News September 6, 2024

EV సంస్థలకు స‌బ్సిడీ అవసరం లేదు: గడ్కరీ

image

వినియోగదారులు ఇప్పుడు సొంతంగా EV లేదా CNG వాహనాలను ఎంచుకుంటున్న నేప‌థ్యంలో EV త‌యారీదారుల‌కు ఇక స‌బ్సిడీ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని భావిస్తున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. డీజిట్‌, పెట్రోల్ వాహ‌నాల‌ కంటే ఈవీల‌పై జీఎస్టీ త‌క్కువ‌న్నారు. రాయితీ అడ‌గ‌డం ఇక ఎంత‌మాత్ర‌మూ స‌మ‌ర్థ‌నీయ‌ం కాద‌ని పేర్కొన్నారు. హైబ్రిడ్‌, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ వాహనాలపై 28%, EVలపై 5% GST ఉందన్నారు.

News September 6, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News September 6, 2024

శుభ ముహూర్తం

image

తేది: సెప్టెంబర్ 06, శుక్రవారం
తదియ: మ.3.01 గంటలకు
హస్త: ఉ.9.25 గంటలకు
వర్జ్యం: సా.6.28-సా.8.16 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉ.8.23-ఉ.9.13 గంటల వరకు
(2) మ.12.30-మ.1.19 గంటల వరకు
రాహుకాలం: ఉ.10.30-మ.12.00 గంటల వరకు

News September 6, 2024

TODAY HEADLINES

image

* భారత్, సింగపూర్ మధ్య 4 ఒప్పందాలు
* AP: చంద్రబాబుకు తప్పిన ప్రమాదం
* TG: ప్రభుత్వ స్కూళ్లకు ఉచిత విద్యుత్: సీఎం రేవంత్
* TG: ప్రజాపాలన అంటే ప్రశ్నించే గొంతులు నొక్కడమా?: కేటీఆర్
* కేంద్రం సాయం త్వరగా అందేలా చూస్తా: శివరాజ్ సింగ్ చౌహాన్
* AP: వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్
* AP: టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. సస్పెన్షన్

News September 6, 2024

సెబీ చీఫ్‌పై ఉద్యోగుల ఫైర్

image

ఇన్ని రోజులూ విప‌క్షాల నుంచి రాజీనామా డిమాండ్ల‌ను ఎదుర్కొన్న సెబీ చీఫ్ మాధ‌బికి తాజాగా స‌హ‌చ‌ర ఉద్యోగుల నుంచి వ్యతిరేక వ్యక్తమవుతోంది. ప‌ని ఒత్తిడి, ప్ర‌తికూల ఆఫీసు ప‌రిస్థితుల‌పై మార్కెట్ల నియంత్ర‌ణ సంస్థ ఉద్యోగులు ఆర్థిక శాఖ‌కు లేఖ రాశారు. అయితే ఈ ఆరోపణలను కొట్టిపారేస్తూ సెబీ స్టేట్‌మెంట్ ఇచ్చింది. దీంతో మ‌రింత ఆగ్రహించిన ఉద్యోగులు మాధ‌బి రాజీనామాకు డిమాండ్ చేస్తూ గురువారం ఆందోళనకు దిగారు.

News September 5, 2024

వెంటిలేట‌ర్‌పై సీతారాం ఏచూరి

image

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి వెంటిలేట‌ర్‌పై చికిత్స అందిస్తున్న‌ట్టు ఢిల్లీ ఎయిమ్స్ వ‌ర్గాలు తెలిపాయి. ఇటీవ‌ల న్యూమోనియాతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌ ఆగస్టు 19న ఎయిమ్స్‌లో ఎమర్జెన్సీ వార్డులో చేరారు. ఆ తర్వాత ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.

News September 5, 2024

మనోళ్లు అందుకే స్పిన్‌కి ఔట్ అవుతున్నారు: సెహ్వాగ్

image

గతంతో పోలిస్తే ప్రస్తుత భారత జట్టు తరచూ ప్రత్యర్థుల స్పిన్‌ ఉచ్చులో చిక్కుకుని విలవిల్లాడుతోంది. దీనికి కారణాన్ని సెహ్వాగ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘మేం ఎంత బిజీగా ఉన్నా దేశవాళీ టోర్నీలు మిస్ అయ్యేవాళ్లం కాదు. నేడు డొమెస్టిక్ మ్యాచుల్లో అంతర్జాతీయ క్రికెటర్లు పెద్దగా ఆడట్లేదు. టీ20ల కారణంగా నాణ్యమైన స్పిన్నర్లూ కరవయ్యారు. దాంతో భారత బ్యాటర్లకు సరైన స్పిన్ ప్రాక్టీస్ ఉండట్లేదు’ అని వివరించారు.

News September 5, 2024

రాష్ట్రానికి భారీ నష్టం.. ఆదుకోవాలి: చంద్రబాబు

image

AP: భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సీఎం చంద్రబాబు వివరించారు. 1.81లక్షల హెక్టార్లలో వ్యవసాయ పంట మునిగి రూ.1056 కోట్ల నష్టం జరిగిందన్నారు. 18,453 హెక్టార్లలో ఉద్యాన పంటలు, 3756 కి.మీ మేర రోడ్లు దెబ్బతిన్నట్లు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని పెద్ద మనసుతో ఆదుకుని నష్టనివారణ చేపట్టాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

News September 5, 2024

చరిత్ర సృష్టించిన కపిల్ పార్మర్

image

పారిస్ పారాలింపిక్స్‌లో భారత జూడోకా(జూడో ప్లేయర్) కపిల్ పార్మర్ రికార్డు సృష్టించారు. జూడోలో మెడల్ సాధించిన మొదటి భారత జూడోకాగా నిలిచారు. పారిస్ పారాలింపిక్స్‌లో పురుషుల 60 కేజీల J1 ఈవెంట్‌లో వరల్డ్ నంబర్ 2 జూడోకా ఎలియెల్టన్ డి ఒలివెరాను ఓడించారు. ఫలితంగా బ్రాంజ్ మెడల్ సాధించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా పార్మర్‌ను అభినందించారు.

News September 5, 2024

తెలుగు రాష్ట్రాలకు తప్పిన వాయుగుండం ముప్పు

image

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రెండు మూడు రోజుల్లో వాయుగుండంగా మారనుందని, అది ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాలకు పయనించనుందని IMD తెలిపింది. దీంతో తెలుగు రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు తప్పిందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈ నెల 8 వరకు ఇరు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇప్పటికే భారీ వరదలతో AP, TG గజగజ వణికాయి. మళ్లీ వర్షాలు కురియనుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.