India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రపంచంలో ఏడు వింతల్లో ఒకటైన తాజ్మహల్ను వీక్షించేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య తగ్గినట్లు యూపీ పర్యాటకశాఖ తెలిపింది. ఉత్తర్ప్రదేశ్లో అత్యధికంగా ఆగ్రాలోని తాజ్మహల్కు పర్యాటకులకు వచ్చేవారని, ఈ స్థానంలో అయోధ్య రామాలయం చేరిందని పేర్కొంది. 2024 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు అయోధ్యకు 13.55 కోట్ల మంది వస్తే, తాజ్మహల్ చూసేందుకు 12.51 కోట్ల మంది పర్యాటకులు వచ్చారు.

APలో డీప్-టెక్ను అభివృద్ధి చేసేందుకు రెండు ప్రధాన సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకున్నామని మంత్రి లోకేశ్ తెలిపారు. ఫిజిక్స్ వాలా (PW) ఎడ్యుటెక్ కంపెనీ తన భాగస్వామి అమెజాన్ వెబ్తో కలిసి AI-ఫోకస్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ యూనివర్సిటీ ఆఫ్ ఇన్నొవేషన్ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందని చెప్పారు. ఉన్నత విద్యను ఆధునీకరించేందుకు టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్తో మరో ఒప్పందం కుదిరిందని వెల్లడించారు.

పాకిస్థాన్తో సంబంధాల బలోపేతానికి అంగీకరించినట్టు బంగ్లా ప్రభుత్వ చీఫ్ మహ్మద్ యూనస్ వ్యాఖ్యానించారు. ఈజిప్ట్లో జరిగిన ఓ కాన్ఫరెన్స్ సందర్భంగా పాక్ PM షెహబాజ్ షరీఫ్ను యూనస్ కలిశారు. 1971 యుద్ధ తరువాత ఇస్లామాబాద్తో అపరిష్కృతంగా ఉన్న అంశాలను పరిష్కరించుకోవాలని యూనస్ కోరుకున్నారు. ద్వైపాక్షిక బంధాల మెరుగుకు ఇరు దేశాలు సంయుక్తంగా కట్టుబడి ఉన్నాయని షరీఫ్ కూడా పేర్కొన్నారు.

గూగుల్ ఉద్యోగుల మెడపై మరోసారి లేఆఫ్స్ కత్తి వేలాడుతోంది. 10 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తామని ఆ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్లు, మేనేజ్మెంట్లో ఉన్నవారినీ తొలగిస్తామని చెప్పారు. వీరిలో కొందరిని వేరే బాధ్యతల్లోకి, మరికొందరిని పూర్తిగా తీసేయనున్నట్లు తెలుస్తోంది. ఓపెన్ ఏఐ వంటి సంస్థల నుంచి పోటీ నెలకొనడంతో గూగుల్తోపాటు మరికొన్ని కంపెనీలు లే ఆఫ్స్ బాటపడుతున్నాయి.

క్రికెట్లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ పురస్కారం సాధారణంగా బ్యాటింగ్ లేదా బౌలింగ్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాడికి ఇస్తారు. కానీ వెస్టిండీస్ మాజీ క్రికెటర్ గస్ లోగీ ఆ రెండూ చేయకుండా ఫీల్డింగ్తో ఆ అవార్డు దక్కించుకున్న తొలి ఆటగాడిగా నిలిచారు. 1986లో పాక్తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో 3 అద్భుత క్యాచ్లు పట్టి 2 రనౌట్లు చేయడంతో ఆయనకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ లభించింది.

అనన్య నాగళ్ల, యువచంద్ర కృష్ణ మెయిన్ రోల్స్లో నటించిన ‘పొట్టేల్’ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. తెలంగాణ గ్రామీణం బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమాకు సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించారు. అక్టోబర్ 25న పొట్టేల్ థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే.

TG: ఫార్ములా- ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ను ఏసీబీ ఇవాళో, రేపో అరెస్ట్ చేస్తుందని జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఆయనను 10 రోజులపాటు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు చెప్పింది. అదే సమయంలో విచారణ కొనసాగించొచ్చని పేర్కొంది. దీంతో ఏసీబీ కేటీఆర్కు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఈ-కార్ రేసులో నిధుల దుర్వినియోగంపై ప్రశ్నల వర్షం కురిపించవచ్చు.

8వ వేతన సంఘం ఏర్పాటుపై కేంద్రం స్పష్టత ఇవ్వడం లేదు. అయితే, వేతన సవరణ విధానాన్ని మార్చాలని యోచిస్తున్నట్టు Financial Express నివేదిక తెలిపింది. ఉద్యోగుల పనితీరు ఆధారంగా లేదా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వివిధ స్థాయుల్లో వేతన సవరణ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు వివరించింది. 7వ వేతన సంఘం గడువు ముగుస్తుండడంతో తదుపరి కేంద్ర చర్యలపై ఉత్కంఠ నెలకొంది.

టీమ్ ఇండియా క్రికెటర్ పృథ్వీషాకు శత్రువులెవరూ లేరని, తనకు తానే శత్రువని ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) విమర్శించింది. ఫిట్నెస్, క్రమశిక్షణ, ఆటిట్యూడ్లో సమస్యలే ఇందుకు కారణమని తెలిపింది. ‘SMATలో పృథ్వీ షా జట్టులో ఉన్నా లేనట్లే. ఫీల్డింగ్లో దగ్గరికి వచ్చిన బంతిని కూడా ఆయన అందుకోలేకపోయారు. బ్యాటింగ్లోనూ ఏమాత్రం రాణించలేదు. జట్టులోని సీనియర్ ఆటగాళ్లు కూడా అతడిపై ఫిర్యాదు చేశారు’ అని పేర్కొంది.

భారత్లో అల్లంత ఎత్తునుంచి జారిపడే జలపాతాలకు కొదవే లేదు. వాటిలో అనేక వందల మీటర్ల ఎత్తున్నవి కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని.. కుంచికల్ ఫాల్స్(కర్ణాటక- 455 మీటర్లు), బరేహీపానీ ఫాల్స్(ఒడిశా-399 మీటర్లు), నోహ్కలీకాయ్ ఫాల్స్(మేఘాలయ-340 మీటర్లు), నోహ్సంగిథియాంగ్ ఫాల్స్(మేఘాలయ-315 మీటర్లు), దూద్సాగర్ ఫాల్స్(గోవా-కర్ణాటక బోర్డర్, 310 మీటర్లు), మీన్ముట్టి ఫాల్స్(కేరళ-300 మీటర్లు).
Sorry, no posts matched your criteria.