India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తమపై దాడికి ఇజ్రాయెల్కు సహకరిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని పొరుగున ఉన్న అరబ్ దేశాలు, గల్ఫ్లోని అమెరికా మిత్రదేశాలను ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ దాడి నేపథ్యంలో ప్రతీకార దాడి తప్పదని ఇజ్రాయెల్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తమపై దాడికి భూభాగం-గగనతలం వాడుకునేలా అనుమతిస్తే ప్రతీకారం తప్పదని ఆయా దేశాలకు రహస్య దౌత్య మాధ్యమాల ద్వారా ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది.
టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఓ ఫ్యాంటసీ క్రికెట్ యాప్ను ప్రమోట్ చేస్తూ చేసిన ట్వీట్ తీవ్ర విమర్శలకు దారి తీసింది. మద్యం, పొగాకు, ఆన్లైన్ బెట్టింగ్లకు తాను వ్యతిరేకమని గంభీర్ గతంలో చెప్పారు. మరి ఇప్పుడు మాట తప్పి డబుల్ స్టాండర్డ్స్ ఏంటంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పైపెచ్చు టీమ్ ఇండియా హెడ్ కోచ్గా ఉన్న వ్యక్తి ఓ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయడమేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్లో బంగ్లాదేశ్తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 3 మ్యాచుల సిరీస్ను ఇప్పటికే భారత్ 2-0తో కైవసం చేసుకుంది. భారత జట్టు: సంజూ, అభిషేక్, సూర్య, నితీశ్, హార్దిక్, పరాగ్, రింకూ, సుందర్, చక్రవర్తి, బిష్ణోయ్, మయాంక్
మహిళల టీ20 వరల్డ్ కప్లో గ్రూప్ ఏ నుంచి ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది. రెండో స్థానం కోసం భారత్, న్యూజిలాండ్, పాక్ మధ్య పోటీ నెలకొంది. భారత్ సెమీస్ చేరాలంటే రేపు ఆసీస్తో జరిగే మ్యాచ్లో తప్పక గెలవాలి. భారీ తేడాతో గెలిస్తే సులభంగా సెమీస్ చేరుతుంది. లేదంటే కివీస్ ఆడే చివరి 2 మ్యాచుల్లో ఓడాలి లేదా ఒకదాంట్లోనైనా చిత్తుగా ఓడాలి. అప్పుడు మెరుగైన నెట్ రన్రేట్తో భారత్ సెమీస్ చేరుతుంది.
మెగా, నందమూరి ఫ్యాన్స్కు విజయ దశమి రోజున అప్డేట్స్ వచ్చాయి. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ను వచ్చే ఏడాది జనవరి 10న రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్ రాజు ఇప్పటికే ప్రకటించారు. ఆ డేట్తో చరణ్ పిక్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక నందమూరి బాలకృష్ణతో బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న NBK109 మూవీని సంక్రాంతికి తీసుకురానున్నట్లు ఆ మూవీ టీమ్ ప్రకటించింది. దీపావళికి టైటిల్, టీజర్ను వదలనున్నట్లు తెలిపింది.
రతన్ టాటాతో జరిగిన ఓ ఆసక్తికర సంభాషణను నారాయణ మూర్తి ఇటీవల గుర్తు చేసుకున్నారు. Infosysలో జంషెడ్జీ టాటా హాల్ ప్రారంభానికి రావాలని ఆహ్వానిస్తే ‘TCS మీ ప్రత్యర్థి. నన్నెందుకు ఆహ్వానిస్తున్నారు’ అని టాటా వ్యాఖ్యానించారట. దీనికి బదులిస్తూ ‘జంషెడ్జీ సంస్థల స్వరూపాన్నే మార్చిన వ్యక్తి. ఆయన్ను మాతో పోటీదారుగా పరిగణించం. ఇది ఆయన్ను గౌరవించుకొనే విషయం’ అని చెప్పినట్టు మూర్తి పేర్కొన్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని TTD ఈవో శ్యామలరావు తెలిపారు. ‘వాహన సేవలను 15 లక్షల మంది తిలకించారు. గరుడ వాహనం రోజునే 3.3 లక్షల మంది వచ్చారు. 26 లక్షల మందికి అన్న ప్రసాదాలు, 30 లక్షల లడ్డూలు పంపిణీ చేశాం. లడ్డూ నాణ్యతపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. బ్రహ్మోత్సవాల్లో హుండీ ఆదాయం రూ.26 కోట్లు లభించింది’ అని తెలిపారు. ఇవాళ ధ్వజారోహణంతో ఉత్సవాలు ముగియనున్నాయి.
తెలంగాణలో జమ్మి చెట్టు ఆకులను బంగారంలా భావిస్తారు. దసరా రోజు సాయంత్రం జమ్మి చెట్టుకు పూజలు చేసి, ఆకులను ఆత్మీయులకు పంచుతారు. కొందరు పూజగదిలో భద్రపరుస్తారు. కుబేరుడు రఘుమహారాజుకు భయపడి జమ్మిచెట్లున్న ప్రాంతంలో బంగారాన్ని కురిపించాడని, అలా జమ్మి ఆకులను బంగారంగా పిలుచుకుంటారని పురాణాలు చెబుతాయి. జమ్మి చెట్టులోని ప్రతి భాగంలోనూ ఔషధ గుణాలుంటాయి. దీని గాలి పీల్చితే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
నవానగర్ (ప్రస్తుత జామ్నగర్) గల్ఫ్ ఆఫ్ కచ్ దక్షిణ తీర ప్రాంతం. గతంలో దీన్ని జడేజా రాజ్పుత్ రాజవంశీయులు పాలించేవారు. ఇక్కడి రాజును జామ్ సాహెబ్గా పిలుస్తారు. నవానగర్ను 1907 నుంచి రంజిత్సిన్హ్ జీ విభా జీ పాలించారు. ఈయన ప్రపంచ ప్రసిద్ధ క్రికెట్ ఆటగాడు. ఇంగ్లండ్ తరఫున ఆడారు. ఈయన పేరు మీదే దేశంలో ఏటా రంజీ ట్రోఫీ జరుగుతుంది. ఈ రాజవంశం నుంచి ఎక్కువ మంది క్రికెటర్లుగా రాణించారు.
భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ డీఎస్పీగా శుక్రవారం ఛార్జ్ తీసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సిరాజ్కు గ్రూప్-1 పోస్టు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ DGPని నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. అప్పుడు సూటు బూటులో ఉన్న సిరాజ్, ఈరోజు డీఎస్పీగా యూనిఫాం ధరించారు. ఆ పిక్స్ ఈరోజు వైరల్ అవుతున్నాయి. ఆల్ ది బెస్ట్ మియా అంటూ నెట్టింట ఆయనకు విషెస్ వెల్లువెత్తుతున్నాయి.
Sorry, no posts matched your criteria.