News October 12, 2024

కురచ దుస్తులతో దుర్గమ్మ మండపానికి.. భక్తుల ఫైర్

image

కోల్‌కతాకు చెందిన ముగ్గురు మోడల్స్ కురచ దుస్తులతో దుర్గామాతను దర్శించుకున్నారు. దీనిపై భక్తులు వారిని తిట్టి పోస్తున్నారు. మాజీ మిస్ కోల్‌కతా హేమో శ్రీ భద్ర, మరో ఇద్దరు మోడళ్లతో కలిసి అసభ్యకర దుస్తుల్లో దుర్గామాతను దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీటిని చూసిన భక్తులు కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉండాలని తిడుతున్నారు.

News October 12, 2024

రేపటి మ్యాచ్‌లో ఈ ప్లేయ‌ర్ల‌కు నో ఛాన్స్‌?

image

హైద‌రాబాద్ వేదిక‌గా శ‌నివారం బంగ్లాదేశ్‌తో జ‌ర‌గ‌నున్న చివ‌రి టీ20 మ్యాచ్‌లో ముగ్గురు భార‌త‌ ప్లేయ‌ర్ల‌కు రెస్ట్ ఇచ్చే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. గ‌త రెండు మ్యాచ్‌ల‌లో చెప్పుకోద‌గ్గ బ్యాటింగ్ చేయ‌ని సంజూ శాంసన్ స్థానంలో తిల‌క్ వ‌ర్మ జ‌ట్టులోకి రావ‌చ్చ‌ని తెలుస్తోంది. అలాగే, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి స్థానంలో ర‌వి బిష్ణోయ్‌, మయాంక్ యాద‌వ్ స్థానంలో హ‌ర్షిత్ రాణాకు చోటు ద‌క్కే సూచనలు కనిపిస్తున్నాయి.

News October 12, 2024

స్కిల్ వర్సిటీలో ప్రవేశాలకు ఆహ్వానం

image

TG: స్కిల్ యూనివర్సిటీలో ప్రవేశాలకు అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. లాజిస్టిక్స్, ఈ కామర్స్, హెల్త్ కేర్, ఫార్మాసుటికల్స్, లైఫ్ సైన్సెస్‌ విభాగాల్లో శిక్షణ అందించనున్నారు. అభ్యర్థులు యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ(YISU) వెబ్‌సైట్‌ ద్వారా ఈ నెల 29వ తేదీలోపు అప్లై చేసుకోవాలి. NOV 4 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. తాత్కాలికంగా రాయదుర్గంలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాలో తరగతులు నిర్వహిస్తారు.

News October 12, 2024

న్యూజిలాండ్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. వైస్ కెప్టెన్‌గా బుమ్రా

image

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. జస్ప్రీత్ బుమ్రాను వైస్ కెప్టెన్‌గా నియమించింది. జట్టు: రోహిత్ శర్మ (C), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫ్‌రాజ్ ఖాన్, రిషభ్ పంత్, ధ్రువ్ జురేల్, అశ్విన్, జడేజా, అక్షర్, కుల్దీప్, సిరాజ్, ఆకాశ్ దీప్, బుమ్రా. ట్రావెలింగ్ రిజర్వ్: నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ.

News October 12, 2024

అక్కడ ప్రమాదంలో 600 మంది భారత సైనికులు!

image

లెబ‌నాన్‌లోని UN శాంతి ప‌రిర‌క్ష‌ణ బ‌ల‌గాల స్థావ‌రాలపై ఇజ్రాయెల్ దాడి చేయ‌డంపై భార‌త్ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఇరు దేశాల స‌రిహ‌ద్దుల్లోని బ్లూ లైన్ వెంబ‌డి 600 మంది భార‌త సైనికులు UN శాంతిప‌రిక్ష‌ణ మిష‌న్‌లో విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. ఈ స్థావ‌రాల‌ను ఇజ్రాయెల్ క్షిప‌ణులు ఢీకొట్టాయి. అయితే, అదృష్ట‌వ‌శాత్తు ప్రాణాపాయం త‌ప్పింది. UN స్థావ‌రాల ప‌రిర‌క్ష‌ణ‌కు క‌ట్టుబ‌డి ఉండాల‌ని భార‌త్‌ సూచించింది.

