India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తిరుమల లడ్డూ విషయంలో TTD ఇటీవల పలు మార్పులు చేసింది. దీంతో కొందరు భక్తుల్లో అయోమయం నెలకొంది. దర్శనం చేసుకున్న వారు టోకెన్ చూపిస్తే 2 లడ్డూలు ఇస్తారు. ఇంకా కావాలంటే ఒక్కో లడ్డూకి రూ.50 చొప్పున చెల్లించి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. దర్శనం చేసుకోని వారికి లడ్డూ కావాలంటే కచ్చితంగా ఆధార్ చూపించాలి. కార్డుపై 2 లడ్డూలే ఇస్తారు. దర్శనం చేసుకోకుండా ఆధార్ కార్డు లేకుండా ఉంటే లడ్డూలు ఇవ్వరు.
భారత్లో 20కోట్లకు పైగా ప్రజలకు ఎటువంటి శారీరక శ్రమ లేదని ‘State of Sports and Physical Activity in India’ అనే అధ్యయనం తేల్చిచెప్పింది. 10శాతంమంది మాత్రమే క్రీడలు ఆడుతున్నారని పేర్కొంది. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలను 20కోట్లకు పైగా ప్రజలు అందుకోవడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే 2047 నాటికి దేశ ఆరోగ్య వ్యవస్థలపై ఏటా రూ.55 ట్రిలియన్ భారం పడే ప్రమాదం ఉంది’ అని ఆందోళన వ్యక్తం చేసింది.
AP: వైసీపీ రెండు జిల్లాలకు అధ్యక్షులతో పాటు కీలక విభాగాలకు నియామకాలు చేపట్టింది. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా(లీగల్ వ్యవహారాలు) మాజీ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా వేణుగోపాల్ కృష్ణమూర్తి, పార్టీ నిర్మాణ సలహాదారుగా ఆళ్ల మోహన్ సాయిదత్, కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎస్వీ మోహన్ రెడ్డి, నంద్యాలకు రాంభూపాల్ రెడ్డిని నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది.
తమిళ సినీ పరిశ్రమలో మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడేవారిపై ఐదేళ్ల నిషేధం విధించాలని నడిగర్ సంఘం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మాలీవుడ్లో లైంగిక వేధింపుల విషయంలో హేమ కమిటీ రిపోర్టు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో సంఘం తాజాగా భేటీ అయింది. ఫిర్యాదు రాగానే పూర్తి దర్యాప్తు చేపట్టి, నిజమని తేలితే నేరస్థులపై నిషేధం విధించాలని ఈ సమావేశంలో ప్రతిపాదించినట్లు సభ్యులు తెలిపారు.
TG: జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి కోరారు. ప్రస్తుతం ఎన్నికల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతోందని, OCT 29న ముసాయిదా జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. NOV 28 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని, జనవరి 6న ఫైనల్ లిస్ట్ విడుదల చేస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,33,27,304 మంది ఓటర్లున్నారని చెప్పారు.
తేది: సెప్టెంబర్ 06, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున 4:50 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:03 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:14 గంటలకు
అసర్: సాయంత్రం 4:39 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:25 గంటలకు
ఇష: రాత్రి 7.38 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
AP: వరద బాధితులకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రూ.కోటి సాయం ప్రకటించారు. అలాగే ఎస్బీఐ అమరావతి సర్కిల్ రూ.5.87 కోట్లు, దేవీ సీ ఫుడ్స్ రూ.కోటి, కృష్ణా డెయిరీ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు రూ.50 లక్షల సాయం అందించారు.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
FY24లో భారత్లో అత్యధిక పన్ను చెల్లించిన మహిళా సినీ సెలబ్రిటీల జాబితాలో బాలీవుడ్ నటి కరీనా కపూర్ అగ్రస్థానంలో నిలిచారు. ఆమె రూ.20 కోట్ల పన్ను కట్టగా ఆ తర్వాతి స్థానాల్లో కియారా అద్వానీ(రూ.12 కోట్లు), కత్రినా కైఫ్(రూ.11 కోట్లు) ఉన్నారు. మొత్తంగా సెలబ్రిటీల జాబితాలో షారుఖ్ రూ.92 కోట్ల పన్ను కట్టి అగ్రస్థానంలో నిలిచారు. విజయ్(రూ.80 కోట్లు), సల్మాన్ (రూ.75 కోట్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
1766: పరమాణు సిద్ధాంతానికి పునాదులు వేసిన బ్రిటిష్ శాస్త్రవేత్త జాన్ డాల్టన్ జననం
1936: తెలుగు కవి అద్దేపల్లి రామమోహన రావు జననం
1949: బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు రాకేశ్ రోషన్ జననం
1950: సుప్రసిద్ధ అవధాని గండ్లూరి దత్తాత్రేయశర్మ జననం
2012: రచయిత, దర్శకుడు చెరుకూరి సుమన్ మరణం
Sorry, no posts matched your criteria.