India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సంక్రాంతి రద్దీ దృష్ట్యా మరో 26 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. చర్లపల్లి-విశాఖ మధ్య ఈ నెల 11, 12, 13, 16, 17, 18 తేదీల్లో జన్సాధారణ్ రైలు(అన్నీ జనరల్ బోగీలు) నడుపుతున్నట్లు ప్రకటించింది. అలాగే విశాఖ-చర్లపల్లి మధ్య 10, 11, 12, 15, 16, 17 మధ్య కూడా ఇలాంటి రైళ్లే తిరగనున్నాయి. కేవలం స్టేషన్లో టికెట్ తీసుకుని ఈ రైళ్లు ఎక్కేయవచ్చు.

గంభీర్ స్వార్థపరుడంటూ KKR మాజీ ఆటగాడు మనోజ్ తివారీ చేసిన తీవ్ర వ్యాఖ్యలపై క్రికెటర్లు నితీశ్ రాణా, హర్షిత్ రాణా స్పందించారు. ఇద్దరూ తమ ఇన్స్టాలో గంభీర్కు మద్దతుగా పోస్ట్ చేశారు. ‘విమర్శలనేవి వ్యక్తిగత అభద్రత వల్ల కాక నిజానిజాల ఆధారంగా ఉండాలి. నేను కలిసినవారిలో అత్యంత నిస్వార్థపరుడు గౌతీ భయ్యా’ అని నితీశ్ పేర్కొనగా గంభీర్ ఆటగాళ్లకు అండగా నిలిచి వారిని వెలుగులోకి తెస్తారని హర్షిత్ పేర్కొన్నారు.

TG: సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 14న సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. 15న ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. 16న కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశమయ్యే అవకాశం ఉంది. 17న ఢిల్లీ నుంచి సింగపూర్ వెళ్లనున్న ఆయన రెండు రోజులు అక్కడ పర్యటిస్తారు. 19న సింగపూర్ నుంచి దావోస్కు వెళ్లి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు హాజరవుతారు. ఇదే పర్యటనలో ఆస్ట్రేలియాకు వెళ్లాల్సి ఉండగా రద్దయ్యింది.

TG: గ్రామస్థాయి ఉద్యోగులకు జీతాలు క్రమం తప్పకుండా చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రీన్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు జీతాలు చెల్లించాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలతో పాటు గ్రామస్థాయి ఉద్యోగులకు సైతం ఆలస్యం లేకుండా చెల్లించాలని స్పష్టం చేశారు. ఇటీవల గ్రామస్థాయి ఉద్యోగులకు జీతాలు ఆలస్యం అవుతున్న ఘటనల నేపథ్యంలో సీఎం తాజా ఆదేశాలు జారీ చేశారు.

AP: విక్టరీ వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ టికెట్ ధరలు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్సుల్లో టికెట్ ధర అదనంగా రూ.125 పెంచుకునేందుకు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అదనంగా రూ.100 పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. సినిమా రిలీజయ్యే ఈ నెల 14న 6 షోల నిర్వహణకు అనుమతిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 14 నుంచి 23 వరకు అదనపు ధరల వసూలుకు పర్మిషన్ ఇచ్చింది.

Q3లో TCS నికర లాభం 12% పెరిగి ₹12,380 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే Dec క్వార్టర్లో లాభం ₹11,058 కోట్లుగా ఉంది. తాజా ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఒక్కో షేరుకు ₹10 మధ్యంతర డివిడెండ్తోపాటు ₹66 స్పెషల్ డివిడెండ్ చెల్లించనున్నట్టు సంస్థ ప్రకటించింది. జనవరి 17ను రికార్డు డేట్గా ప్రకటించింది. ఫిబ్రవరి 3న డివిడెండ్ చెల్లించనుంది. ఫలితాల ప్రకటన నేపథ్యంలో గురువారం షేరు ధర 1.57% పతనమైంది.

మలయాళ దిగ్గజ గాయకుడు పి జయచంద్రన్(80) ఈరోజు కన్నుమూశారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబీకులు తెలిపారు. ఆరు దశాబ్దాలకు పైగా మలయాళ, తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో 16వేలకు పైగా పాటలు పాడారు. ఉత్తమ గాయకుడిగా జాతీయ పురస్కారం పొందిన జయచంద్రన్కు 5సార్లు కేరళ రాష్ట్ర పురస్కారం, తమిళనాడు నుంచి కలైమామణి అవార్డుతో పాటు నాలుగు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు లభించాయి.

అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు తప్పనిసరిగా ప్రధాన మంత్రి మన్ కీ బాత్ వినాలని గోవా ప్రభుత్వం ఆదేశించింది. ఈ కార్యక్రమంలో ప్రధాని లేవనెత్తే అంశాలు, సలహాల నుంచి స్ఫూర్తి పొందాలని సర్క్యులర్లో పేర్కొంది. ప్రభుత్వ పాలనను మెరుగుపరిచేందుకు వాటిలో ఉత్తమ విధానాలను అమలు చేయాలని సూచించింది. ప్రగతిశీల పాలనా పద్ధతులను అమలు చేయడంలో గోవా మార్గదర్శకమని సీఎం ప్రమోద్ సావంత్ అన్నారు.

శరద్ పవార్-అజిత్ పవార్ వర్గాలు తిరిగి ఏకమవుతాయన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఒకవైపు కేంద్ర మంత్రి పదవులు ఆశచూపి శరద్ వర్గం MPలను అజిత్ వర్గం ఆకర్షిస్తోందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇద్దరూ కలవాలని దేవుణ్ని ప్రార్థించినట్టు అజిత్ తల్లి ఆశాతాయి పేర్కొన్నారు. MPల ఫిరాయింపు, NDAలో చేరికను ఇరు వర్గాలు ఖండిస్తున్నాయి. అయితే కింది స్థాయి నేతలు బలంగా కోరుకుంటున్నారు.

అమెరికాలోని లాస్ ఏంజెలిస్లో కార్చిచ్చు వేలాది ఎకరాలను దహించివేస్తోంది. దావానలంలా వ్యాపిస్తున్న మంటల్లో గ్రామాలన్నీ బూడిదవుతున్నాయి. ఈ వైల్డ్ ఫైర్, పొగ ఏకంగా అంతరిక్షం నుంచి కూడా కనిపిస్తున్నాయంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ESA ప్రయోగించిన కోపర్నికస్ సెంటినెల్-2 శాటిలైట్ ఈ అగ్నికీలల ఫొటో తీసింది.
Sorry, no posts matched your criteria.