India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అప్పుల ఊబిలో చిక్కుకున్న అనిల్ అంబానీ నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. రాయిటర్స్ కథనం ప్రకారం.. విద్యుత్ వాహనాల పరిశ్రమలోకి ఆయన అడుగుపెట్టనున్నారు. విద్యుత్ కార్లు, బ్యాటరీల ఉత్పత్తి కోసం చైనా కంపెనీ BYD మాజీ ఎగ్జిక్యూటివ్ సంజయ్ గోపాలకృష్ణన్ను సలహాదారుగా నియమించుకున్నారు. ఏడాదికి 2.5లక్షల వాహనాలు ఉత్పత్తి చేసే ప్లాంట్ను నిర్మించేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
TG: రాష్ట్రంలో రానున్న 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ చెప్పింది. ఈరోజు 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. రేపు 5 జిల్లాలకు, ఎల్లుండి 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. 3 రోజుల పాటు వాయుగుండం కొనసాగే ఛాన్స్ ఉందని పేర్కొంది.
TG: భారీ వర్షాలతో మున్నేరువాగు పొంగే అవకాశం ఉండటంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం బయల్దేరారు. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. కాగా మధ్యాహ్నం నుంచి ఖమ్మం, మహబూబాబాద్లో భారీ వర్షం కురుస్తోంది.
దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో 58.59 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. నేషనల్ జుడీషియరీ డేటా గ్రిడ్ సమాచారం ప్రకారం.. వీటిలో 30 ఏళ్లకు పైగా నలుగుతున్న కేసులు 62వేలు. 20 నుంచి 30 ఏళ్లుగా హైకోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య 2.45 లక్షలు. 3 కేసులు 1952 నుంచి, 4 కేసులు 1954 నుంచి, 9 కేసులు 1955 నుంచి పరిష్కారం కాలేదు. మొత్తంగా 42.64 లక్షల సివిల్ కేసులు, 15.94 లక్షల క్రిమినల్ కేసులు ఉన్నాయి.
AP: ప్రస్తుత పరిస్థితుల్లో రేషన్ అందజేయడానికి రేషన్ కార్డు అవసరం లేదని, ఫింగర్ ప్రింట్, ఐరిష్ ఉన్నా సరిపోతుందని CM చంద్రబాబు చెప్పారు. గత ప్రభుత్వం ఏ అకౌంట్లోనూ డబ్బులు మిగల్చలేదని అంతా ఊడ్చేసిందని తెలిపారు. ప్రాథమిక నివేదికను పంపితే కేంద్రం నుంచి సాయం త్వరగా వస్తుందన్నారు. సోషల్ మీడియాలో పోస్టులపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని సూచించారు. ఆధారాలు లేకుండా పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
TG: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ <<14035008>>ర్యాంకింగ్స్లో<<>> తెలంగాణ పేలవ ప్రదర్శనను ఉద్దేశించి కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. ఈ ఘనతను వర్ణించేందుకు తనకు మాటలు రావట్లేదని ట్వీట్ చేశారు. ఇలాంటి సమయంలోనే స్వచ్ఛ్ బయో, వాల్ష్ కర్రా వంటి ఆవిష్కరణలు అవసరమని వ్యంగ్యస్త్రాలు సంధించారు. తొమ్మిది నెలల పాలనలో ఇలా ఉంటే రాబోయే నాలుగేళ్లలో జరిగేవి తలుచుకుంటే భయమేస్తుందన్నారు.
డిగ్రీ పూర్తి చేసిన 25 ఏళ్లలోపు వయసు గలవారిని బ్యాంకులు త్వరలో అప్రెంటీస్లుగా నియమించుకొని నెలకు రూ.5 వేలు స్టైఫండ్ ఇవ్వనున్నాయి. కేంద్ర బడ్జెట్ ప్రకటన మేరకు గ్రాడ్యుయేట్స్కు ఇంటర్న్షిప్పై కార్పొరేట్ వ్యవహారాల శాఖ బ్యాంకులతో సమావేశమైంది. మరో నెల రోజుల్లో బ్యాంకులు ఈ నియామకాలు ప్రారంభించవచ్చని ఓ అధికారి తెలిపారు. ఏ బ్యాంకు ఎంత మందికి అవకాశం కల్పిస్తుందో తేలాల్సి ఉంది.
రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్నకు హిందూస్ ఫర్ అమెరికా ఫస్ట్ సంస్థ మద్దతు ప్రకటించింది. డెమోక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ భారత్-అమెరికా బంధానికి సమస్యాత్మకం కావచ్చని సంస్థ ఫౌండర్ ఉత్సవ్ సందుజా అభిప్రాయపడ్డారు. ఉపాధ్యక్షురాలిగా సరిహద్దు సమస్యలను ఆమె పరిష్కరించకపోవడం వల్లే అక్రమ వలసలతో నేరాలు పెరిగాయన్నారు. ఆమెకు వ్యతిరేకంగా 3 రాష్ట్రాల్లో ప్రచారం చేయనున్నట్టు వెల్లడించారు.
మహాభారతాన్ని వేదవ్యాసుల వారు బోధించగా వినాయకుడు రాసినట్లు పురాణ ప్రశస్తి. అయితే.. రాసేందుకు గణేశుడు ఓ షరతు విధించినట్లు కథనం ఉంది. దాని ప్రకారం.. రాయడానికి తనకు అంగీకారమేనని, కథ మొత్తం ఏకధాటిగా చెప్పాలని ఆయన షరతు పెట్టాడట. వ్యాసులవారు చెప్పడం ఆగితే తాను కూడా రాయడం ఆపేస్తానని అనడంతో ఏకధాటిగా మూడేళ్ల పాటు వ్యాసుల వారు భారతాన్ని వినిపించారని ఓ కథనం.
AP: విజయవాడలో వరద వచ్చి 8 రోజులు గడుస్తున్నా ఇంకా ఆకలికేకలు వినిపిస్తూనే ఉన్నాయని మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘అసలు ప్రభుత్వం అనేది ఉందా? లేదా? అని అనిపిస్తోంది. ఐదారు లక్షల మందిని ఉదారంగా ఆదుకోలేని దీనస్థితిలో ప్రభుత్వం ఉందా? గతంలో చాలా సార్లు 30 సెం.మీ పైగా వర్షం పడినా ఈ మాదిరిగా 50 మందికి పైగా ప్రజలు చనిపోలేదు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్కరోజులోనే రేషన్ సరుకులు పంపిణీ చేశాం’ అని తెలిపారు.
Sorry, no posts matched your criteria.