India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
క్రికెట్ చరిత్రలో తొలి 7 టెస్ట్ సెంచరీలను 7 వేర్వేరు జట్లపై చేసిన తొలి క్రికెటర్గా ఇంగ్లండ్ ప్లేయర్ ఒలి పోప్ నిలిచారు. శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో ఈ ఫీట్ను సాధించారు. పోప్ కు ఇది 49వ టెస్ట్ కాగా, ఇప్పటివరకు 7 సెంచరీలు బాదారు. వీటిని ఆరు వేర్వేరు మైదానాల్లో చేయడం విశేషం. SA, NZ, IND, SL, WI, IRE, PAK జట్లపై ఆయన శతకాలు నమోదు చేశారు.
AP: టెన్త్ క్లాస్ 2022, 2023, 2024 బ్యాచ్ ఫెయిలైన విద్యార్థులకు పాత సిలబస్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ ఏడాది పదో తరగతి సిలబస్లో మార్పులు జరగడం, సీబీఎస్ఈ సిలబస్ను అమలు చేస్తుండటంతో పాత విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. దీంతో అధికారులు క్లారిటీ ఇచ్చారు. వారు చదువుకున్న సిలబస్తోనే ఎగ్జామ్స్ ఉంటాయని తెలిపారు.
TG: మంత్రి సీతక్కకు ఫోన్ చేసి తిట్టిన వ్యక్తిని పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈనెల 4న గుర్తుతెలియని వ్యక్తి సీతక్కకు మూడుసార్లు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించాడు. తీవ్రంగా పరిగణించిన ఆమె తన డ్రైవర్ శ్రీనుతో పీఎస్లో ఫిర్యాదు చేయించారు. మొబైల్ నంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
TG: రాఖీలు, తిలకం, మెహిందీ వంటి వాటితో స్కూళ్లకు వచ్చే విద్యార్థులకు పనిష్మెంట్ ఇవ్వొద్దని విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇలాంటి వాటితో వచ్చే కొందరు స్టూడెంట్స్ను కార్పొరల్ పనిష్మెంట్ పేరిట వేధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఒకవేళ అలాంటి ఘటనలు జరిగినట్లు తేలితే ఆర్టీఈ యాక్ట్-2009 సెక్షన్-17 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
TG: నిన్న డీఎస్సీ ‘కీ’ విడుదల చేసిన విద్యాశాఖ 3,4 రోజుల్లో ఫలితాలు వెల్లడించేందుకు సిద్ధమవుతోంది. ఈ పరీక్షలో మార్కులు, టెట్లో వచ్చిన మార్కుల వెయిటేజీని కలిపి డీఎస్సీ ఫలితాలు విడుదల చేయనుంది. అనంతరం జిల్లాల వారీగా మెరిట్ జాబితాను రూపొందించనుంది. కాగా ప్రిలిమినరీ కీతో పోలిస్తే ఫైనల్ కీలో 109ప్రశ్నలకు జవాబులు మార్చినట్లు తెలుస్తోంది. 50ప్రశ్నలకు ఆన్సర్స్ సరిగ్గా లేకపోవడంతో వాటికి మార్కులు జత చేశారు.
తిరుమల అలిపిరి నడక మార్గంలో పాదాల మండపం వద్ద దివ్యదర్శనం టోకెన్ల జారీని త్వరలో పునః ప్రారంభిస్తామని టీటీడీ తెలిపింది. భక్తులకు ఆధార్ ప్రామాణికంగా సేవలందించేందుకు కేంద్రం ప్రాథమికంగా అనుమతి ఇచ్చిందని, త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నోటిఫికేషన్ జారీ చేయనుందని ఈవో శ్యామలరావు తెలిపారు. ఆగస్టులో శ్రీవారిని 22.42లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని పేర్కొన్నారు.
వినాయక చవితి రోజున గణపతిని 21 రకాల పత్రిలతో పూజిస్తారు. మాచీ పత్రం (మాచిపత్రి), బృహతీ(ములక), బిల్వ(మారేడు), దూర్వ(గరిక), దత్తూర(ఉమ్మెత్త), బదరీ(రేగు), అపామార్గ(ఉత్తరేణి), తులసి, చూత(మామిడి), కరవీర(గన్నేరు), విష్ణుక్రాంత(శంఖపుష్పం), దాడిమీ(దానిమ్మ), దేవదారు, మరువక(ధవనం, మరువం), సింధువార(వావిలి), జాజి(జాజిమల్లి), గండకీ పత్రం(కామంచి), శమీ(జమ్మి), అశ్వత్థ(రావి), అర్జున(తెల్ల మద్ది), అర్క(జిల్లేడు).
AP: చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వరసిద్ధి వినాయక దేవస్థానంలో ఇవాళ్టి నుంచి 21 రోజులపాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. నేడు కలెక్టర్ సుమిత్ పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 8న ధ్వజారోహణం, 9న నెమలి వాహనం, 10న మూషిక, 11న శేష, 12న చిలుక, 13న గజ వాహనం, 14న రథోత్సవం, 16న ధ్వజావరోహణం ఉంటుంది. 17న నందివాహనం, 18న రావణ బ్రహ్మ, 20న విమానోత్సవం తదితర సేవలుంటాయి. 27న తెప్పోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి.
TG: హైడ్రాను HMDA వరకు విస్తరించి, 3 జోన్లుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటి బాధ్యతలను SP స్థాయి అధికారులకు ఇవ్వనుంది. HYD పోలీస్ కమిషనరేట్ను సెంట్రల్ జోన్గా, రాచకొండ-సౌత్, సైబరాబాద్ను నార్త్ జోన్గా విభజించనుంది. హైడ్రాకు చట్టబద్ధతపై న్యాయశాఖ అధ్యయనం చేస్తోంది. దీనిపై ఆర్డినెన్స్ జారీ చేయాలని, ప్రత్యేక పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
AP: వరద సహాయ చర్యల కోసం 6 జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.67కోట్ల నిధులను విడుదల చేసింది. ఎన్టీఆర్ జిల్లాకు రూ.50కోట్లు, కృష్ణాకు రూ.5కోట్లు, అల్లూరి సీతారామరాజు జిల్లాకు రూ.2కోట్లు, పల్నాడుకు రూ.4కోట్లు, గుంటూరుకు రూ.2కోట్లు, ఏలూరుకు రూ.3కోట్లు, తూ.గో జిల్లాకు రూ.కోటి చొప్పున కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Sorry, no posts matched your criteria.