News December 15, 2024

రేపు పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయం 10.గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 10.45కు పోలవరం వ్యూ పాయింట్‌కు చేరుకుంటారు. అనంతరం ప్రాజెక్టుకు సంబంధించి గ్యాప్ వన్, గ్యాప్ టూ, డీ వాల్ సహా సైట్‌ను పరిశీలిస్తారు. గెస్ట్ హౌస్‌లో ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడనున్నారు. ఆ తర్వాత తిరిగి అమరావతికి చేరుకుంటారు.

News December 15, 2024

మహేశ్ బాబు సరసన ప్రియాంకా చోప్రా?

image

సూపర్ స్టార్ మహేశ్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కనున్న మూవీపై ఓ క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ప్రముఖ హీరోయిన్ ప్రియాంకా చోప్రా నటిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చిత్ర బృందం ఆమెను సంప్రదించినట్లు టాక్. ఈ సినిమాలో ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్, బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు.

News December 15, 2024

పవన్ కళ్యాణ్‌ను కలిసిన పీవీ సింధు

image

AP: ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మంగళగిరిలో కలిశారు. తండ్రి రమణతో కలిసి పవన్‌ను క్యాంప్ కార్యాలయంలో కలిసి తన వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. ఈ నెల 22న సింధు వివాహం వెంకట దత్త సాయితో జరగనుండగా, 24న HYDలో రిసెప్షన్ నిర్వహించనున్నారు.

News December 15, 2024

వచ్చే నెల నుంచి యూపీలో మహా కుంభమేళా: కిషన్ రెడ్డి

image

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళా జరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దాదాపు 30 కోట్ల మందికి పైగా భక్తులు పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ క్రమంలో జనవరి 13, 14, 29, ఫిబ్రవరి 3, 12, 26 తేదీల్లో గంగానదిలో స్నానం చేస్తే పవిత్ర ఫలితం వస్తుందన్నారు.

News December 15, 2024

10 రోజుల్లో పుష్ప-2 కలెక్షన్స్ ఎంతంటే?

image

బాక్సాఫీస్ వద్ద పుష్ప-2 మూవీ కలెక్షన్లు కొల్లగొడుతోంది. 10 రోజుల్లో ఈ సినిమాకు రూ.1292 కోట్లు వచ్చినట్లు మేకర్స్ ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ ఏడాది విడుదలైన భారతీయ సినిమాల్లో హయ్యెస్ట్ గ్రాసర్ అంటూ పేర్కొన్నారు. అల్లు అర్జున్ అరెస్టు ఘటనతో గత రెండు రోజులుగా కలెక్షన్ల ప్రకటనకు దూరంగా ఉన్న మేకర్స్ ఇవాళ రిలీజ్ చేశారు. త్వరలోనే రూ.1500 కోట్ల క్లబ్‌లో ఈ సినిమా చేరే అవకాశం ఉంది.

News December 15, 2024

రికార్డు: సైబర్ బాధితులకు రూ.155.22 కోట్లు రిఫండ్

image

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో మెగా లోక్ అదాలత్‌లో 4,893 మంది బాధితులకు రూ.33.27 కోట్లు రిఫండ్ చేసింది. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది డిసెంబర్ 15 వరకు 17,210 మంది బాధితులకు 155.22 కోట్లు రిఫండ్ చేసింది. గత ఏడాది కంటే రూ.27.2 కోట్లు అదనంగా రికవరీ చేయగా ఇది ఒక రికార్డని పేర్కొంది.

News December 15, 2024

WPL: వీరు వేలంలో ఎంత పలికారంటే?

image

* రూ.30 లక్షలు: డేనియల్ గిబ్సన్(GG), అలనా కింగ్(UP)
* రూ.20 లక్షలు: అక్షితా మహేశ్వరి(MI)
* రూ.10 లక్షలు: ప్రకాశికా నాయక్(GG), సారా బ్రైస్, నిక్కీ ప్రసాద్(DC), జోషితా విజే, జాగ్రవీ పవార్, రఘ్వీ బిస్త్(RCB), సంస్కృతీ గుప్తా(MI), ఆరుషీ గోయల్, క్రాంతి గౌడ్(UP)

News December 15, 2024

WPL: యంగ్ ప్లేయర్లకు కాసుల పంట

image

WPL వేలంలో భారత యంగ్ ప్లేయర్లు సిమ్రాన్ షేక్, కమలిని జాక్ పాట్ కొట్టేశారు. ఇవాళ్టి వేలంలో సిమ్రాన్‌ను గుజరాత్ జెయింట్స్ రూ.1.9 కోట్లకు దక్కించుకుంది. మరోవైపు కమలినిని రూ.1.6 కోట్లకు ముంబై దక్కించుకుంది. మహారాష్ట్రకు చెందిన సిమ్రాన్ బ్యాటర్ కాగా 16 ఏళ్ల కమలిని వికెట్ కీపర్, బ్యాటర్ కావడం గమనార్హం. 23 ఏళ్ల ప్రేమ్ రావత్‌ను ఆర్సీబీ రూ.1.2 కోట్లకు దక్కించుకుంది. ఈ వేలంలో సిమ్రాన్ అత్యధిక ధర పలికారు.

News December 15, 2024

EVMలను నిందించ‌డం త‌ప్పు: ఒమ‌ర్ అబ్దుల్లా

image

EVMల ట్యాంప‌రింగ్‌పై INDIA కూట‌మి చేస్తున్న విమ‌ర్శ‌ల నుంచి NC దూరం జ‌రిగింది. ఆశించిన ఫ‌లితాలు రాన‌ప్పుడు EVMల‌ను నిందించ‌డం త‌గ‌ద‌ని JK CM ఒమ‌ర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. LS ఎన్నిక‌ల్లో 100 సీట్లు గెలిచిన‌ప్పుడు సంబ‌రాలు చేసుకొని, కొన్ని నెల‌ల‌కే అనుకూల ఫ‌లితాలు రాలేద‌ని ఈవీఎంల‌పై మాట మార్చ‌డం స‌రికాద‌న్నారు. ఈ విషయంలో తన వైఖరి బీజేపీ వాదనకు వత్తాసుపలకడం కాదన్నారు. వాస్తవాన్ని చెప్పానన్నారు.

News December 15, 2024

పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్సిటీ: CM

image

అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పేరుతో APలో తెలుగు వర్సిటీని ఏర్పాటు చేస్తామని CM చంద్రబాబు ప్రకటించారు. ‘ఆయన తెలుగు వారు గర్వంగా చెప్పుకునే వ్యక్తి. ఒక పూట తినకపోతేనే మనం తట్టుకోలేం. కానీ 58 రోజులు నిరాహార దీక్ష చేసి, అమరజీవి అయిన ఆయనను శాశ్వతంగా గుర్తుంచుకోవాలి. ఆయన త్యాగం స్మరించుకునేలా HYDలో తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. NLR జిల్లాకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాం’ అని CM గుర్తుచేశారు.