News December 18, 2024

జేపీసీకి పేర్లు పంపండి.. పార్టీలను కోరిన స్పీకర్

image

జమిలి ఎన్నిక‌ల బిల్లుల‌పై JPC ఏర్పాటు విష‌య‌మై స‌భ్యుల పేర్ల‌ను ప్రతిపాదించాలని పార్టీల‌ను LS స్పీక‌ర్ ఓం బిర్లా కోరారు. 129 రాజ్యాంగ సవరణ సహా, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణల బిల్లుల‌ను కేంద్రం మంగ‌ళ‌వారం లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. ఈ బిల్లుల‌పై అన్ని స్థాయుల్లో విస్తృత చ‌ర్చ‌ల‌కు 31 మందితో జేపీసీ ఏర్పాటు చేసే అవ‌కాశం ఉంది. బీజేపీ స‌భ్యుడే ఛైర్మ‌న్‌గా వ్యవహరిస్తారు.

News December 18, 2024

Work Smart.. నాట్ హార్డ్‌: Dell CEO

image

ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎప్పుడూ స్మార్ట్‌గా ప‌నిచేయాలి త‌ప్ప హార్డ్‌గా కాద‌ని ఉద్యోగుల‌కు Dell CEO Michael Dell సూచించారు. రోజులో అధిక ప‌నిగంట‌లు ప్ర‌తికూల ఫ‌లితాలు ఇస్తాయ‌న్నారు. ప‌ని ప్ర‌దేశాల్లో స‌ర‌దాగా ఉండ‌క‌పోతే ప‌నిచేసే విధానం స‌రిగాలేద‌నే అర్థ‌మ‌న్నారు. ప‌నిలో ప్ర‌యోగాలు చేయాల‌ని, రిస్క్ తీసుకోవాల‌ని, విఫ‌ల‌మ‌వ్వాల‌ని, క్లిష్ట స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తూ ధైర్యంగా ముందుకు సాగాల‌ని సూచించారు.

News December 17, 2024

ఆ ఫొటోలు లీకైనప్పుడు కెరీర్ ముగిసిందనుకున్నా: మహీరా ఖాన్

image

రణ్‌బీర్ కపూర్‌తో కలిసి సిగరెట్ తాగిన ఫొటోలు లీక్ అయినప్పుడు తన కెరీర్ నాశనమైందని భావించినట్లు పాకిస్థాన్ నటి మహీరా ఖాన్ అన్నారు. ఫొటోల కారణంగా వృత్తిపరంగా, వ్యక్తిగతంగానూ చాలా కోల్పోయానని ఆమె వాపోయారు. ‘నా జీవితంలో పెళ్లి, విడాకులు, పాప పుట్టడం, సింగిల్‌గా ఉండటం, రణ్‌బీర్‌తో కలిసి ఉన్న ఫొటోలు లీక్ కావడం, ఓ దేశంలో నాపై నిషేధం విధించడం. ఇవన్నీ నాకు కష్టకాలంగా అనిపించాయి’ అని ఆమె పేర్కొన్నారు.

News December 17, 2024

పదో తరగతికి బోర్డు పరీక్షలుండవా?.. కేంద్రం ఏమందంటే?

image

నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం ఇకపై పదో తరగతికి బోర్డు పరీక్షలు ఉండవనే మెసేజ్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిని నమ్మిన విద్యార్థులు అయోమయంలో పడటంతో కేంద్రానికి చెందిన PIB FactCheck దీనిపై క్లారిటీ ఇచ్చింది. కేంద్ర విద్యాశాఖ ఇలాంటి ఆర్డర్ ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మి భయాందోళనకు గురికావొద్దని, దీనిని నమ్మి ఇతరులకు షేర్ చేయొద్దని కోరింది.

