News June 21, 2024

కల్తీ సారా.. మోగుతున్న మరణమృదంగం

image

తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలో మరణమృదంగం మోగుతోంది. కల్తీ నాటు సారా మృతుల సంఖ్య 47కి చేరినట్లు తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. మరో 30 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపింది. కల్తీ సారా తాగి మొత్తం 165 మంది అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు. వీరిలో ముగ్గురు పూర్తిగా కోలుకున్నారని వివరించారు. మరోవైపు మృతదేహాలను సామూహిక దహనం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

News June 21, 2024

172 మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం

image

AP: తొలి రోజు 172 మంది ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు. టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, పితాని సత్యనారాయణ, వనమాడి వెంకటేశ్వరరావు వేర్వేరు కారణాల వల్ల ఈరోజు అసెంబ్లీకి రాలేకపోయారు. సభ రేపు ఉదయం 10.30గంటలకు పున:ప్రారంభం కానుంది. మిగిలిన ముగ్గురు సభ్యులు రేపు ప్రమాణం చేసే వీలుంది.

News June 21, 2024

నెటిజన్‌పై శ్రుతి హాసన్ అసహనం

image

‘సౌత్ ఇండియన్ యాసలో ఏదైనా చెప్పండి’ అంటూ ప్రశ్నించిన నెటిజన్‌పై హీరోయిన్ శ్రుతి హాసన్ అసహనం వ్యక్తం చేశారు. ‘ఇలాంటి వివక్షలు వద్దు. మీరు మమ్మల్ని ఇడ్లీ, సాంబార్ అని అనడం మంచిది కాదు. మీరు మమ్మల్ని అనుకరించలేరు. మాలాగా ఉండేందుకు ప్రయత్నించొద్దు’ అని ఘాటు రిప్లై ఇచ్చారు. బాలీవుడ్ నటులు దక్షిణాది యాక్టర్లను చిన్న చూపు చూస్తారనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆమె ఇలా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.

News June 21, 2024

అందుకే బొగ్గు గనుల వేలం: కిషన్‌రెడ్డి

image

దేశంలో ఇంధన అవసరాలను తీర్చేందుకే బొగ్గు గనులు వేలం వేస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. మార్కెట్‌లో బొగ్గుకు విపరీతమైన డిమాండ్ ఉందని, బొగ్గు అంటే నల్ల బంగారమని అభివర్ణించారు. బొగ్గు లేనిదే విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కాదని, అన్ని పరిశ్రమలకు బొగ్గు ప్రాణాధారమని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన బొగ్గు గనుల వేలం కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

News June 21, 2024

అనారోగ్యం కారణంగానే MLA భార్య ఆత్మహత్య: పోలీసులు

image

TG: అనారోగ్యం కారణంగానే చొప్పదండి MLA సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. మూడేళ్ల నుంచి ఆమె కడుపునొప్పితో బాధపడుతోందని, అది భరించలేక సూసైడ్ చేసుకుందని కుటుంబ సభ్యులు చెప్పినట్లు అల్వాల్ ఏసీపీ రాములు తెలిపారు. అఘాయిత్యానికి ముందు తన తల్లి, భర్తకు ఆమె ఇదే విషయాన్ని తెలియజేసినట్లు వెల్లడించారు. రూపాదేవి చనిపోయినప్పుడు తల్లి, కుమారుడు, కుమార్తె ఇంట్లోనే ఉన్నారు.

News June 21, 2024

నన్ను దురదృష్టవంతురాలు అనడం మానేయండి: రేణూ దేశాయ్

image

భర్త వదిలేశారని తనను దురదృష్టవంతురాలిగా పేర్కొనడం ఎంతో బాధిస్తోందని నటి రేణూ దేశాయ్ అన్నారు. అందంగా ఉండి, మంచి పిల్లలు ఉన్నప్పటికీ మీరు అన్‌లక్కీ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘నాతో ఉన్నవాటితో నేను సంతోషంగా ఉన్నా. లేనివాటి గురించి బాధలేదు. విడాకులు తీసుకున్న వారిపై, వితంతువులపై ఇలాంటి కామెంట్స్ సరికాదు. వ్యక్తిత్వం, ప్రతిభను బట్టి వారితో ప్రవర్తించాలి’ అని రిప్లై ఇచ్చారు.

News June 21, 2024

సూర్యకుమార్ యాదవ్ రికార్డు

image

భారత స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ అతి తక్కువ T20 మ్యాచుల్లో అత్యధిక POTM అవార్డు గెలుచుకున్న ప్లేయర్‌గా నిలిచారు. SKY 64 మ్యాచుల్లోనే 15 సార్లు అవార్డును అందుకున్నారు. కింగ్ కోహ్లీ 120 మ్యాచుల్లో 15సార్లు POTMలు అందుకొని సెకండ్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో మలేషియా ప్లేయర్ విరన్‌దీప్ సింగ్(14), జింబాబ్వే ప్లేయర్ సికందర్ రాజా(14), అఫ్గాన్ ప్లేయర్ మహ్మద్ నబీ(14) ఉన్నారు.

News June 21, 2024

త్వరలో గులాబీ పార్టీ ఖాళీ: దానం

image

TG: తమ పార్టీలో చేరేందుకు చాలామంది BRS నేతలు ఆసక్తిగా ఉన్నారని కాంగ్రెస్ MLA దానం నాగేందర్ అన్నారు. ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డితో మొదలైందని, త్వరలో 20మంది ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరతారని చెప్పారు. మాజీ మంత్రి హరీశ్ రావు బీజేపీలోకి వెళ్లాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ విధానాలే ఆ పార్టీ కొంప ముంచాయని, త్వరలో గులాబీ పార్టీ ఖాళీ అవుతుందని దానం జోస్యం చెప్పారు.

News June 21, 2024

అధికారికంగా రామోజీ సంస్మరణ కార్యక్రమం

image

AP: రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీ రావు సంస్మరణ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 27న కృష్ణా జిల్లా పెనమలూరులో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి ప్రకటించారు. కాగా అనారోగ్య సమస్యలతో రామోజీరావు జూన్ 8న మరణించిన విషయం తెలిసిందే.

News June 21, 2024

జగన్‌కు గౌరవం ఇవ్వండి: సీఎం చంద్రబాబు

image

AP:మాజీ CM జగన్ వాహనాన్ని అసెంబ్లీ ప్రాంగణం లోపలకు అనుమతించాలని CBN అధికారులను ఆదేశించారు. ప్రతిపక్షనేత హోదా దక్కకపోవడంతో జగన్ గేటు బయటే కారు దిగి అసెంబ్లీ లోపలికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో CM ఈ నిర్ణయం తీసుకున్నారు. అటు ప్రతిపక్షం విషయంలో సభ్యులు హుందాగా వ్యవహరించాలని MLAలకు CM సూచించారు. చిన్న చిన్న అంశాలను రాజకీయం చేయవద్దని, రాగద్వేషాలకు తావు ఇవ్వొద్దని TDP సహచరులకు బాబు తెలిపారు.

error: Content is protected !!