News December 8, 2024

సోషల్ మీడియా ట్రెండింగ్‌లో నితీశ్ కుమార్ రెడ్డి

image

నితీశ్ కుమార్ రెడ్డి పేరు నెట్టింట మారుమోగుతోంది. అనుభవజ్ఞులతో కూడిన భారత జట్టులో ఆస్ట్రేలియా గడ్డపై తొలి సిరీస్ ఆడుతున్న అతనొక్కడే పోరాడటం దీనిక్కారణం. తొలి టెస్టులో 41, 38, రెండో టెస్టులో 42, 42 రన్స్‌తో జట్టును నితీశ్ ఆదుకున్నారు. ఇక అడిలైడ్ టెస్టు భారత రెండో ఇన్నింగ్స్‌లో నితీశ్ ఆదుకోకపోతే టీమ్ ఇండియా ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలై ఉండేది. నితీశ్ ఆడిన 4 ఇన్నింగ్స్‌లలో మూడింట అతడే టాప్ స్కోరర్.

News December 8, 2024

మంచు ఫ్యామిలీలో విభేదాలు.. పరస్పర ఫిర్యాదులు?

image

మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు భగ్గుమన్నాయి. తనపై, తన భార్యపై మోహన్ బాబు దాడి చేశారని మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై మోహన్ బాబు కంప్లైంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. స్కూల్, ఆస్తుల వ్యవహారంలో గొడవ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వివాదంపై మంచు ఫ్యామిలీ ఇంకా స్పందించలేదు.

News December 8, 2024

50% మంది రైతులకు రుణమాఫీ కాలేదు: హరీశ్ రావు

image

TG: రాష్ట్రంలో ఇప్పటికీ 50% మంది రైతులకు రుణమాఫీ కాలేదని హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ఛార్జ్ షీట్ విడుదల సందర్భంగా ఆయన మాట్లాడారు. ₹15వేల రైతు భరోసా ఇస్తామని చెప్పి రైతులను రేవంత్ రెడ్డి మోసం చేశారని అన్నారు. ₹4వేల నిరుద్యోగ భృతి, ఏడాదికి 2లక్షల జాబ్స్ వంటి హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించింది జాబ్ క్యాలెండర్ కాదని, జాబ్ లెస్ క్యాలెండర్ అని అన్నారు.

News December 8, 2024

భారత్ ఘోర పరాజయం

image

అడిలైడ్ డే నైట్ టెస్టులో భారత్ ఘోర పరాజయంపాలైంది. ఇండియా తొలి ఇన్నింగ్స్ 180కి ఆలౌట్ కాగా ఆస్ట్రేలియా 337 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 175 పరుగులకు చాప చుట్టేసింది. నితీశ్ కుమార్ రెడ్డి(42) ఒక్కరే పోరాడారు. 19 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా సునాయాసంగా టార్గెట్‌ను ఛేదించింది. దీంతో 5 టెస్టుల BGTలో ఇరు జట్లూ 1-1 స్కోర్‌లైన్‌తో సమానమయ్యాయి.

News December 8, 2024

త్రిపురలో 10మంది బంగ్లాదేశీ హిందువుల అరెస్ట్

image

చట్ట విరుద్ధంగా భారత్‌లోకి ప్రవేశించిన 10మంది బంగ్లాదేశీ హిందువుల్ని త్రిపురలో పోలీసులు అరెస్ట్ చేశారు. అంబాసా రైల్వే స్టేషన్లో వారందర్నీ అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా.. తమది కిషోర్‌గంజ్ జిల్లాలోని ధన్‌పూర్ గ్రామమని, అక్కడ దాడుల్ని భరించలేక ఉన్న ఆస్తులన్నీ అమ్మేసుకుని భారత్‌లోకి వచ్చామని పట్టుబడ్డవారు తెలిపారు. బంగ్లాలో పరిస్థితి బాలేదని, తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.

News December 8, 2024

సింగరేణి రిటైర్డ్ కార్మికులకు రూ.33 కోట్లు

image

TG: రిటైర్డ్ కార్మికులు, అధికారులకు సింగరేణి సంస్థ శుభవార్త చెప్పింది. గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 30 మధ్య పదవీ విరమణ చేసిన వారికి లాభాల్లో వాటాగా రూ.33 కోట్లను చెల్లిస్తామని ప్రకటించింది. ఈ నెల 12న వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని సీఎండీ బలరామ్ తెలిపారు.

News December 8, 2024

భారత్ ఆలౌట్.. ఆస్ట్రేలియా లక్ష్యం ఎంతంటే..

image

డే నైట్ టెస్టులో తమకున్న తిరుగులేని రికార్డును ఆస్ట్రేలియా నిలబెట్టుకుంది. అడిలైడ్ టెస్టులో ఘనవిజయం దిశగా సాగుతోంది. 175 పరుగులకే భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. మరోసారి నితీశ్ కుమార్ రెడ్డి(42) టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 2 వికెట్లు, కమిన్స్ 5, బోలాండ్ 3 వికెట్లు దక్కించుకున్నారు. ఆస్ట్రేలియా విజయ లక్ష్యం 19 పరుగులు.

News December 8, 2024

ప్రభుత్వం ఏడాదిలో ఒక్క ఇంటిని కూడా నిర్మించలేదు: హరీశ్ రావు

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో ఎన్నో ఇళ్లను కూల్చిందని, కానీ ఒక్క ఇందిరమ్మ ఇంటిని కూడా నిర్మించలేదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటై ఏడాదైనా పెన్షన్ల పెంపు, మహిళలకు రూ.2,500 వంటి హామీలను అమలు చేయలేదని అన్నారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించారని, కానీ బస్సుల సంఖ్యను తగ్గించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

News December 8, 2024

‘అతడు’ స్టైల్ దొంగ.. DNA టెస్టులో దొరికేశాడు!

image

రాజు అనే ఘరానా <<14738630>>దొంగ<<>> ‘అతడు’ మూవీలో మహేశ్‌బాబు లాగా కుమారుడు తప్పిపోయిన ఇంటికి వెళ్తాడు. ఆపై తనదైన శైలిలో దోపిడి చేసి పరారవుతాడు. ఇలా రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ ప్రాంతాల్లోని ఇళ్లలో దొంగతనాలు చేశాడు. ఇటీవల ఢిల్లీలోని ఖోడా ఏరియాకు చెందిన తులారాం ఇంటికి అలాగే వెళ్లాడు. ఆస్తులపై కుటుంబీకులను ఆరా తీయగా వారు అనుమానించి పోలీసులకు చెప్పారు. DNA టెస్టులో తులారాంకు సంబంధం లేదని తేలడంతో అరెస్ట్ చేశారు.

News December 8, 2024

రేపు, ఎల్లుండి పింఛన్ల తనిఖీ

image

AP: రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల తనిఖీని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దివ్యాంగులు, ఇతర కేటగిరీల్లో అనర్హులు లబ్ధి పొందుతున్నారని ఫిర్యాదులు రావడంతో చర్యలకు సిద్ధమైంది. తొలి విడతలో ఒక్కో గ్రామ, వార్డు సచివాలయ పరిధిలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి రేపు, ఎల్లుండి అధికారులు వివరాలు సేకరించనున్నారు. ఇందుకోసం పక్క మండలానికి చెందిన సిబ్బందిని నియమించనుంది. ఒక్కో బృందం 40 పింఛన్లను పరిశీలిస్తుంది.