News December 8, 2024

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

image

అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి వర్షం కురిసింది. TGలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈనెల 10 నుంచి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలో విశాఖ, అనకాపల్లి, కాకినాడ తదితర జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి.

News December 8, 2024

ఏప్రిల్ నుంచి రాజమౌళి-మహేశ్ సినిమా షురూ?

image

రాజమౌళి- మహేశ్ బాబు కాంబినేషన్‌లో మూవీ పట్టాలెక్కడం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం లొకేషన్లు, నటీనటుల ఎంపికలో దర్శకధీరుడు బిజీగా ఉన్నారు. ఏప్రిల్ మూడో వారం తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం. అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో ఇండోనేషియన్ బ్యూటీ చెల్సియా ఇస్లాన్ హీరోయిన్‌గా ఎంపికైనట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

News December 8, 2024

AUSvsIND: టీమ్ ఇండియా అమ్మాయిల లక్ష్యం 372

image

ఆస్ట్రేలియాలో భారత్, ఆసీస్ అమ్మాయిల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో టీమ్ ఇండియా బౌలర్లు తేలిపోయారు. జార్జియా వోల్(101), ఎలీస్ పెర్రీ(105) సెంచరీలు, లిచ్‌ఫీల్డ్(60), బెత్ మూనీ(56) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో 50 ఓవర్లలో ఆసీస్ టీమ్ 371/8 స్కోర్ చేసింది. భారత బౌలర్లలో సైమా 3 వికెట్లు, మిన్ను 2, రేణుక, దీప్తి శర్మ, ప్రియా మిశ్రా తలో వికెట్ తీశారు.

News December 8, 2024

కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

కార్తీక మాసం తర్వాత పెరుగుతాయనుకున్న చికెన్ రేట్లు కాస్త తగ్గాయి. కొన్ని చోట్ల యథాతథంగా ఉన్నాయి. HYDలో కేజీ చికెన్ రూ.180 నుంచి రూ.230 వరకు ఉంది. ప్రస్తుతం ధరలు తగ్గినప్పటికీ క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతిలోగా పెరగవచ్చని వ్యాపారులు అంటున్నారు. మరోవైపు కోడిగుడ్ల ధర పెరుగుతోంది. ఒక కోడిగుడ్డుకు రిటెయిల్ ధర రూ.7గా ఉంది. హోల్‌సేల్‌లో రూ.6.50 పలుకుతోంది. మరి మీ ప్రాంతంలో చికెన్ ధర ఎంతుంది?

News December 8, 2024

ధర్నాలకు కేరాఫ్‌ తెలంగాణ: బీఆర్ఎస్

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనలో రాష్ట్రంలోని సబ్బండవర్గాలు ఆందోళన బాట పట్టాయని BRS ట్వీట్ చేసింది. KCR పాలనలో అభివృద్ధిలో పరుగులు తీసిన రాష్ట్రం, నేడు రేవంత్‌ ప్రభుత్వం వల్ల సంక్షోభంలో కూరుకుపోయిందని పేర్కొంది. నిరుద్యోగులు, రైతులు, విద్యార్థులు, ఆఖరికి పోలీసులు కూడా రోడ్డెక్కారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చని, సమస్యలు చెప్పుకునేందుకు కూడా కాంగ్రెస్ అవకాశం ఇవ్వడం లేదని విమర్శించింది.

News December 8, 2024

PM కిసాన్ రూ.12వేలకు పెంచాలని డిమాండ్

image

వ్యవసాయ రుణాలపై వడ్డీ రేట్లను ఒక శాతానికి తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలను రైతు ప్రతినిధులు డిమాండ్ చేశారు. PM కిసాన్ వార్షిక సాయాన్ని ₹6K నుంచి ₹12Kకు పెంచాలని కోరారు. PM ఫసల్ బీమా యోజన కింద సన్నకారు రైతులకు జీరో ప్రీమియంతో ఇన్సూరెన్స్ కల్పించాలని ప్రీబడ్జెట్ సంప్రదింపుల సమావేశంలో విన్నవించారు. పురుగుమందులపై GSTని 18 నుంచి 5 శాతానికి తగ్గించాలని PHD ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ప్రతిపాదించింది.

News December 8, 2024

OTTలోకి వచ్చేసిన ‘కంగువా’

image

శివ డైరెక్షన్‌లో సూర్య నటించిన కంగువా మూవీ OTTలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 14న విడుదలైంది. సూర్య నటనకు ప్రశంసలు దక్కినా సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది. బాబీ డియోల్, దిశా పటానీ, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు.

News December 8, 2024

హెడ్ విషయంలో సిరాజ్ విలన్ అయ్యారు: గవాస్కర్

image

ట్రావిస్ హెడ్‌ ఔట్ అయిన అనంతరం భారత బౌలర్ సిరాజ్‌కు, ఆయనకు మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. అది పూర్తిగా అనవసరమని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నారు. ‘హెడ్ ఒకట్రెండు పరుగులు కాదు.. 140 రన్స్ చేశారు. ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. అలాంటి ఆటగాడిని ఔట్ చేయడం ద్వారా హీరో అవ్వాల్సిన సిరాజ్, తన చర్యతో విలన్ అయ్యారు. హెడ్‌ను అభినందించి ఉంటే ప్రేక్షకుల అభిమానం పొంది ఉండేవారు’ అని పేర్కొన్నారు.

News December 8, 2024

దక్షిణ కొరియా మాజీ రక్షణమంత్రి అరెస్ట్

image

సౌత్ కొరియా మాజీ రక్షణ మంత్రి కిమ్ యాంగ్-హ్యున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అధ్యక్షుడు యూన్ సుక్ మార్షల్ లా ప్రకటించడం వెనుక కిమ్ కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలున్నాయి. ఈ నెల 4న ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఆయన్ను ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుని విచారించింది. కిమ్‌తో పాటు అధ్యక్షుడు యూన్‌పైనా దేశద్రోహం కేసు నమోదు చేయాలని ప్రతిపక్షాలు ఇప్పటికే ఫిర్యాదు చేశాయి.

News December 8, 2024

అన్ని వైద్య కళాశాలల్లో ART సెంటర్లు

image

TG: రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాలల్లో ART సెంటర్లు ఏర్పాటు చేయాలని జాతీయ వైద్య కమిషన్ ఆదేశించింది. దీంతో ఇప్పుడున్న 22కేంద్రాలతో పాటు త్వరలో 34సెంటర్లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో 1.20లక్షల మంది HIV/ఎయిడ్స్ బాధితుల్లో లక్షమందికి పైగా రెగ్యులర్‌గా మందులు తీసుకుంటున్నారు. 33 జిల్లాల్లో పరీక్షల నిర్వహణ, బాధితులకు సకాలంలో మందుల సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతుండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.