News October 11, 2024

నేను ఆడపిల్లనని భారంగా భావించారు: మల్లిక

image

ఆడపిల్ల పుట్టిందని తనను తల్లిదండ్రులు భారంగా భావించారని బాలీవుడ్ బ్యూటీ మల్లిక షెరావత్ తెలిపారు. ‘నా సోదరుడిని ఆప్యాయంగా చూసేవారు. అతణ్ని ఉన్నతంగా చదివించాలి, విదేశాలకు పంపించాలనుకునేవారు. ఆస్తులు కూడా తమ్ముడికే చెందాలనుకునేవారు. అమ్మాయిలు ఏం పాపం చేశారు? నన్ను చదివించారు కానీ స్వేచ్ఛనివ్వలేదు. నన్నెప్పుడూ అర్థం చేసుకోలేదు. నేను పుట్టినప్పుడు మా అమ్మ డిప్రెషన్‌లోకి వెళ్లుంటుంది’ అని నిట్టూర్చారు.

News October 11, 2024

ట్రిలియన్ డాలర్లు దాటిన భారత కుబేరుల సంపద!

image

భారత కుబేరుల సంపద మొత్తం కలిపి తొలిసారిగా ట్రిలియన్ డాలర్లను దాటిందని ఫోర్బ్స్ సంస్థ ప్రకటించింది. 2019తో పోలిస్తే వారి సంపద రెట్టింపైందని తెలిపింది. ఒక్క 2023లోనే వారు 316 బిలియన్ డాలర్లను సంపాదించారని పేర్కొంది. భారత ఆర్థిక వ్యవస్థ పాజిటివ్‌గా ఉందని కొనియాడింది. కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీ (119.5 బిలియన్ డాలర్లు) అగ్రస్థానంలో ఉన్నారు. అదానీ(116 బిలియన్ డాలర్లు) 2వ స్థానంలో నిలిచారు.

News October 11, 2024

బెల్లీ ల్యాండింగ్ అంటే ఏంటి..?

image

విమానం టేకాఫ్‌, ల్యాండింగ్‌లో ల్యాండింగ్ గేర్ అనేది కీలకం. ఇది విమాన చక్రాలు, స్ట్రట్స్, షాక్ అబ్సార్బర్స్‌తో అనుసంధాన‌మై పనిచేస్తుంది. ఇందులో సమస్య ఏర్పడి చక్రాలు తెరుచుకోని పరిస్థితుల్లో బెల్లీ ల్యాండింగ్ చేస్తారు. అంటే విమానాన్ని చ‌క్రాల ద్వారా కాకుండా నేరుగా విమానం మ‌ధ్య భాగం (బెల్లీ) భూమిని తాకేలా ల్యాండ్ చేస్తారు. అత్యంత ప్ర‌మాద‌కర ప‌రిస్థితుల్లో చివ‌రి అవ‌కాశంగా దీనికి అనుమ‌తిస్తుంటారు.

News October 11, 2024

మెగాస్టార్‌తో విక్టరీ వెంకటేశ్: పిక్స్ వైరల్

image

‘విశ్వంభర’ సెట్స్‌లో మెగాస్టార్ చిరంజీవిని హీరో దగ్గుబాటి వెంకటేశ్ కలిశారు. ఆయనతోపాటు హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ కూడా చిరును కలిసి సందడి చేశారు. కాగా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వెంకీ ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి, ఐశ్వర్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరోవైపు చిరు నటిస్తున్న ‘విశ్వంభర’ మూవీ టీజర్ రేపు ఉదయం హైదరాబాద్‌లోని మైత్రీ విమల్ థియేటర్‌లో విడుదల కానుంది.

News October 11, 2024

జగన్‌పై కోపం లడ్డూపై చూపించారు: నారాయణ

image

AP: జగన్‌పై ఉన్న కోపాన్ని కూటమి సర్కార్ తిరుమల లడ్డూపై చూపించిందని సీపీఐ నారాయణ ఆరోపించారు. ఈ అంశం RSSకు రాజకీయంగా ఉపయోగపడిందన్నారు. గత ప్రభుత్వం మద్యంలో హోల్‌సేల్‌గా దోచుకుందని మండిపడ్డారు. ఇప్పుడు TDP, YCP సిండికేట్‌గా మారి అరాచకం చేయబోతున్నాయని విమర్శించారు. ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు మాట్లాడకుండా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక ఎక్కడా దొరకడం లేదన్నారు.