News December 20, 2024

భారత్‌లో పారా అథ్లెటిక్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్

image

పారా అథ్లెటిక్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్-2025 ఢిల్లీలోని నెహ్రూ స్టేడియంలో జరగనున్నాయి. ఈ ఈవెంట్‌ను భారత్ నిర్వహించడం ఇదే తొలిసారి. SEP 26 నుంచి OCT 5 వరకు జరిగే ఈ ఈవెంట్‌లో 100 దేశాల నుంచి 1000 మంది అథ్లెట్లు పాల్గొంటారు. 2036 ఒలింపిక్స్ నిర్వహణ ప్రతిపాదనను ఇది బలపరుస్తుందని NPC ఇండియా అభిప్రాయపడింది. మార్చి 11-13 వరకు వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్‌కు కూడా ఢిల్లీ ఆతిథ్యమివ్వనుంది.

Similar News

News November 16, 2025

సోషల్ మీడియాలో వేధింపులా..

image

టెక్నాలజీ లైఫ్‌ని ఎంత ఈజీ చేసిందో.. దాంతో పాటు కొన్ని సమస్యలు కూడా తెచ్చింది. వాటిల్లో ఒకటి ఆన్ లైన్ వేధింపులు. వీటిని తగ్గించాలంటే..సోషల్‌మీడియా ఖాతాలకు సంబంధించి ప్రైవసీ సెట్టింగ్స్‌ మార్చుకోవాలి. అనుమానాస్పద ఖాతాలు కనిపిస్తే వాటిని వెంటనే బ్లాక్‌ చేసి.. రిపోర్టు చేయాలి. సోషల్‌మీడియా ఖాతాల ఐడీ, పాస్‌వర్డ్స్‌ ఎవరితోనూ పంచుకోవద్దు. ఎవరైనా వేధింపులకు దిగితే.. సందేశాలను స్క్రీన్‌షాట్స్‌ తీసుకోండి.

News November 16, 2025

పశువులకు మేతగా ఉల్లిపాయలతో డేంజర్

image

ఉల్లికి సరైన ధర లేకపోతే కొందరు రైతులు ఆ పొలాలను గొర్రెలు, మేకలు, పశువులకు మేతగా వదిలేస్తున్నారు. కానీ ఇలా చేయడం ప్రమాదకరమని వెటర్నరీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉల్లిపాయల్లో ఉండే N-propyl disulfide అనే రసాయనం పశువుల్లోని ఎర్రరక్తకణాలను విడదీస్తుందని తెలిపారు. దీనివల్ల వాటిలో బలహీనత, కళ్లు, మూత్రం ఎర్రగా మారడం, శ్వాసలో వేగం పెరగడం, కడుపులో వాపు, లక్షణాలు తీవ్రమైతే అవి మరణించే అవకాశం ఉందంటున్నారు.

News November 16, 2025

పశువులకు ‘ఉల్లి’తో సమస్య.. చికిత్స ఇలా

image

ఒక రోజులో పశువు తినే మొత్తం మేతలో 5 నుంచి 10 శాతానికి మించి ఉల్లిపాయలు ఉండకూడదని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. అది కూడా వారంలో 2-3 రోజులు మాత్రమే ఇవ్వాలన్నారు. ‘ఈ పరిమితి మించితే పశువుల కళ్లు, మూత్రం ఎర్రగా మారిపోతాయి. ఆహారం తీసుకోవు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వెటర్నరీ వైద్యుల సూచనతో విటమిన్ ఇ, సెలీనియం, ఫాస్ఫరస్ ఇంజెక్షన్లు, లివర్ టానిక్‌లు, చార్కోల్ లిక్విడ్ లాంటివి అందించాలి.