India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
EC అంటే ఎన్నికల కమిషన్ కాదని, ఈజ్లీ కాంప్రమైజ్డ్ అని శివసేన(UBT) నేత ఆదిత్య థాక్రే విమర్శించారు. EVMలు లేకపోతే BJPకి 40 సీట్లు కూడా వచ్చేవి కాదన్నారు. ముంబై నార్త్ వెస్ట్ స్థానం ఫలితంపై సుప్రీంకోర్టు ఆశ్రయిస్తామని ప్రకటించారు. 48 ఓట్లతో గెలిచిన రవీంద్ర MPగా ప్రమాణం చేయకుండా ఆపాలని కోరుతామన్నారు. కౌంటింగ్ సమయంలో MP బంధువు మొబైల్తో ఓపెన్ చేసి డేటా మార్చినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
మణిపుర్లో శాంతిభద్రతల పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర హోం సెక్రటరీ అజయ్ భల్లా, ఇంటెలిజెన్స్ చీఫ్ తపన్ డేకా తదితర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏడాదిగా మణిపుర్లో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ మీటింగ్కు ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా 2023 మే 3న ఘర్షణలు మొదలైనప్పటి నుంచి 220 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న ‘పుష్ప-2’ సినిమా ఆగస్టు 15వ తేదీ నుంచి తప్పుకోవడంతో కొత్త విడుదల తేదీ కోసం మేకర్స్ అన్వేషిస్తున్నారు. ఓవర్సీస్ బాక్సాఫీస్ని దృష్టిలో ఉంచుకొని డిసెంబర్ 5న రిలీజ్ చేస్తే USAలో వారం రోజులు సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని భావిస్తున్నారు. డిసెంబర్ 20న రిలీజ్ చేస్తే భారత్లో క్రిస్మస్, న్యూఇయర్ హాలీడేస్ మూవీకి భారీగా కలెక్షన్లు తెచ్చిపెడతాయని అనుకుంటున్నారు.
మోదీ ప్రభుత్వంలో ఘోర రైలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయని తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. 2014లో గోరఖ్దామ్ ఎక్స్ప్రెస్- 25 మంది, 2016లో ఇండోర్-పట్నా ఎక్స్ప్రెస్- 150 మంది, 2017లో పురీ-హరిద్వార్ ఎక్స్ప్రెస్ 23 మంది, 2022లో బికనీర్-గువాహటి ఎక్స్ప్రెస్ 9 మంది, 2023లో బాలాసోర్- 296 మంది, కంచన్జంగా రైలు ప్రమాదంలో 15 మంది చనిపోయారని పేర్కొంది. ఈ ప్రమాదాలకు బాధ్యులెవరిని నిలదీసింది.
AP: మాజీ మంత్రి, ప్రకాశం జిల్లా దర్శి మాజీ ఎమ్మెల్యే శిద్ధా రాఘవరావు వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపారు. వ్యక్తిగత కారణాల రీత్యా పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు శిద్ధా ప్రకటించారు. 2014లో చంద్రబాబు హయాంలో మంత్రిగా పని చేసిన శిద్ధా.. 2019లో ఒంగోలు టీడీపీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.
ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ వాడే భారతీయులు నాన్ క్యాష్ పేమెంట్స్కే మొగ్గు చూపుతున్నారు. క్యాష్(భౌతిక నగదు)కు బదులుగా UPI, డెబిట్, క్రెడిట్ కార్డు, డిజిటల్ వ్యాలెట్స్తో పేమెంట్స్ చేస్తున్నారు. దీంతో ఆరేళ్ల క్రితం 20.4%గా ఉన్న నాన్ క్యాష్ పేమెంట్స్ ఇప్పుడు ఏకంగా 58.1%కి చేరింది. ఈ పేమెంట్స్లో ఆసియా పసిఫిక్ రీజియన్లో చైనా ముందుండగా, ఆ తర్వాత ఇండియా, ఇండోనేషియా ఉన్నట్లు 2023 నివేదికలు చెబుతున్నాయి.
AP: ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చన్న టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ చీఫ్ పురందీశ్వరి స్పందించారు. ‘భారత ఎన్నికల సంఘం మస్క్ను భారత్కు ఆహ్వానించాలి. ఈవీఎంల హ్యాకింగ్ నిరూపణకు అవకాశం ఇవ్వాలి. ఈవీఎంలపై పరిశోధనలకు ఈసీ చాలా మందికి అవకాశం ఇచ్చింది. అయినా ఎవరూ హ్యాక్ చేయలేకపోయారు’ అని ట్వీట్ చేశారు.
హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈక్రమంలో రోడ్లపై వరద నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వరద నీటిని తొలగించేందుకు DRF సిబ్బంది కృషి చేస్తున్నట్లు GHMC తెలిపింది. ఎలాంటి సమస్యలున్నా 040-21111111, 9000113667 ఫోన్ చేయాలని తెలిపింది. ద్విచక్ర వాహనదారులు అజాగ్రత్తగా ఉంటే స్కిడ్ అయ్యే అవకాశం ఉంది. వర్షం తగ్గే వరకూ బయటకెళ్లకపోవడమే మంచిది.
హీరో దర్శన్ అభిమాని రేణుకాస్వామి <<13434917>>హత్య<<>> కేసులో దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యకు ముందు అతడికి కరెంట్ షాక్ ఇచ్చి చిత్రహింసలు పెట్టినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. శాకాహారినని చెప్పినా వినకుండా బిర్యానీతోపాటు ఎముకను నోట్లో కుక్కి తినిపించారని తెలిసింది. బాధితుడి శరీరంపై 39 గాయాలుండగా, 8 చోట్ల కాలిన గుర్తులున్నాయట. రేణుకా స్వామిపై మొదట పవిత్రా గౌడనే దాడి చేసినట్లు తేలింది.
బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ పేరిట ట్విటర్లో చెలామణి అవుతున్న అకౌంట్లు ఫేక్ అని ఆమె టీమ్ ప్రకటించింది. ఆమెకు ట్విటర్లో అకౌంట్ లేదని స్పష్టం చేసింది. కొందరు జాన్వీ పేరుతో అకౌంట్లు క్రియేట్ చేసి, బ్లూటిక్ కూడా పొందారంది. వాటితో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. ఆయా అకౌంట్ల నుంచి వచ్చే సమాచారాన్ని నమ్మవద్దని కోరింది. కాగా జాన్వీ ఇన్స్టాగ్రామ్ ద్వారా అప్డేట్స్ ఇస్తుంటారు.
Sorry, no posts matched your criteria.