India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారత సంతతికి చెందిన ఐర్లాండ్ క్రికెటర్ సిమీ సింగ్ ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాలేయం పూర్తిగా దెబ్బతినడంతో గురుగ్రామ్లోని ఓ ఆస్పత్రిలో ఆయనకు వైద్యులు సర్జరీ చేశారు. సిమీ భార్య అగమ్దీప్ కౌర్ తన కాలేయంలోని కొంత భాగం దానం చేశారు. సిమీ సింగ్ ఐర్లాండ్ తరఫున 35 వన్డేలు, 53 టీ20లు ఆడారు. రెండు ఫార్మాట్లలో కలిపి 83 వికెట్లు పడగొట్టారు. 2021లో సౌతాఫ్రికాపై సెంచరీ కూడా బాదారు.
TG: కొమురంభీం(D) జైనూర్కు సంబంధించి సోషల్ మీడియాలో రెచ్చగొట్టే తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని రాష్ట్ర పోలీస్ విభాగం హెచ్చరించింది. ‘జైనూర్లో ప్రస్తుతం ప్రశాంతమైన వాతావరణం నెలకొని ఉంది. ఆ ప్రాంతంలో ప్రశాంతతను నెలకొల్పేందుకు, స్థానికుల్లో మనోధైర్యం కలిగించేందుకు పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది’ అని పేర్కొంది. జైనూర్లో ఆదివాసీ మహిళపై అత్యాచార <<14025482>>ఘటన<<>> ఉద్రిక్తతలకు దారి తీసింది.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన BJPలో అసంతృప్తి రగిల్చింది. జాబితాలో మంత్రి రంజిత్ సింగ్కు చోటు దక్కకపోవడంతో ఆయన పదవికి రాజీనామా చేశారు. రానియా స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. అలాగే ప్రముఖ వ్యాపారవేత్త-కురుక్షేత్ర MP నవీన్ జిందాల్ తల్లి సావిత్రీ జిందాల్ హిసార్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు తెలిపారు.
AP: విజయవాడ వరదల్లో సీఎం చంద్రబాబు యంత్రాంగం అద్భుతంగా పనిచేసిందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివ్రాజ్ సింగ్ చౌహాన్ కొనియాడారు. విజయవాడ కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రికార్డు స్థాయిలో వర్షం పడటంతో బుడమేరులో 35వేల క్యూసెక్కులకు పైగా వరద పోటెత్తింది. బుడమేరు వరదకు ఇల్లీగల్ మైనింగే కారణం. రాష్ట్రానికి కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉండి ఆదుకుంటుంది’ అని హామీ ఇచ్చారు.
TG: విద్యకు తమ ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపీట వేసిందని డిప్యూటీ CM భట్టి విక్రమార్క వెల్లడించారు. రవీంద్రభారతిలో గురుపూజోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘పదేళ్లు DSC లేదు. మేం అధికారంలోకి రాగానే 11,062 టీచర్ పోస్టులకు డీఎస్సీ ఇచ్చాం. త్వరలోనే మరో 6వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్లలో వసతుల కల్పనను డ్వాక్రా మహిళలకు ఇస్తాం’ అని భట్టి చెప్పారు.
ఏళ్ల క్రితం నిర్మించిన మౌలిక సదుపాయాలు సైబర్ దాడులకు గురవుతున్నప్పుడు భద్రతా సాధనాల వ్యవస్థను తీసుకురావడం అత్యవసరమని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వ్యాఖ్యానించారు. టెక్నాలజీ వృద్ధితో ముప్పు కూడా విస్తరిస్తోందన్నారు. సైబర్ నేరాల ముప్పు కేవలం వ్యక్తిగత డేటా దొంగతనానికి మాత్రమే పరిమితం కాదని, అది ఇప్పుడు అంతకు మించిన స్థాయికి చేరిందన్నారు. దేశ భద్రతకు సంబంధించిన అంశంగా పరిణమించిందన్నారు.
AP: విజయవాడలో వరదతో ముంపుకు గురైన ప్రాంతాలను కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పరిశీలించారు. వరదలో మునిగిన పొలాలు, దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజ్ గేట్లు, సింగ్ నగర్, పాల ఫ్యాక్టరీ, కండ్రిక ప్రాంతాలను NDRF బోటుపై తిప్పి, మోకాలిలోతు నీటిలో కేంద్రమంత్రిని నడిపించి స్వయంగా లోకేశ్ వరద పరిస్థితి తెలియజేశారు. ఈ వరదతో తీవ్రంగా నష్టపోయామని, పెద్దమనసుతో సాయం అందించి ఆదుకోవాలని కేంద్రమంత్రికి ఆయన విన్నవించారు.
AP: వరద బాధితుల సహాయార్థం విరాళాలందించిన సినీనటులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం ట్విటర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపింది. మహేశ్ బాబు, ప్రభాస్, జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, నందమూరి బాలకృష్ణ, సిద్ధు జొన్నలగడ్డ, సాయి తేజ్, వరుణ్ తేజ్ను ఉప ముఖ్యమంత్రి అభినందిస్తున్నారని ట్వీట్ చేసింది. కష్టకాలంలో ప్రజలకు అండగా, సహాయం చేసిన వారి ఔదార్యం మరెంతోమందికి భరోసా కల్పిస్తుందని పేర్కొంది.
రెండు కిడ్నీలు చెడిపోయి నడవలేని దయనీయ స్థితిలో ఉన్న టాలీవుడ్ నటుడు <<14016546>>ఫిష్ వెంకట్ను<<>> నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఆదుకున్నారు. ఆయన దీన స్థితిని తెలుసుకుని రూ.లక్ష సాయాన్ని అందించారు. ఇతర సినీ ప్రముఖులు కూడా ఫిష్ వెంకట్ను ఆదుకోవాలని కోరారు. అటు తనకు సాయం చేసిన నిర్మాతకు వెంకట్ ధన్యవాదాలు చెప్పారు. ఆయన సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనన్నారు.
స్వచ్ఛ భారత్ మిషన్ కింద పెద్ద ఎత్తున మరుగుదొడ్ల నిర్మాణం వల్ల దేశంలో 60-70 వేల శిశు మరణాలు తగ్గినట్టు ఒక అధ్యయనం అంచనా వేసింది. USలోని ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకుల బృందం దేశంలో 20 ఏళ్ల డేటాను అధ్యయనం చేసింది. టాయిలెట్ వినియోగం 10% పాయింట్ల మేర మెరుగు వల్ల శిశు మరణాల రేటు 0.9 పాయింట్లు, 5 ఏళ్లలోపు వారిలో 1.1 పాయింట్లు తగ్గిందని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.