India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: అర్హులైన వారికే ప్రభుత్వ ఇళ్లు దక్కాలనేదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తొలి ఏడాదిలో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామన్నారు. తొలి దశలో SC, ST, ట్రాన్స్జెండర్లు, అత్యంత పేదలకు ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. ఆదివాసీ ప్రాంతాల్లో జనాభాను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక కోటా అమలు చేస్తామన్నారు.

AP: కృష్ణా జిల్లాలోని పలు రైతు సేవా కేంద్రాల్లో జరుగుతున్న అవకతవకలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుంచి ఎక్కువ ధాన్యం సేకరించి రికార్డుల్లో తక్కువ చూపించడంపై మండిపడ్డారు. దీంతో ఇద్దరు కస్టోడియల్ ఆఫీసర్లు, టీఏను అధికారులు సస్పెండ్ చేశారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

భారీ స్థాయిలో విడుదలైన ‘పుష్ప-2’ అప్పుడే లీక్ అయింది. రిలీజై 24 గంటలు కాకముందే ఆన్లైన్లోని పైరసీ సైట్లలో సినిమా దర్శనమిస్తోంది. ఇంత త్వరగా సినిమా లీక్ అవడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. సుమారు రూ.500 కోట్లకు పైగా బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు.

మహారాష్ట్రలో NCP నేత బాబా సిద్ధిఖీ కంటే ముందు సల్మాన్ ఖాన్ను బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే పటిష్ఠమైన సెక్యూరిటీ వల్ల వారి ప్రణాళిక విఫలమైందని పేర్కొన్నాయి. దీంతో సిద్ధిఖీపై ఫోకస్ చేసినట్లు చెప్పాయి. అక్టోబర్ 12న జరిగిన దాడిలో బాబా చనిపోగా, ఆయన కుమారుడు జీషన్ తప్పించుకున్నారు.

TG: BRS సీనియర్ నేత హరీశ్ రావుకు హైకోర్టులో ఊరట దక్కింది. పంజాగుట్ట PSలో నమోదైన కేసు విషయంలో ఆయనను అరెస్టు చేయవద్దని పోలీసులను ఆదేశించింది. అయితే తదుపరి దర్యాప్తు చేపట్టవచ్చని, దీనికి హరీశ్ రావు సహకరించాలని సూచించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. కాగా, తన ఫోన్ ట్యాప్ చేయించారని సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ హరీశ్ రావుపై ఫిర్యాదు చేశారు.

క్రికెట్లోనే కాదు యాడ్స్లోనూ ధోనీ రికార్డులు సృష్టిస్తున్నారు. ఈ ఏడాది తొలి 6 నెలల్లోనే 42 బ్రాండ్లను దక్కించుకుని షారుఖ్, అమితాబ్లను వెనక్కు నెట్టినట్లు TAM మీడియా రీసెర్చ్ వెల్లడించింది. ఆయన ఖాతాలో క్లియర్ట్రిప్, మాస్టర్ కార్డ్, గల్ఫ్ ఆయిల్ లాంటి టాప్ బ్రాండ్లున్నాయి. అన్ని ఛానళ్లలో బచ్చన్(16H), SRK(20H) కంటే ధోనీ(14) స్క్రీన్ ప్రజెన్స్ తక్కువ ఉన్నప్పటికీ ప్రభావం ఎక్కువగా ఉందని పేర్కొంది.

పుష్ప-2 క్లైమాక్స్లో డైరెక్టర్ సుకుమార్ పార్ట్-3కి లింక్ వదిలారు. చివర్లో పుష్ప-3 ర్యాంపేజ్ అనే టైటిల్తో సినిమా ముగుస్తుంది. పుష్ప-2లో ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ మాఫియాను అంతగా చూపించని సుక్కు.. పార్ట్-3లో రివీల్ చేస్తారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ సినిమా షూటింగ్ ఎప్పటి నుంచి మొదలవుతుంది? విలన్ ఎవరు? లాంటి విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.

రిలీజ్ షో అంటే హడావుడి ఉండే హైదరాబాద్లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్లో పుష్ప2 విడుదలవలేదు. ఇందుకు థియేటర్ యాజమాన్యం-మైత్రి మూవీ మేకర్స్ మధ్య షేర్ వివాదం కారణం. గ్రాస్ కలెక్షన్లలో 55% డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చేందుకు మిగతా ఎగ్జిబిటర్ చైన్స్ అంగీకరించాయి. కానీ ప్రసాద్స్ మాత్రం ఇప్పుడు ఇస్తే మున్ముందు మిగతా వారూ ఇదే డిమాండ్ చేస్తారని 52% మాత్రమే ఇస్తానని స్పష్టం చేసింది. ఫలితంగా ఇక్కడ పుష్ప2 సందడి లేదు.

లైంగిక దాడుల కేసుల్లో మెడికల్ ఎవిడెన్స్ బలమైన సాక్ష్యం కాబోదని బాంబే హైకోర్టులోని నాగపూర్ బెంచ్ తెలిపింది. నేరాభియోగాల నిరూపణలో మద్దతుపరిచే సాక్ష్యంగానే అది పనికొస్తుందని పేర్కొంది. 10 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించాడన్న కేసులో ట్రయల్ కోర్టు ఒకరికి విధించిన 20ఏళ్ల జైలుశిక్షను నిలిపివేసింది. అతడిపై బాధితురాలు, ఆమె తల్లి ఎలాంటి పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ ఆరోపణలు చేయలేదని వెల్లడించింది.

సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకోవడమంటే ఇదే. ఉక్రెయిన్తో యుద్ధం వల్ల రష్యాపై వెస్ట్రన్ కంట్రీస్ ఎడాపెడా ఆంక్షలు విధించాయి. విచిత్రంగా FMCG, IT, ఫైనాన్స్ సహా అన్ని MNCలు వెళ్లిపోయాయి. ఇప్పుడదే రష్యాకు వరంగా మారింది. వెళ్లిపోయిన వాటి స్థానంలో స్థానిక బ్రాండ్లు దుమ్మురేపుతున్నాయి. మార్కెట్ మొత్తం కైవసం చేసుకున్నాయి. లాభాల పంట పండిస్తున్నాయి. దీంతో నాశనం అవుతుందనుకున్న అక్కడి ఎకానమీ పరుగులు పెడుతోంది.
Sorry, no posts matched your criteria.