India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జీశాట్-ఎన్2 ప్రయోగాన్ని జులై రెండో వారంలో ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. 4,700 కేజీల బరువుండే ఈ ఉపగ్రహాన్ని స్పేస్ ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ ద్వారా స్పేస్లోకి పంపనున్నారు. దీని జీవితకాలం 14 ఏళ్లు. దేశ బ్రాడ్ బ్యాండ్ కమ్యూనికేషన్ అవసరాల కోసం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ దీనిని రూపొందించింది. అండమాన్ నికోబార్, లక్షద్వీప్ సహా భారత్ మొత్తానికి దీని సేవలు అందనున్నాయి.
వేసవి సెలవులు ముగిసినా తిరుమలకు భక్తులు పోటెత్తుతూనే ఉన్నారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన వారితో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. నందకం అతిథి గృహం వరకు భక్తులు క్యూలైన్లలో వేచిఉన్నారు. దీంతో టోకెన్లు లేని వారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. అటు నిన్న 82వేల మంది శ్రీనివాసుడిని దర్శించుకున్నారు.
J&Kలో ఉగ్రవాదుల వరుస దాడుల నేపథ్యంలో భద్రతపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ హైలెవెల్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఢిల్లీలో జరిగే ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, J&K లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే తదితరులు హాజరు కానున్నారు. ఈనెల 29 నుంచి ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్రకు సంబంధించిన భద్రతపైనా షా చర్చించనున్నారు.
TG: టెట్ పాసైన వారు DSCకి ఉచితంగా దరఖాస్తు చేసుకునే విధానాన్ని పాఠశాల విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం <
ఆ మధ్య పబ్జీ ప్రియుడి కోసం పాక్ నుంచి భారత్ వచ్చిన సీమా హైదర్ తరహాలోనే మరో ఘటన జరిగింది. USకు చెందిన బ్రూక్లిన్(30)కు, UPలోని ఇటావాకు చెందిన హిమాన్షుతో పబ్జీలో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. కొన్నాళ్ల క్రితం చండీగఢ్లో కలుసుకొని పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఆమెను ఇటావాకు తీసుకురాగా స్థానికుల సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంగీకారంతోనే అతడిని ఆమె పెళ్లి చేసుకున్నట్లు విచారణలో తేలింది.
AP: ఇప్పటివరకు కొండపి నియోజకవర్గానికి చెందిన ఆరుగురు మంత్రులయ్యారు. ఈ సెగ్మెంట్కు చెందిన చెంచురామానాయుడు, GV శేషు, దామచర్ల ఆంజనేయులు, బాలినేని శ్రీనివాసరెడ్డి, గంటా శ్రీనివాసరావు, DBV స్వామి అమాత్యులుగా పనిచేశారు. వీరిలో కొందరు కొండపి నుంచే గెలిచి మంత్రులయ్యారు. మరికొందరు ఇతర సెగ్మెంట్ల నుంచి గెలిచి అమాత్యులయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ ఈ సెగ్మెంట్ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.
అన్ని కాలవ్యవధుల రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ లెండింగ్ రేట్(MCLR)ను SBI 10 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇది నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. 1-3నెలల వడ్డీ రేటు 8.20% నుంచి 8.30%కి, 6 నెలల వడ్డీ రేటు 8.55% నుంచి 8.65%కి పెరిగింది. ఏడాదికి వడ్డీ రేటు 8.65% నుంచి 8.75%కి, రెండేళ్లకు 8.75% నుంచి 8.85%కి చేరింది. దీంతో ఏడాది MCLRకు అనుసంధానమై ఉన్న గృహ, వాహన రుణాలపై వడ్డీ భారం పెరగనుంది.
T20 WCలో పాకిస్థాన్ సూపర్-8కు అర్హత సాధించకపోవడంతో ఆ జట్టు మాజీ ప్లేయర్ అహ్మద్ షెహజాద్ మండిపడ్డారు. పాక్ జట్టులో ఐదుగురు ఆటగాళ్లను వెంటనే తప్పించాలని డిమాండ్ చేశారు. ‘నాలుగైదేళ్లుగా బాబర్, రిజ్వాన్, ఫకర్ జమాన్, షాహీన్ అఫ్రీది, హారీస్ రవూఫ్ రెగ్యులర్గా ఆడుతున్నారు. వీరంతా వ్యక్తిగత రికార్డులకు ప్రాధాన్యం ఇవ్వడం వల్లే పాక్ క్రికెట్ నాశనమైంది. వీరిని జట్టు నుంచి తప్పించాలి’ అని ఆయన పేర్కొన్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమరావతిలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్కు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వీరితోపాటు చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్ను కూడా ఆహ్వానిస్తున్నట్లు టాక్. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఈ నెల 27న విడుదల కానుంది.
నేటి నుంచి భారత మహిళల జట్టు SAతో స్వదేశంలో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఇవాళ బెంగళూరు వేదికగా హర్మన్ప్రీత్ కౌర్ సేన దక్షిణాఫ్రికాతో తలపడనుంది. మూడు మ్యాచులు ఇదే వేదికలో జరగనున్నాయి. మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా ఇటీవల బంగ్లాదేశ్ను టీ20ల్లో హర్మన్ సేన 5-0తో చిత్తు చేసిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.