India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పుష్ప సినిమాకు ఇంత క్రేజ్ రావడానికి కారణం దర్శకుడు రాజమౌళి అని సుకుమార్ అన్నారు. ‘పుష్ప-2’ను హిందీలో రిలీజ్ చేయాలని జక్కన్న పట్టుబట్టారని చెప్పారు. ’పుష్ప-2’లో చైల్డ్ హుడ్ సీన్, ట్రక్ సీన్తో పాటు 40 శాతం సినిమాను తన అసిస్టెంట్ శ్రీమన్ డైరెక్ట్ చేశారన్నారు. మూవీకి డైరెక్టెడ్ బై సుకుమార్, శ్రీమన్ అని వేయాల్సి ఉందని తెలిపారు. తన టీమ్లో అందరూ సుకుమార్లేనని పేర్కొన్నారు.

TG: రేవంత్ ప్రభుత్వం ఏడాదిగా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా విమర్శించారు. సరూర్ నగర్లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. మాయలఫకీర్లా రేవంత్ డ్రామాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. హామీల అమలులోనూ రేవంత్ ప్రభుత్వం విఫలమైందన్నారు. తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యమవుతుందని, కాంగ్రెస్ పార్టీ ఒక పరాన్నజీవి అని మండిపడ్డారు.

సెప్టెంబర్ త్రైమాసిక జీడీపీ గణాంకాలు క్షీణించడం వ్యవస్థాగత మందగమనాన్ని సూచించవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 3వ త్రైమాసికంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకొని రాబోయే రోజుల్లో వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజా, మూలధన వ్యయాలు తక్కువగా ఉండడం వల్ల 2వ త్రైమాసికంలో అభివృద్ధి మందగించిందన్నారు.

ఏఆర్ రెహమాన్ ఏడాదిపాటు మ్యూజిక్ వర్క్స్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తలను ఆయన కూతురు ఖతీజా ఖండించారు. ఇలాంటి పనికిరాని రూమర్స్ను ప్రచారం చేయొద్దని మండిపడ్డారు. ఇటీవల రెహమాన్, తన భార్య సైరా భాను విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’, రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమాతో పాటు పలు ప్రాజెక్టులకు సంగీతం అందిస్తున్నారు.

AP: ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రంలో ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వచ్చే 24 గంటల్లో ఇది మరింతగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది.

TG: తెలంగాణ రైతులు సన్న వడ్లనే పండించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సన్నవడ్లు పండిస్తే క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించారు. రేషన్ కార్డుదారులకు, మధ్యాహ్నభోజనంలో పేద పిల్లలకు రైతులు పండించిన సన్నబియ్యాన్నే పెడతామని పేర్కొన్నారు. ఎవరు అడ్డువచ్చినా సంక్రాంతి తర్వాత రైతుభరోసా డబ్బులను అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం స్పష్టం చేశారు.

తాము మొదటి ఏడాదిలోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇన్ని ఉద్యోగాలు దేశంలో ఎవరూ ఇవ్వలేదని, ఇదో రికార్డు అని తెలిపారు. శాఖల వారీగా ఎన్ని ఉద్యోగాలిచ్చామో అసెంబ్లీలో రుజువు చేస్తామని, కేసీఆర్ రావాలని సవాల్ విసిరారు. ఉద్యోగాలపై BRS చెప్పిందే బీజేపీ చెప్పిందని.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 55వేల ఉద్యోగాలిచ్చారని నిరూపిస్తే ఢిల్లీలో క్షమాపణలు చెప్తానని సవాల్ విసిరారు.

TG: ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగు చేసే చపాట మిర్చికి అరుదైన ఘనత లభించింది. దీనికి జీయో ట్యాగ్ గుర్తింపునకు ఇండియన్ పేటెంట్ ఆఫీస్(IPO) ఆమోదం తెలిపింది. ఈ రకం మిరపకాయలు టమాటా వలె ఉంటాయి. ఇందులో కారం తక్కువ మోతాదులో ఉంటుంది. రెండేళ్ల క్రితం ఈ మిర్చికి వరంగల్ మార్కెట్లో రూ.లక్ష ధర పలకడం గమనార్హం.

రిషభ్ పంత్ను IPL వేలంలో LSG రికార్డు స్థాయిలో రూ.27 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీని పంత్ వదిలేయడానికి గల కారణాన్ని ఆ జట్టు కోచ్ హేమాంగ్ బదానీ వెల్లడించారు. ‘పంత్ వేలంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తానెంత ధర పలుకుతానో చూడాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఎంత ఒప్పించడానికి ట్రై చేసినా వినలేదు. అన్నట్లుగానే భారీ ధర పలికాడు. మంచి ఆటగాడికి న్యాయంగానే భారీ ధర దక్కింది’ అని పేర్కొన్నారు.

TG: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనుంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సా.6.05 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఇప్పటికే ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు ఆహ్వానం పంపారు.
Sorry, no posts matched your criteria.