India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్రకూట, శాతవాహన, చాళుక్యుల కాలం నుంచి గణేశ్ చతుర్థిని జరుపుకుంటున్నారు. ఆ తర్వాత ఛత్రపతి శివాజీ గణేశ్ చతుర్థిని జరిపించారు. తర్వాత పీష్వా రాజవంశం దీనిని కొనసాగించింది. 1893లో పుణేలో తొలిసారి బహిరంగంగా గణేశ్ ఉత్సవాలు మొదలెట్టారు. జాతీయోద్యమంలో హిందువులందరినీ ఏకతాటిపైకి తేవడానికి బాలగంగాధర్ తిలక్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. ఆ తర్వాత నుంచి దేశమంతటా ఈ వేడుకలు జరుపుకుంటున్నారు.
వినాయక చవితి రోజున ప్రసాదం అంటే కుడుములు, ఉండ్రాళ్లే చేస్తాం. దానికో కారణముందంటారు పెద్దలు. ఈ దక్షిణాయన కాలంలో మన జీవక్రియ నెమ్మదిగా ఉంటుంది. అరుగుదల, ఆకలి రెండూ పెద్దగా ఉండవు. ఈ నేపథ్యంలో బియ్యప్పిండితో ఆవిరిమీద చేసిన వంటకాలు తేలిగ్గా అరగడమే కాక శరీరానికి ఆరోగ్యాన్ని, శక్తిని కూడా అందిస్తాయి. అందుకే చవితి నాడు కుడుములు, ఉండ్రాళ్ల వంటివాటిని వండుకుంటామనేది పెద్దల మాట.
తరిగిన లేదా ఒలిచిన ఉల్లిపాయను ఫ్రిడ్జ్లో ఉంచడం ప్రమాదకరం. ఎందుకంటే ఇది బ్యాక్టీరియా వృద్ధికి కారణమవుతుంది. తద్వారా ఫ్రిడ్జ్లోని ఇతర పదార్థాలకు బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. ఇది రకరకాల అనారోగ్యాలకు దారి తీస్తుంది. కట్ చేసిన ఉల్లిపాయను ఫ్రిడ్జ్లో పెడితే చేదుగా మారి టేస్ట్ పోతుంది. అందుకే అప్పటికప్పుడు కట్ చేసిన తాజా ఉల్లిపాయలను మాత్రమే వంటకాల్లో వాడటం ఉత్తమం.
> SHARE
AP: తెలుగు ప్రజలకు CM చంద్రబాబు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ‘తొలి పూజ అందుకునే ఆ గణనాథుడు అందరికి శుభం కలిగించాలని కోరుకుంటున్నాను. వీధులన్నీ చవితి పందిళ్లతో కళకళలాడాల్సిన సమయంలో వరదలు విజయవాడ ప్రజలను తీవ్ర కష్టాల పాలుచేశాయి. వారి బాధలు తీర్చేందుకు ప్రయత్నిస్తున్నాం. రానున్న రోజుల్లో రాష్ట్రానికి ఎలాంటి విపత్తులు రాకుండా చూడాలని గణపతిని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.
‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈనెల మధ్య నుంచి కేరళలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. దాదాపు నెలన్నర రోజులకు పైగా ఫైట్స్తో పాటు సాంగ్స్ షూట్ చేయనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. దసరా పండుగకు టైటిల్ను అనౌన్స్ చేస్తారని టాక్. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు.
ఏ పనిలోనైనా ముందు పూజ వినాయకుడికేనన్నది సంప్రదాయం. అటు హైందవ సంప్రదాయంలో పసుపునకు ఉన్న విశిష్టత అంతాఇంతా కాదు. అందుకే గణేశ చవితిరోజున పసుపుతో చేసిన వరసిద్ధి వినాయకుడిని కొలుచుకుంటుంటాం. సహజంగా యాంటీ ఫంగల్ అయిన పసుపుతో చేసిన వినాయకుడి నిమజ్జనం తర్వాత చెరువుల్లోని రోగకారకాలు అంతమవుతాయని శాస్త్రీయ వివరణ. అమ్మవారు బుజ్జి గణపతిని తొలుత పసుపు-నలుగుతోనే తయారుచేశారనేది పురాణ ప్రాశస్త్యం.
తేది: సెప్టెంబర్ 07, శనివారం
ఫజర్: తెల్లవారుజామున 4:50 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:03 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:14 గంటలకు
అసర్: సాయంత్రం 4:39 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:25 గంటలకు
ఇష: రాత్రి 7.38 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
AP: ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టిన ఘటనపై ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకేసారి నాలుగు పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర కోణం ఉందేమోనని, దీనిపై దర్యాప్తు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈనెల 1న మూడు భారీ పడవలు, ఒక చిన్న పడవ ఎగువ నుంచి వచ్చి బ్యారేజీ గేట్లను ఢీకొట్టగా, రెండు గేట్లకు ఉన్న కౌంటర్ వెయిట్లు ధ్వంసమైన సంగతి తెలిసిందే.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
1926: సినీ నటి భానుమతి జననం
1951: నటుడు మమ్ముట్టి జననం
1976: సంగీత దర్శకుడు భీమవరపు నరసింహారావు మరణం
1983: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల జననం
1985: నటి రాధికా ఆప్టే జననం
1986: సినీ నిర్మాత, దర్శకుడు పి.ఎస్.రామకృష్ణారావు మరణం
1991: తెలంగాణ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి మరణం
Sorry, no posts matched your criteria.