదీర్ఘ ఫార్మాట్లో ఆయన ఇంకా ఆడలేదు. ఈ క్రమంలో బంగ్లా సిరీస్కు ఆయన ఎంపికయ్యారు. ఆ తర్వాత జరిగే బోర్డర్-గావస్కర్ ట్రోఫీకి కూడా పంత్ ఎంపిక లాంఛనమే. ఆసీస్పై అతడి మెరుగైన గణాంకాలే ఇందుకు నిదర్శనం.
ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆరో బ్యాటర్గా రూట్ (12,402) అవతరించారు. శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో 11 పరుగుల వద్ద ఉన్నప్పుడు కుమార సంగక్కర (12,400) రికార్డును ఆయన అధిగమించారు. మరో 83 పరుగులు చేస్తే అలిస్టర్ కుక్ (12,472) రికార్డు కూడా రూట్ బద్దలుకొడతారు. అగ్ర స్థానంలో సచిన్ టెండూల్కర్ (15921) ఉన్నారు.
రష్యాకు చెందిన ఓ సైనిక డ్రోన్ నాటో పరిధిలోని లాత్వియా దేశంలో తాజాగా కుప్పకూలింది. ఈ దేశాధ్యక్షుడు ఎడ్గర్స్ రింకెవిక్స్ ఈ విషయాన్ని ప్రకటించారు. డ్రోన్ బెలారస్ మీదుగా తమ దేశంలో పడిందని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు ఈమధ్య పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు సోవియట్ యూనియన్లో ఉన్న లాత్వియా, తర్వాతి కాలంలో ప్రత్యేక దేశంగా మారి నాటో సభ్యదేశమైంది.
1914: కవి కాళోజీ నారాయణరావు జననం
1935: నటుడు, కూచిపూడి కళాకారుడు వేదాంతం సత్యనారాయణ శర్మ జననం
1953: మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి జననం
1957: సినీ నటి జయచిత్ర జననం
1987: బాల మేధావి తథాగత్ అవతార్ తులసి జననం
తెలంగాణ భాషా దినోత్సవం
Sorry, no posts matched your criteria.