News December 8, 2024

కలెక్టర్ల సదస్సు తేదీల్లో మార్పు

image

AP: ఈ నెల 10, 11 తేదీల్లో జరగాల్సిన కలెక్టర్ల సదస్సు తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 11, 12 తేదీల్లో జరుగుతుందని మంత్రులు, అధికారులకు ప్రభుత్వం నుంచి సమాచారం అందింది. అమరావతిలోని సచివాలయంలో 11న ఉదయం 11.గంటలకు సదస్సు ప్రారంభం అవుతుందని తెలిపింది. 12న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గస్థాయి విజన్ డాక్యుమెంట్లను సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు.

News December 8, 2024

సోనియా గాంధీపై బీజేపీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

image

NDA ప్రభుత్వాన్ని అస్థిర‌ప‌రిచే కుట్ర‌లు జ‌రుగుతున్నాయంటూ అమెరిక‌న్ సంస్థ‌లు, జార్జ్ సోరోస్‌, రాహుల్ గాంధీపై ఆరోప‌ణ‌లు చేస్తున్న BJP తాజాగా సోనియా గాంధీని టార్గెట్ చేసింది. క‌శ్మీర్‌ను స్వ‌తంత్ర దేశంగా భావించే FDL-AP ఫౌండేష‌న్‌కు జార్జ్ సోరోస్ నుంచి నిధులు అందాయని, దీనికి సోనియా కో-ప్రెసిడెంట్ అని ఆరోపించింది. ఇది దేశ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల్లో విదేశీ హ‌స్తం ఉందనడానికి రుజువని పేర్కొంది.

News December 8, 2024

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట.. ముగ్గురి అరెస్ట్!

image

‘పుష్ప-2’ ప్రీమియర్ సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద <<14793383>>తొక్కిసలాటలో మహిళ<<>> మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో థియేటర్ యాజమాన్యానికి చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. థియేటర్ యజమాని‌తోపాటు మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్‌ని అరెస్ట్ చేశారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలకు దిగారు. ఈ ఘటనలో అల్లు అర్జున్‌తో పాటు అతని టీమ్‌పైనా కేసు నమోదైంది.

News December 8, 2024

నటి ధరించిన చెప్పులకు వేలంలో రూ.237 కోట్లు

image

ప్రముఖ US నటి జూడీ గెరాల్డ్ The Wizard of Oz చిత్రంలో ధరించిన రూబీ స్లిప్పర్స్ వేలంలో $28 మిలియన్ల(రూ.237 కోట్లు)కు అమ్ముడుపోయాయి. అన్ని రకాల ఫీజులతో కలిపి $32.5Mను ఓ వ్యక్తి చెల్లించాడు. అతని పేరు బయటికి వెల్లడికాలేదు. 2005లో మ్యూజియం నుంచి వీటిని దుండగులు దొంగిలించగా 2018లో FBI రికవరీ చేసింది. తాజాగా ఓ సంస్థ ఈ స్లిప్పర్స్‌ను వేలం వేయగా రికార్డు స్థాయి ధర దక్కింది.

News December 8, 2024

కాంగ్రెస్ హామీల అమలుపై నిలదీస్తాం: కేటీఆర్

image

TG: హామీల అమలు విషయంలో అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ అన్నారు. గురుకులాల్లో నెలకొన్న సమస్యలపై ప్రశ్నిస్తామని చెప్పారు. గిరిజన, దళిత రైతుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ అస్థిత్వంపై ప్రభుత్వం చేస్తున్న దాడిని ఎండగడతామని పేర్కొన్నారు. అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ 420 హామీలను నిలదీస్తామని తెలిపారు.

News December 8, 2024

అల్పపీడనం.. భారీ వర్షాలు

image

AP: ఆగ్నేయ బంగాళాఖాతాన్ని అనుకొని ఉన్న తూర్పు హిందూ మహాసముద్రంపై అల్పపీడనం కొనసాగుతోందని APSDMA ట్వీట్ చేసింది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని తెలిపింది.

News December 8, 2024

అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలం: KCR

image

TG: ఏడాది పాలనలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని KCR ధ్వజమెత్తారు. గురుకులాలు, విద్యారంగం, మూసీ, హైడ్రా, నిర్భంద పాలనపై BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎండగట్టాలని సూచించారు. ఫిబ్రవరిలో నిర్వహించే బహిరంగ సభలో ప్రభుత్వ వైఖరిని నిలదీస్తామని చెప్పారు. మార్చిలో BRSలో కమిటీలు ఏర్పాటు చేస్తామని, ఆ తర్వాత సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామని వివరించారు గులాబీ దళపతి.

News December 8, 2024

రెండో వారంలో వరుస IPOలు

image

స్టాక్ మార్కెట్ల‌లోకి Mon నుంచి IPOలు క్యూక‌ట్ట‌నున్నాయి. ముఖ్యంగా Dec 11న విశాల్ మార్ట్‌, మొబిక్విక్‌, సాయి లైఫ్ సైన్సెస్ రానున్నాయి. 12న ఇన్వెంచ‌ర‌స్ నాలెడ్జ్ సొల్యూష‌న్స్, 13న ఇంట‌ర్నేష‌న‌ల్ జెమోలాజిక‌ల్ ఇన్‌స్టిట్యూట్‌ రానున్నాయి. అలాగే SMEలో Dhanlaxmi Crop Science, Jungle Camps India, Toss The Coin, Purple United Sales, Supreme Facility Management, Yash High voltage ఈ వారం IPOకు రానున్నాయి.

News December 8, 2024

IPOలో ఇన్వెస్ట్ చేస్తున్నారా?

image

IPOలో ఇన్వెస్ట్ చేసేముందు కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. దాని ఆర్థిక స్థితి, బిజినెస్, Orders, profitability, Expansion Plans పరిశీలించాలి. SEBIకి ఆయా సంస్థ‌లు స‌మ‌ర్పించే రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్(RHP) డాక్యుమెంట్‌లో వివరాలు ఉంటాయి. దీని ద్వారా రిస్క్ ఫ్యాక్ట‌ర్‌ని అంచ‌నా వేయాలి. గ్రే మార్కెట్ ప్రీమియం సూచ‌న‌లు ప‌రిశీలించాలి. Market Trends ఆధారంగా నిపుణుల సూచ‌న‌లు పాటించాలి. Share It.

News December 8, 2024

ఇది మూర్ఖపు చర్య: KCR

image

తెలంగాణ తల్లి విగ్రహం రూపు మార్చడాన్ని మాజీ సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ‘ఇదొక మూర్ఖపు చర్య. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా? ప్రభుత్వాలు మారినప్పుడల్లా విగ్రహాల్లో మార్పులు చేసుకుంటూ పోతే ఎలా? సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలి. ఉద్యమంలో తెలంగాణ తల్లి అందించిన స్ఫూర్తిని ప్రజలకు వివరించాలి’ అని BRS నేతలతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యేలు, MLCలకు ఆయన సూచించారు.