News June 14, 2024

ధరణి పోర్టల్‌ను ప్రక్షాళన చేస్తున్నాం: పొంగులేటి

image

TS: ధరణి పోర్టల్‌ కారణంగా రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలు భూ సమస్యలతో సతమతమవుతున్నాయని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ‘గత ప్రభుత్వం ఎలాంటి అధ్యయనం లేకుండా పోర్టల్ తీసుకొచ్చింది. మా హామీ మేరకు ధరణి ప్రక్షాళన ప్రారంభించాం. దాని కారణంగా వచ్చిన సమస్యల్ని అధ్యయనం చేసేందుకు కమిటీ వేశాం. ధరణిని బలోపేతం చేసి, సామాన్యులకు సులువుగా అర్థమయ్యేలా మార్చనున్నాం’ అని స్పష్టం చేశారు.

News June 14, 2024

ప్రభాస్ ‘కల్కి’ మూవీ నుంచి UPDATE

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీ నుంచి రేపు ఫస్ట్ సింగిల్ ప్రొమో విడుదల కానుంది. ‘దేశంలోనే మోస్ట్ సెలబ్రేటెడ్ నటుడి కోసం మోస్ట్ సెలబ్రేటెడ్ సింగర్’ అంటూ పాటపై అంచనాలను పెంచేసింది. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్, రాజేంద్రప్రసాద్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 27న మూవీ విడుదల కానుంది.

News June 14, 2024

ఆడపిల్లలున్న తల్లులకు పోలీసుల విజ్ఞప్తి!

image

ఎంతో మంది చిన్నారులు లైంగిక దాడులను ఎదుర్కొంటున్నప్పటికీ ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోతుంటారు. ఈక్రమంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ తల్లులకు అవగాహన కల్పిస్తోంది. ప్రతి తల్లి తమ పిల్లల ప్రవర్తనను ఎల్లప్పుడూ గమనిస్తూ ఉండాలని సూచించింది. తమతో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించారని చెబితే అబద్ధం అనుకోకుండా నిజాలు తెలుసుకోవాలని కోరింది. బాధితులకు అండగా ఉంటామని, సమస్య ఉంటే డయల్ 100కి కాల్ చేయాలని సూచించింది.

News June 14, 2024

ఫ్లోరిడాలో వర్షం.. టాస్ ఆలస్యం

image

టీ20 వరల్డ్ కప్‌లో అమెరికా, ఐర్లాండ్ మ్యాచ్‌కు వరుణుడి అంతరాయం ఏర్పడింది. ఫ్లోరిడాలో భారీ వర్షం పడటంతో ఔట్ ఫీల్డ్ మొత్తం చిత్త‌డిగా మారింది. దీంతో టాస్ ఆలస్యమవుతోంది. ఒకవేళ వర్షంతో ఈ మ్యాచ్ రద్దయితే ఇరుజ‌ట్ల‌కు చెరొక పాయింట్ ఇస్తారు. అప్పుడు 5 పాయింట్లతో అమెరికా సూప‌ర్-8కు వెళ్తుంది. త‌ర్వాతి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై పాకిస్థాన్ గెలిచినా నాలుగు పాయింట్లతో ఆ జట్టు ఇంటి బాట పడుతుంది.

News June 14, 2024

సూపర్-8 చేరే మరో 3 జట్లేవి?

image

టీ20 వరల్డ్ కప్‌లో ఇప్పటికే 5జట్లు సూపర్-8కు చేరాయి. గ్రూప్ A నుంచి ఇండియా, గ్రూప్ B నుంచి ఆస్ట్రేలియా, గ్రూప్ C నుంచి అఫ్ఘానిస్థాన్, వెస్టిండీస్, గ్రూప్ D నుంచి సౌతాఫ్రికా బెర్తులు ఖరారు చేసుకున్నాయి. ఖాళీగా ఉన్న 3 స్థానాల కోసం USA, పాకిస్థాన్, స్కాట్లాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ పోటీ పడుతున్నాయి. కెనడా, ఐర్లాండ్ పోటీలో ఉన్నా నెగటివ్ రన్‌రేట్ వల్ల అవి సూపర్8 చేరేది దాదాపు అసాధ్యమే.

News June 14, 2024

మీ ట్రోలింగ్‌కి థాంక్స్: దర్శన్ కుమారుడు

image

కన్నడ నటుడు దర్శన్‌పై వస్తున్న విమర్శల పట్ల ఆయన కుమారుడు వినీశ్ దర్శన్ ఇన్‌స్టాలో స్పందించారు. ‘నేను 15 ఏళ్ల పిల్లాడినని మరచిపోయి మరీ మా నాన్నపై తప్పుడు కామెంట్స్ పెడుతున్నవారందరికీ థాంక్స్. ఇలాంటి కష్టకాలంలో మా అమ్మనాన్నలకు మద్దతు కావాలి. నన్ను ద్వేషించడం వలన ఏమీ మారదు’ అని పేర్కొన్నారు. అభిమానిని చంపిన కేసులో దర్శన్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

News June 14, 2024

కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరవాలి: హరీశ్ రావు

image

TG: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు నీటి మూటలను తలపిస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ‘ప్రభుత్వం ఏర్పాటై 191 రోజులు గడిచినా హామీల అమలు కాలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే AP సీఎం అన్ని రకాల పింఛన్లు పెంచారు. ఒడిశాలో వరి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.3100 చేశారు. ఇక్కడి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి. 6 గ్యారంటీలు, 13 హామీలను వెంటనే అమలు చేయాలి’ అని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు.

News June 14, 2024

ఏపీలో రేపు పిడుగులతో కూడిన వర్షాలు

image

AP: ద్రోణి ప్రభావంతో శనివారం రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

News June 14, 2024

పోలీసులు పద్ధతి మార్చుకోవాలి: అనిత

image

AP: పోలీస్ వ్యవస్థలో మార్పు తీసుకొస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ‘కొంతమంది పోలీసులు పద్ధతి మార్చుకోవాలి. లేదంటే మేమే మారుస్తాం. మాచర్లలో చంద్రయ్య వంటి హత్య కేసులను రీఓపెన్ చేస్తాం. TDP కార్యకర్తలు, నేతలు గత ఐదేళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్రమ కేసులపై సమీక్ష జరుగుతుంది. నాకు కీలకమైన హోంశాఖ అప్పగించిన చంద్రబాబు, పవన్, లోకేశ్‌, NDA నేతలకు కృతజ్ఞతలు’ అని ఆమె వెల్లడించారు.

News June 14, 2024

బడ్జెట్‌లో ఫేమ్-3పై ప్రకటన?

image

FAME-3 స్కీమ్ అమలుపై త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో కేంద్రం ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్కీమ్‌కు రూ.10వేల కోట్లు కేటాయించొచ్చనేది విశ్లేషకుల అంచనా. ఈవీలను ప్రోత్సహించేందుకు గతంలో తెచ్చిన ఈ స్కీమ్‌ను మరోసారి అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. 2015లో రూ.5,172కోట్లతో ఫేమ్ స్కీమ్ లాంచ్ చేయగా, 2019లో FAME-2 కోసం రూ.10వేల కోట్లు కేటాయించింది. ఈ ఏడాది మార్చి 31 వరకు ఫేమ్-2 కొనసాగింది.