India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉత్తరాఖండ్ రూర్కీ సమీపంలో రైల్వే ట్రాక్పై గుర్తు తెలియని దుండగులు ఉంచిన ఖాళీ గ్యాస్ సిలిండర్ కలకలం రేపింది. ధంధేరా- లాండౌరా స్టేషన్ల మధ్య ఉదయం 6:35కి గూడ్స్ రైలు వెళ్తోంది. ఈ క్రమంలో ట్రాక్పై సిలిండర్ను గుర్తించిన లోకోపైలట్ వెంటనే రైలును నిలిపివేశారు. ఘటనా స్థలానికి పాయింట్స్మెన్ చేరుకొని ఖాళీ సిలిండర్గా గుర్తించారు. ఆగస్టు నుంచి దేశంలో ఇలాంటి 18 ఘటనలు చోటుచేసుకున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెళ్లి సందడి మొదలైంది. OCT, NOV, DECలో భారీగా వివాహాలు జరగనున్నాయి. ఈ 3 నెలల్లోని కొన్ని తేదీలను పండితులు పెళ్లి ముహూర్తాలుగా నిర్ణయించారు. ఇప్పటికే NOV, DECలో ముహూర్తాలు పెట్టగా, ఈనెలలోనూ నిన్నటి నుంచి పెళ్లిళ్లు మొదలయ్యాయి. OCTలో 13,16,20,27, NOVలో 3,7,8,9,10,13,14,16,17, DECలో 5,6,7,8,11,12, 14,15, 26 తేదీలు వివాహాలకు అనుకూలమైనవని పండితులు వెల్లడించారు.
ప్రతీకార దాడులు తప్పవన్న ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ జాగ్రత్తపడుతోంది. హెజ్బొల్లా పేజర్ల పేలుళ్ల తరహా ఘటనలకు ఆస్కారం ఇవ్వకుండా ఇరాన్ విమానయాన శాఖ వీటిపై నిషేధం విధించింది. ప్రయాణికులు మొబైల్ ఫోన్లు మినహా పేజర్లు, వాకీటాకీలను విమాన క్యాబిన్లో, చెక్-ఇన్లో తీసుకెళ్లలేరు. దుబాయ్ నుంచి వచ్చి, వెళ్లే విమానాల్లో సహా దుబాయ్ మీదుగా వెళ్లే విమానాల్లో ఈ నిషేధాన్ని విధించారు.
MH మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై రాహుల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిద్దిఖీ కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు. ఈ హత్య ఘటన MHలో శాంతిభద్రతల క్షీణతకు నిదర్శనమని రాహుల్ పేర్కొన్నారు. బాధితులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. సిద్దిఖీ హత్య బాలీవుడ్ చిత్రసీమలోనూ తీవ్ర విషాదం మిగిల్చింది.
ఏపీలో రేపటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ హెచ్చరికలతో విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తమైంది. వర్షాలకు వాగులు, కాలువలు పొంగే అవకాశం ఉందని, పిడుగులు పడొచ్చని తెలిపింది. రైతులు, గొర్రెలకాపరులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది. అత్యవసరమైతే 1070, 112, 1080-425-0101 నంబర్లకు ఫోన్ చేయాలని తెలిపింది.
AP: భారత్లో తయారయ్యే విదేశీ మద్యం ధరకు సంబంధించి అదనపు ప్రివిలేజ్ ఫీజు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఫీజు కింద MRPలో చిల్లర కాకుండా తదుపరి పది రూపాయలకు రౌండాఫ్ చేసింది. MRP ₹160.50గా ఉంటే దాన్ని ₹170కి పెంచేలా ఫీజు ఉంటుంది. ప్రభుత్వం క్వార్టర్ బాటిల్ ధర ₹99కే నిర్ధారించడంతో రూ.100లో రూ.1 మినహాయించి విక్రయిస్తారని ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.
శీతాకాలం ప్రారంభం అవుతుండటంతో ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల మూసివేత తేదీలను ఆలయ కమిటీ ప్రకటించింది. NOV 17న బద్రీనాథ్, కేదార్నాథ్, నవంబర్ 3న యమునోత్రి, గంగోత్రి ఆలయ తలుపులను మూసివేయనున్నారు. అలాగే రుద్రనాథ్ ప్రవేశద్వారాలు ఈ నెల 17న క్లోజ్ చేస్తారు. ఈ ఏడాది బద్రీనాథ్ను 11 లక్షల మంది, కేదార్నాథ్ను 13.5 లక్షల మంది దర్శించుకున్నారు. శీతాకాలంలో ఈ ఆలయాలు మంచుతో కప్పబడి ఉంటాయి.
AP: కోనసీమ, కడప జిల్లాల్లో దసరా ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. కోనసీమ జిల్లా అమలాపురం మండలం కొంకాపల్లిలో డీజే సౌండ్కు వినయ్ అనే యువకుడు డాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించే క్రమంలో మరణించాడు. మరోవైపు కడపలోని బెల్లంబండి వీధిలో దసరా ఊరేగింపులో పందిరి పైభాగానికి విద్యుత్ తీగలు తగిలాయి. షాక్తో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు గాయపడ్డారు.
లెబనాన్లోని UN శాంతిపరిరక్షణ బలగాల స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులను భారత్తోపాటు 34 ప్రపంచ దేశాలు ఖండించాయి. ఇలాంటి చర్యలను వెంటనే విరమించుకోవాలని సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇటీవల దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఐదుగురు శాంతి పరిరక్షకులు గాయపడ్డారు. ఈ దాడుల్ని ఉద్దేశపూర్వక చర్యలుగా UNIFIL ఆరోపించింది. బలగాల రక్షణ అత్యంత ప్రాధాన్యాంశంగా భారత్ పేర్కొంది.
AP: మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసు, చంద్రబాబు నివాసంపై దాడి కేసును సీఐడీకి బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ కేసులు మంగళగిరి, తాడేపల్లి పీఎస్ల పరిధిలో ఉన్నాయి. విచారణ వేగవంతం కోసం ఈ నిర్ణయం తీసుకోగా, ఆయా ఫైళ్లను సీఐడీకి మంగళగిరి డీఎస్పీ రేపు అప్పగించనున్నారు.
Sorry, no posts matched your criteria.