India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పారిస్ ఒలింపిక్స్లో రెజ్లర్ వినేశ్ వైఫల్యంపై బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ <<14037088>>వ్యాఖ్యలతో<<>> అతని మెంటాలిటీ బయటపడిందని బజరంగ్ పునియా కౌంటర్ ఇచ్చారు. ఆమె ఓటమితో అతను సంతోషంగా ఉండొచ్చని విమర్శించారు. అది వినేశ్ మెడల్ మాత్రమే కాదని, 140 కోట్ల మంది ప్రజలదని పేర్కొన్నారు. ఇలా ఓటమిని సెలబ్రేట్ చేసుకునేవారిని దేశ భక్తులంటారా? అని ప్రశ్నించారు.
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ భారతీయులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఆయన పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. స్వతహాగా భారతీయుడు కాకపోయినా ఇక్కడి రీల్స్, సినీతారల స్టెప్స్ వేస్తూ వార్నర్ దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్లో ఆయన ప్రస్తుతం ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
TG: ప్రభుత్వ జూ.కాలేజీల్లో విద్యార్థులకు EAPCET, NEET, JEE వంటి ఎంట్రన్స్ పరీక్షల కోసం శిక్షణనివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే దీనిని అమలు చేయనుంది. రాష్ట్రంలోని 424 ప్రభుత్వ జూనియర్ కాలేజీలుండగా, వాటిలో ఏటా 80వేల మంది ఫస్టియర్లో చేరుతున్నారు. వీరు EAPCETలో ఉత్తీర్ణత సాధించి బీటెక్, బీ ఫార్మసీ వంటి కోర్సుల్లో చేరితే ప్రభుత్వం పూర్తి రీయింబర్స్మెంట్ చేస్తోంది.
అధిక కాలం వాయు కాలుష్యానికి ప్రభావితం కావడం వల్ల పురుషుల్లో, ట్రాఫిక్ శబ్దాల వల్ల మహిళల్లో సంతానలేమి సమస్యలు పొంచి ఉన్నాయని ఓ అధ్యయనంలో తేలింది. PM2.5కు గురికావడం అనేది వయస్సుతో సంబంధం లేకుండా పురుషుల్లో వంధ్యత్వ సంభావ్యతతో ముడిపడి ఉందని డెన్మార్క్ పరిశోధకులు వెల్లడించారు. ట్రాఫిక్ శబ్దాలు 35 ఏళ్లు పైబడిన మహిళల్లో, 37 ఏళ్లు పైబడిన పురుషుల్లో సమస్యలకు దారితీస్తున్నాయని పేర్కొన్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా లెజెండరీ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ నుంచి ఎట్టకేలకు అప్డేట్ వచ్చింది. రెండో పాట రిలీజ్ డేట్ ఈ Septలో అనౌన్స్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో వినాయక చవితి కానుకగా అప్డేట్ కోసం ఎంతో ఎదురు చూసిన ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. కాగా ఈ మూవీలో చెర్రీకి జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ సందడి చేయనున్నారు.
మణిపుర్లో మళ్లీ విధ్వంసం చెలరేగింది. జిరిబామ్ జిల్లాలో మైతేయి, కుకీ తెగల మధ్య మరోసారి వివాదం మొదలైంది. జిల్లాలోని నుంగ్సిప్పి, రషీద్పూర్ గ్రామాలలోని తేయాకు తోటల్లో ఇరు వర్గాల మధ్య భారీ కాల్పులు జరిగినట్లు సమాచారం. ఇందులో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా-Aతో జరుగుతున్న మ్యాచ్లో ఇండియా-B బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మెరుపులు మెరిపిస్తున్నారు. ఆకాశ్ దీప్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్లో బౌండరీల వర్షం కురిపించారు. ఆ ఓవర్ తొలి బంతిని డిఫెండ్ చేసిన సర్ఫరాజ్ మిగిలిన 5 బంతుల్లో 5 బౌండరీలు బాదారు. దీంతో మొత్తం 20 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో సర్ఫరాజ్(32), పంత్(29) ఉన్నారు.
కశ్మీరీ వేర్పాటువాది అఫ్జల్ గురును ఉరి తీయడం వల్ల ఏదైనా ప్రయోజనం నెరవేరినట్టు తాను భావించడం లేదని JK మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్ ఇస్తూ కాంగ్రెస్ ఎప్పటికీ ఉగ్రవాదులతోనే ఉంటుందంటూ ఆరోపించింది. అఫ్జల్ను ఉరితీయడం వల్ల ఎలాంటి మంచి జరగలేదంటున్న ఇండియా కూటమి సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ప్రశ్నిస్తోందా అని నిలదీసింది.
AP: వరదలతో తలెత్తే ఆరోగ్య సమస్యలపై దృష్టి పెట్టామని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ఎల్లుండి నుంచి మూడు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తామని వెల్లడించారు. వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో లక్ష మెడికల్ కిట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. దోమ తెరలు కూడా సరఫరా చేస్తున్నామని, కలుషిత నీటితో వ్యాధులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఇది సోమవారానికి వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని IMD వెల్లడించింది. రేపు ఏలూరు, అల్లూరి, ఉ.గో, NTR జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, కృష్ణా జిల్లాల్లో భారీ వానలు పడతాయంది. పూర్తి జాబితా కోసం ఇక్కడ <
Sorry, no posts matched your criteria.