India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంతో అక్కడి కంపెనీలను ఆకర్షించేందుకు ఏపీ ఐటీ మంత్రి లోకేశ్ సిద్ధమయ్యారు. NASSCOM చేసిన ట్వీట్కు స్పందిస్తూ వారిని ఏపీకి ఆహ్వానించారు. ‘వైజాగ్లోని మా IT, AI & డేటా సెంటర్ క్లస్టర్కి మీ కంపెనీలను మార్చుకునేందుకు స్వాగతిస్తున్నాం. మీకు అత్యుత్తమ సౌకర్యాలు, నిరంతర విద్యుత్, మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తుంది. మీకు స్వాగతం పలికేందుకు ఏపీ సిద్ధంగా ఉంది’ అని ట్వీట్ చేశారు.
తన ఆరోగ్యం నిలకడగా ఉందని నటుడు ఆర్.నారాయణమూర్తి తెలిపారు. ఆయన <<13647927>>అస్వస్థత<<>>కు గురయ్యారనే వార్తలతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ నారాయణమూర్తి ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నానని, దేవుడి దయతో కోలుకుంటున్నట్లు పేర్కొన్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తానన్నారు.
AP: విశాఖలోని ఎర్రమట్టి దిబ్బల్లో యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నాయని వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ Xలో ఆరోపించారు. ‘ప్రభుత్వ పెద్దల సహకారం, స్థానిక నేతల మద్దతుతో తవ్వకాలు జరుగుతున్నాయి. కూటమి పాలనలో విశాఖ భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పకనే చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 35రోజుల్లో ఎర్రమట్టి దిబ్బల పరిస్థితి ఇది’ అంటూ సెల్ఫీ ఫొటోను పోస్ట్ చేశారు. కాగా ప్రభుత్వం ఇప్పటికే దీనిపై <<13647350>>విచారణ<<>>కు ఆదేశించింది.
UP సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇవాళ గవర్నర్ను కలవనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్లో మార్పులు చేయనున్నట్లు సమాచారం. యూపీ BJPలో లుకలుకలున్నాయని కొన్నిరోజులుగా ప్రచారం సాగుతోంది. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్తో CMకు విభేదాలున్నాయనే ఊహాగానాలున్నాయి. దీంతో ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ‘ప్రభుత్వం కంటే పార్టీనే పెద్దది. పార్టీ కంటే ఎవరూ పెద్దవారు కాదు’ అని కేశవ్ వ్యాఖ్యానించారు.
చైనాలోని హెనాన్ ప్రావిన్సులో ఆసక్తికర ఘటన జరిగింది. డఫెంగ్యింగ్ అనే పట్టణంలో దాదాపు ఒక ఏడాదిలో కురిసే వర్షపాతం 24 గంటల్లో కురిసింది. ఏకంగా 606.7 మి.మీ వర్షపాతం నమోదు కావడంతో టౌన్ అంతా నీట మునిగింది. దీంతో అక్కడి ప్రజలు దిక్కుతోచని స్థితిలో వణికిపోతున్నారు. హెనాన్, షాండాంగ్, అన్హూయ్ ప్రావిన్సుల్లోనూ విస్తారంగా వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించడంతో కర్ణాటకలోని కంపెనీలు వేరే రాష్ట్రాలకు వెళ్లే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (<<13648455>>NASSCOM<<>>) ప్రభుత్వానికి సూచించింది. దీంతో హైదరాబాద్ అనుకూల ప్రాంతమని NASSCOMకు పలువురు నెట్టింట రిక్వెస్ట్ చేస్తున్నారు. కంపెనీలను ఆకర్షించేందుకు ఇదే మంచి అవకాశం అంటూ TG CMO, IT మంత్రికి ట్యాగ్ చేస్తున్నారు.
కర్ణాటక ప్రభుత్వం ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్లు కేటాయించడాన్ని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (Nasscom) తప్పుపట్టింది. ఈ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేసింది. గ్లోబల్ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి కనబరుస్తున్న వేళ ఈ చర్య సరికాదని పేర్కొంది. లోకల్ టాలెంట్కు కొరత ఉందని, ఈ నిర్ణయంతో సంస్థలను మరోచోటుకు తరలించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.
AP: ఈ నెల 22 నుంచి 28 వరకు అన్ని స్కూళ్లలో <<13648551>>’శిక్షా సప్తాహ్’<<>> నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది. ఇందులో విద్యార్థులు, టీచర్లు, తల్లులను భాగస్వామ్యం చేయాలంది. జాతీయ విద్యావిధానం సంస్కరణలు తెలియజేయడమే దీని ఉద్దేశమంది. 22న బోధన అభ్యసన సామగ్రిని టీచర్లు ప్రదర్శించాలని, 27న అమ్మలతో కలిసి విద్యార్థులతో 35 మొక్కలు నాటించాలని, 28న విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనాలు నిర్వహించాలని DEOలకు తెలిపింది.
జులై 22: స్థానిక వనరులతో బోధన సామగ్రి ప్రదర్శన
జులై 23: పునాది అభ్యసన, సంఖ్యాశాస్త్రం నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమం
జులై 24: క్రీడా పోటీలు నిర్వహించడం
జులై 25: సాంస్కృతిక కార్యక్రమాలు
జులై 26: సాంకేతిక నైపుణ్యాల దినోత్సవం
జులై 27: పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు
జులై 28: సామాజిక భాగస్వామ్య దినోత్సవం
TG: రైతులకు పంట రుణాలు మాఫీ చేసేందుకు రూపాయి రూపాయి పోగేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రూ.2లక్షలు ఒకేసారి మాఫీ చేసేందుకు నిద్రలేని రాత్రులు గడిపామని తెలిపారు. అన్ని రైతు కుటుంబాలకు ఆగస్టు ముగిసేలోపు కచ్చితంగా రుణమాఫీ చేస్తామని భట్టి స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.