India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ జరిగిన బార్బడోస్ను మరో 6 గంటల్లో బెరిల్ హరికేన్(తుఫాన్) తాకనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ తరహా వాతావరణం నెలకొందని జాతీయ మీడియా ప్రతినిధులు తెలిపారు. వర్షం మొదలైందని, ఎయిర్ పోర్టు మూసివేయడంతో భారత జట్టు ఆటగాళ్లు హోటల్స్కే పరిమితమయ్యారని పేర్కొన్నారు. దీంతో మరో 24 గంటల వరకు అక్కడే ఉంటారని తెలుస్తోంది.
TG: విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. 0-10 మంది విద్యార్థులున్న స్కూళ్లకు ఒకరు, 11 నుంచి 40 వరకు విద్యార్థులున్న స్కూళ్లకు ఇద్దరు, 41 నుంచి 60 మంది విద్యార్థులున్న స్కూళ్లకు ముగ్గురు, 61కి పైగా విద్యార్థులున్న స్కూళ్లకు గతంలో మాదిరిగానే టీచర్లను కేటాయించనుంది. స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగితే అందుకనుగుణంగా కేటాయింపు చేపట్టనుంది.
TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. విద్యుత్ కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నిబంధనల మేరకే కమిషన్ వ్యవహరిస్తోందని, కేసీఆర్ పిటిషన్కు విచారణార్హత లేదన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
టీ20 వరల్డ్ కప్ను టీమ్ఇండియా గెలుపొందడంపై విరాట్ కోహ్లీ చేసిన ఇన్స్టా పోస్ట్ రికార్డు సృష్టించింది. కప్తో, టీమ్తో ఉన్న ఫొటోలతో ‘ఇంతకంటే మంచి రోజు వస్తుందని కలలో కూడా ఊహించలేదు’ అని పోస్ట్ చేశారు. ఈ పోస్టుకు ఇప్పటివరకు 18 మిలియన్ల లైక్స్తో పాటు 6.6 లక్షల కామెంట్స్ వచ్చాయి. గతంలో కియారా, సిద్ధార్థ్ పేరిట ఉన్న రికార్డును సైతం బ్రేక్ చేసింది. WC ఫైనల్లో కోహ్లీ 76 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
‘పరమవీర చక్ర’ అవార్డు గ్రహీత వీర్ అబ్దుల్ హమీద్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. ఆయన జయంతి సందర్భంగా 1965 భారత్ -పాక్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన ఘటనను హోం మంత్రి గుర్తుచేసుకున్నారు. ఈ యుద్ధంలో శత్రువులకు చెందిన 7 యుద్ధ ట్యాంకులను హమీద్ ఒంటిచేత్తో ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఆయన ధైర్యసాహసాలు దేశప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయని ట్వీట్ చేశారు.
మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ను మెన్స్ టీమ్కు బ్యాటింగ్ కోచ్గా నియమించినట్లు ఆర్సీబీ ప్రకటించింది. DK మెంటార్గానూ వ్యవహరించనున్నట్లు ట్వీట్ చేసింది. ‘ఇతడిని క్రికెట్ నుంచి దూరం చేయవచ్చు గానీ ఇతడి నుంచి క్రికెట్ను దూరం చేయలేము. 12th మ్యాన్ ఆర్మీ’ అని పేర్కొంది. ఈ ఏడాది IPLలో ఆర్సీబీ తరఫున ఆడిన DK రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB)లో 168 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి రేపటితో గడువు ముగియనుంది. క్రెడిట్ అనలిస్ట్, రిలేషన్షిప్ మేనేజర్, సీనియర్ మేనేజర్ బిజినెస్ ఫైనాన్స్ తదితర పోస్టులున్నాయి. జాబ్ను బట్టి డిగ్రీ, CA/CMA/CS/CFA, పీజీ, డిప్లొమా చేసిన వారు అర్హులు. అలాగే కాంట్రాక్ట్ పద్ధతిలో 459 ఉద్యోగాలున్నాయి. పూర్తి వివరాల కోసం <
TG: రాష్ట్రంలో ఇవాళ, రేపు పలు చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో బలమైన ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయంది. కాగా నిన్న రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా వికారాబాద్లోని తాండూరులో 5.1 సెం.మీ, నిజామాబాద్లోని పొతంగల్లో 4.8 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది.
లోక్సభ సమావేశాల్లో NEET UGపై చర్చించాల్సిందేనని విపక్షాలు పట్టుబడుతున్నాయి. NEET UG, UG NET సహా పరీక్షల క్వశ్చన్ పేపర్ల లీకేజీలు, నిర్వహణలో NTA వైఫల్యంపై చర్చించేందుకు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ లోక్సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మరో ఎంపీ మాణిక్కం ఠాగూర్ సస్పెన్షన్ ఆఫ్ బిజినెస్ నోటీసు ఇచ్చారు.
టీమ్ ఇండియా ప్రధాన కోచ్ రేసులో ఇద్దరి పేర్లు షార్ట్ లిస్ట్ చేసినట్లు BCCI సెక్రటరీ జైషా తెలిపారు. ‘కోచ్, సెలక్టర్ నియామకం త్వరలోనే జరుగుతుంది. CAC నిర్ణయించిన పేర్లను ప్రకటిస్తాం. జింబాబ్వేకు వెళ్లే జట్టుతో లక్ష్మణ్ కోచ్గా వెళ్తారు. కొత్త కోచ్ శ్రీలంక సిరీస్తో జాయిన్ అవుతారు’ అని పేర్కొన్నారు. కాగా గంభీర్ను కోచ్గా ఎంపిక చేశారనే ప్రచారం నడుమ జైషా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
Sorry, no posts matched your criteria.