India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 గంటల్లో వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. జగిత్యాల, భూపాలపల్లి, గద్వాల, ఆసిఫాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల, మెదక్, మల్కాజ్గిరి, నాగర్కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వనపర్తి, భువనగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
TG: హైడ్రా కూల్చివేతలపై వివరణ ఇస్తూ కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రజలు చెరువుల FTL, బఫర్ జోన్లలో ఉన్న స్థలాలు, ఇళ్లు ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయవద్దు. కొనేముందు ఒకటికి రెండు సార్లు డాక్యుమెంట్లు పరిశీలన చేయండి’ అని సూచించారు. ప్రస్తుతం FTL, బఫర్ జోన్లలో ఉన్న కొత్త నిర్మాణాలు మాత్రమే కూల్చివేస్తున్నామని, ఆక్రమణలో ఉన్న ఏ ఇంటినీ కూల్చబోమని ఆయన స్పష్టం చేశారు.
శ్వాస తీసుకోవడం మాదిరిగానే అపానవాయువు విడుదల కూడా మనిషికి సహజం. అయితే చాలామంది పలు కారణాల రీత్యా అపానవాయువును ఆపుకొంటుంటారు. ఎప్పుడైనా ఒకసారి ఫర్వాలేదు కానీ ఇదో అలవాటుగా మారితే అనారోగ్యకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ఎక్కువ సేపు ఆపుకొన్న గ్యాస్ తిరిగి పొట్టలోకి వెళ్తుంది. కొంతమేర శరీరం తిరిగి పీల్చుకుంటుంది. దీంతో కడుపు నొప్పి, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి’ అని వివరించారు.
TG: ‘హైడ్రా’ కూల్చివేసిన భవనం తనది కాదని ఏపీలోని పాణ్యం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలిపారు. తనకు హైదరాబాద్లో భవనాలే లేవన్నారు. కొందరు టీడీపీ నేతలు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తానే హైడ్రాకు నోటీసులు పంపిస్తానని కాటసాని వెల్లడించారు. కాగా అమీన్పూర్ పెద్దచెరువు FTLలో కాటసాని అక్రమ నిర్మాణాలను కూల్చి, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేశామని రంగనాథ్ తెలిపారు.
పారిస్ పారాలింపిక్స్లో భారత్ 29 పతకాలతో సత్తా చాటింది. టోక్యో కంటే ఈసారి 10 మెడల్స్ ఎక్కువ రావడం గమనార్హం. ఈ సారి 7 బంగారు, 9 వెండి, 13 కాంస్య పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. 25 పతకాలు లక్ష్యంగా పెట్టుకుంటే 4 ఎక్కువగా సాధించి భారత పారా అథ్లెట్లు అద్భుతం చేశారు. దీంతో దేశం గర్వించేలా చేసిన వీరికి ఘనంగా స్వాగతం పలకాలని పలువురు కోరుతున్నారు.
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో విజయనగరంలో జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. సోమవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ అంబేడ్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. అటు కుండపోత వర్షాలు కురుస్తున్న విశాఖ, శ్రీకాకుళం, ఉమ్మడి గోదావరి జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది.
AP: విశాఖలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం విమానాల రాకపోకలపై పడింది. వర్షం కారణంగా విజిబిలిటీ సరిగా లేకపోవడంతో పలు ఫ్లైట్స్ ఆలస్యంగా నడుస్తున్నాయి. బెంగళూరు-వైజాగ్ మధ్య నడవాల్సిన 2 విమానాలతో పాటు మరో 5 ఫ్లైట్స్ రెండు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మంచి టాక్ తెచ్చుకున్న ‘35-చిన్న కథ కాదు’ మూవీ సక్సెస్ఫుల్గా రన్ అవుతోందని, మున్ముందు మరింత వసూలు చేయొచ్చని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తాజాగా అంచనా వేశారు. తెలుగులో సక్సెస్ కావడంతో తమిళ, మలయాళ భాషల్లోనూ మూవీని నిర్మాతలు రిలీజ్ చేయనున్నారని ఆయన వెల్లడించారు. కంటెంట్ ఉంటే చిన్న సినిమాలకూ ఘన విజయం అందిస్తామని టాలీవుడ్ ప్రేక్షకులు మరోసారి నిరూపించారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
AP: గణేశ్ మండపాల్లో మైక్సెట్కు రూ.100, విగ్రహం హైట్ను బట్టి రూ.350-700 చలానా చెల్లించాలని ఇటీవల చెప్పిన హోంమంత్రి అనిత ఇవాళ <<14051538>>మరోరకంగా<<>> స్పందించారు. ఆ జీవోను జగన్ ప్రభుత్వమే తీసుకొచ్చిందని, తాము రూపాయి కూడా వసూలు చేయట్లేదని చెప్పారు. అయితే పలువురు భక్తులు తాము మండపాలకు కట్టిన చలాన్ల రసీదు ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.
మీరు మండపాలకు చలానా కట్టారా? కామెంట్ చేయండి.
వినాయకుడి విగ్రహమంటే గజ ముఖంతోనే చూస్తుంటాం. తమిళనాడులోని తిలాతర్పణపురి ఆదివినాయకర్ ఆలయంలో మాత్రం మానవముఖంతో ఉన్న గణనాథుడు దర్శనమిస్తాడు. అమ్మవారు పసుపు నలుగు నుంచి తయారుచేసి ప్రాణం పోసిన గణేశుడు పరమశివుడు తల ఖండించిన తర్వాత గజాననుడిగా మారాడు. అమ్మవారు తొలిగా చేసిన బుజ్జి గణపయ్య రూపమే ఇక్కడ పూజలందుకుంటోంది. ఇక్కడ పిండప్రదానం పితృదేవతలకు ముక్తిదాయకమని ప్రతీతి.
Sorry, no posts matched your criteria.