India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(TGSPDCL)కు చెందిన ఉద్యోగులు ఏదైనా పనికోసం లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. 040-23454884 లేదా 7680901912 నంబర్లకు కాల్ చేయవచ్చని పేర్కొన్నారు. కొంతమంది సిబ్బంది అవినీతికి పాల్పడుతూ సంస్థకు చెడ్డ పేరు తెస్తున్నారని అన్నారు.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
తేది: సెప్టెంబర్ 07, శనివారం
చవితి: సా.5.37 గంటలకు
చిత్త: మ.12.34 గంటలకు
వర్జ్యం: సా.6.51-రా.8.39 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉ.5.55-ఉ.6.45 గంటల వరకు
రాహుకాలం: ఉ.9.00-ఉ.10.30 గంటల వరకు
* TPCC అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్
* విద్యా కమిషన్ ఛైర్మన్గా ఆకునూరి మురళి
* కాంగ్రెస్లో చేరిన రెజ్లర్ వినేశ్ ఫొగట్
* శ్రీశైలం గేట్లు మరోసారి ఎత్తివేత
* రాజస్థాన్ హెడ్ కోచ్గా ద్రవిడ్
* UP: హాథ్రస్ రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతి
* ఆర్టికల్-370 ముగిసిన అధ్యాయం: అమిత్ షా
* సీఎం రేవంత్తో కేంద్ర మంత్రి శివరాజ్, బండి భేటీ
* కేంద్రం నుంచి సాయం అందలేదు: CBN
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ సన్నిహితుల ఆస్తిని భారత్ ఈ నెల 5న రూ.1.39 కోట్లకు వేలం వేసింది. ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్లో ఆయన సంబంధీకుల పేరిట ఆస్తి ఉంది. స్థానిక రైతులు ముగ్గురు కలిసి దాన్ని కొనుగోలు చేశారు. 2010లో ఆ ఆస్తిని ‘శత్రువుల ఆస్తి’గా భారత్ ప్రకటించింది. అప్పటి నుంచీ ఇది ‘ఎనిమీ ప్రాపర్టీ కస్టోడియన్ ఆఫీస్’ అధీనంలోనే ఉంది. కాగా.. ముషారఫ్ గత ఏడాది మరణించిన సంగతి తెలిసిందే.
భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ మళ్లీ వింటేజ్ భువీని గుర్తు చేశారు. UP T20 లీగ్లో కాశీ రుద్రాస్, లక్నో ఫాల్కన్స్ తలపడ్డాయి. లక్నో ఫాల్కన్స్ తరఫున బరిలో దిగిన భువనేశ్వర్ 4 ఓవర్లు వేసి 4 రన్స్ మాత్రమే ఇచ్చారు. అయితే వికెట్లేమీ పడలేదు. భువీ బౌలింగ్లో ప్రత్యర్థులు ఒక్క బౌండరీ కొట్టలేదు. అతడి బౌలింగ్లో రన్స్ ఇలా(0, 0, 0, 1, 0, 0, 0, 0, 1, 0, 0, 0, 0, 0, 0, 0, 0, 0, 1, 0, 0, 0, 1, 0) ఉన్నాయి.
రైడ్ క్యాన్సిల్ చేసిందన్న కారణంగా యువతిని అసభ్యంగా తిట్టి, చెంప దెబ్బకొట్టిన ఆటో డ్రైవర్ను బెంగళూరు మాగడి పోలీసులు అరెస్టు చేశారు. తన రైడ్ను క్యాన్సిల్ చేసిన యువతి వేరే అటో ఎక్కడంతో <<14028476>>ఆగ్రహించిన<<>> డ్రైవర్ ముత్తురాజ్(46) ఇంధన డబ్బులు ఇవ్వాలంటూ ఆమెను దుర్భాషలాడాడు. అంతటితో ఆగకుండా చెంపదెబ్బకొట్టాడు. బాధితురాలు తీసిన వీడియో వైరల్ అవ్వడంతో పోలీసులు అతణ్ని అరెస్టు చేశారు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవర’ రిలీజ్కు ముందే రికార్డులు సృష్టిస్తోంది. అమెరికాలో అత్యంత వేగంగా 15,000 టికెట్లు అమ్ముడైన తొలి ఇండియన్ మూవీగా అవతరించింది. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇండియన్ సినిమా ఇన్ఫ్లుయెన్స్కు నిదర్శనమని విశ్లేషకులు అంటున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. USAలో మాత్రం 26న విడుదలవుతుంది.
MPలోని అశోక్ నగర్ జిల్లాలో ముంగావలిలో ఓ తల్లి నలుగురు పిల్లలను పోగొట్టుకుంది. పసిబిడ్డను ఆసుపత్రికి తీసుకురాగా హిమోగ్లోబిన్ తక్కువగా ఉందని డాక్టర్లు చెప్పారు. చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యాక 2రోజులకు శిశువు మరణించింది. ఇంతకుముందూ ఇలాగే సరైన చికిత్స అందక ముగ్గురు పిల్లలు చనిపోయారు. మరో పాప పోషకాహార లోపంతో ఉన్నా అధికారులు సరిగా స్పందించకపోవడం గమనార్హం. ఇది దేశంలోని వైద్య వ్యవస్థ లోపాలకు నిదర్శనం.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంటేనే ఓ సర్కస్ అని ఆ దేశ మాజీ ప్లేయర్ యాసిర్ అరాఫత్ విమర్శించారు. ఎప్పుడు ఏం చేస్తుందో బోర్డుకే తెలీదంటూ మండిపడ్డారు. ‘బంగ్లాతో టెస్టుల్లో పాక్ ఘోరంగా ఓడింది. ఇంగ్లండ్తో కీలక టెస్టు సిరీస్కు ముందు ఆటగాళ్లకు ప్రాక్టీస్ ఉండాలి. కానీ విచిత్రంగా పీసీబీ వన్డే కప్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తోంది. బోర్డులో అందరూ జోకర్లే. వారి ప్రతి నిర్ణయం ఓ జోకే’ అని ధ్వజమెత్తారు.
Sorry, no posts matched your criteria.