News December 17, 2024

నకిలీ బెదిరింపులు: ఇక నుంచి ₹లక్ష ఫైన్

image

విమానాలకు న‌కిలీ బాంబు బెదిరింపు సందేశాలు పంపే వారిపై క్రిమిన‌ల్ కేసుల న‌మోదుతోపాటు ఇక నుంచి రూ.ల‌క్ష వ‌ర‌కు జ‌రిమానా విధించ‌నున్నారు. అలాగే వారి విమాన ప్ర‌యాణాల‌పై నిషేధం విధించేలా పౌర విమానయాన భద్రతా బ్యూరో(BCAS)కు ప్ర‌భుత్వం ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ కొత్త నిబంధ‌న‌ల‌ను నోటిఫై చేసింది. ఇలా బెదిరింపు సందేశాలు పంపి అప్ప‌టికే విమానం ఎక్కిన వారిని కిందికి దింపే అధికారాన్ని కూడా క‌ల్పించింది.

News December 17, 2024

తెలుగు డైరెక్టర్‌తో ఆమిర్ ఖాన్ సినిమా?

image

తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లితో సినిమా చేసేందుకు ఆమిర్ ఖాన్ అంగీకరించినట్లు ఓ వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. వరుసగా రెండు ఫ్లాపులు చవిచూసిన ఆమిర్, టాలీవుడ్ డైరెక్టర్‌తో పనిచేయాలని భావించినట్లు సమాచారం. ఇప్పటికే వంశీ స్టోరీ లైన్ చెప్పారని, ఆమిర్‌కు నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ తయారుచేసే పనిలో పడ్డారని తెలుస్తోంది. దిల్ రాజు నిర్మించే అవకాశం ఉన్న ఈ మూవీపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

News December 17, 2024

శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ విడుదల

image

TG: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడ్డ <<14906305>>శ్రీతేజ్<<>> (9) ఆరోగ్యం విషమంగానే ఉందని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అతడు ఐసీయూలో వెంటిలేటర్‌పైనే ఉన్నాడని, జ్వరం పెరుగుతోందని పేర్కొన్నారు. మెదడుకు ఆక్సిజన్ సరిగా అందట్లేదని, బాలుడిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని వివరించారు. ప్రస్తుతం ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తున్నామని చెప్పారు.

News December 17, 2024

ACB చేతుల్లోకి ఈ-ఫార్ములా కేసు!

image

TG: ఈ-ఫార్ములా రేసింగ్‌లో నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలని సీఎస్ శాంతికుమారి ఏసీబీకి లేఖ రాశారు. ఈ కేసుకు సబంధించి ఇటీవల గవర్నర్ ఇచ్చిన అనుమతి లేఖను కూడా జత చేసి పంపారు. కాగా ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ రూ.53 కోట్లను ఓ విదేశీ సంస్థకు ఆర్బీఐ అనుమతులు లేకుండా నేరుగా ట్రాన్స్‌ఫర్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

News December 17, 2024

పైప్డ్ గ్యాస్ రాజధానిగా అమరావతి

image

AP: అమరావతిని పైప్డ్ గ్యాస్ రాజధానిగా మార్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పైప్డ్ గ్యాస్ అందించేందుకు IOC (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్) ప్రభుత్వాన్ని సంప్రదించింది. గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీ తరహాలో పైప్డ్ గ్యాస్ అందిస్తామని తెలిపింది. దేశంలోనే తొలి పైప్డ్ గ్యాస్ రాజధానిగా తీర్చిదిద్దుతామని పేర్కొంది. కాగా నివాసాలు, హోటళ్లు, సంస్థలు అన్నింటికీ సిలిండర్లతో కాకుండా పైపులతోనే గ్యాస్ అందిస్తారు.

News December 17, 2024

పృథ్వీ షా, రహానేకు మొండిచేయి

image

టీమ్ ఇండియా క్రికెటర్ పృథ్వీ షాకు మరో బిగ్ షాక్ తగిలింది. విజయ్ హజారే ట్రోఫీ కోసం ఎంపిక చేసిన జట్టులో ముంబై అతడికి చోటివ్వలేదు. ఆయనతోపాటు రహానేకు కూడా మొండిచేయి చూపింది. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో పృథ్వీషాను ఎవరూ కొనుగోలు చేయని విషయం తెలిసిందే. కాగా ఈ టోర్నీకి ఎంపిక కాకపోవడంతో పృథ్వీ తన ఇన్‌స్టా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘దేవుడా ఇంకెన్ని పరుగులు చేయాలి’ అంటూ అసహనం వ్యక్తం చేశారు.