India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై లుక్ ఔట్ సర్క్యులర్ జారీ అయింది. కాకినాడ సీ పోర్టును బలవంతంగా లాక్కోవడంపై కేవీ రావు ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. విజయసాయితో పాటు ఆయన అల్లుడు శరత్ చంద్రారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిపై లుక్ ఔట్ సర్క్యులర్ జారీ చేశారు.

2023 నాటికి భారత విదేశీ అప్పు $31B పెరిగి $646 బిలియన్లకు చేరినట్లు వరల్డ్ బ్యాంక్ వెల్లడించింది. అప్పులపై వడ్డీ చెల్లింపులు $15B నుంచి $22Bకు పెరిగినట్లు తెలిపింది. దీర్ఘకాలిక రుణాలు 7 శాతం పెరిగి $498Bకు, స్వల్పకాలిక అప్పులు కాస్త తగ్గి $126Bకు చేరినట్లు పేర్కొంది. గత ఏడాది విదేశీ రుణాల రూపంలో $33.42B, ఈక్విటీ పెట్టుబడుల రూపంలో $46.94B వచ్చినట్లు తెలిపింది.

పుష్ప-2 విజయం సాధించిందని చెబుతూ డైరెక్టర్ ఆర్జీవీ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన అల్లు అర్జున్, మూవీ టీమ్కు కంగ్రాట్స్. అల్లు ఇప్పుడు మెగా మెగా మెగా మెగా’ అని రాసుకొచ్చారు. ‘మెగా’ కంటే అల్లు ఎన్నో రెట్లు ఎక్కువని ఇటీవల ఆయన ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. టికెట్ ధరల పెంపునూ సమర్థించారు.

జీవ మనుగడకు నేలే ప్రధానం. ఆహారం, ఆవాసం అందించేది ఆ నేలతల్లే. మానవ తప్పిదాల వల్ల నేడు అది తీవ్ర క్షీణతకు గురవుతోంది. కృత్రిమ రసాయనాలు, పారిశ్రామిక వ్యర్థాలతో సారం కోల్పోతోంది. వీటివల్ల ఇప్పటికే భారత్లో 8కోట్ల హెక్టార్లు నిస్సారమవగా, ప్రపంచవ్యాప్తంగా 30శాతం పంటభూములు క్షీణించాయి. అభివృద్ధి పేరిట చేస్తున్న స్వార్థపూరిత చర్యలను వీడితేనే పుడమితల్లిని కాపాడుకోగలం.
*నేడు అంతర్జాతీయ మృత్తికా దినోత్సవం.

పుష్ప-1లో ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ లీడర్గా ఎదిగిన పుష్పరాజ్ అంతర్జాతీయ స్థాయికి ఎలా చేరాడన్నదే కథ. జాతర సీక్వెన్స్, క్లైమాక్స్లో బన్నీ నటవిశ్వరూపం చూపించారు. శ్రీవల్లి నటన, ప్రీ ఇంటర్వెల్, సాంగ్స్ ప్లస్. సెకండాఫ్లో ఎమోషన్లకు పెద్దపీట వేసిన డైరెక్టర్ స్టోరీలో కీలకమైన స్మగ్లింగ్ను పక్కనబెట్టారు. సాగదీత సీన్లు, రన్టైమ్, విలనిజంలో బలం లేకపోవడం మైనస్. సుక్కు మార్క్ మిస్ అయింది. RATING: 3/5

దక్షిణ కొరియాలో జననాల రేటు మరీ క్షీణించిపోయింది. ప్రస్తుతం ఆ దేశంలో బర్త్ రేటు 0.72 శాతానికి పడిపోయింది. దీంతో జననాల రేటు కన్నా మరణాల రేటు ఎక్కువై జనాభా వేగంగా తగ్గిపోతోంది. ఆ దేశంలోని మహిళలు పెళ్లిళ్లు లేటుగా చేసుకుంటుండడంతో పునరుత్పత్తి సామర్థ్యం పడిపోయింది. పరిస్థితి ఇలాగే ఉంటే ఐదున్నర కోట్ల జనాభా కోటిన్నరకు పడిపోనుంది. మరో వందేళ్లలో జనాభా పూర్తిగా తగ్గిపోయి ఆ దేశమే కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.

‘పుష్ప-2’ చూడ్డానికి వెళ్లి <<14793383>>రేవతి<<>> అనే మహిళ తన విలువైన ప్రాణాలు కోల్పోవడం, కుమారుడు చావుబతుకుల్లో ఉండటంతో నెటిజన్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. బన్నీని చూసేందుకు వచ్చిన అభిమానుల రద్దీని పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. కాగా ఫ్యాన్స్ పెద్దఎత్తున తరలివస్తారని తెలిసి కూడా ప్రీమియర్లకు ఫ్యామిలీతో కలిసి వెళ్లడం ఎందుకని, ఓ 3-4 రోజులు ఆగొచ్చు కదా అని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ కామెంట్?

AP: జూనియర్ వైద్యులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి గౌరవ వేతనాలను 15 శాతం పెంచుతూ వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులిచ్చారు. పెంచిన జీతాలు ఈ ఏడాది జనవరి నుంచి వర్తిస్తాయని పేర్కొన్నారు. రెసిడెంట్ స్పెషలిస్టులకు ₹70వేల నుంచి ₹80,500, రెసిడెంట్ డెంటిస్ట్లకు ₹65వేల నుంచి ₹74,750, రెసిడెంట్ సూపర్ స్పెషలిస్టులకు ₹85వేల నుంచి ₹97,750ల వరకు జీతాలు పెరిగాయి.

మహారాష్ట్ర CMగా దేవేంద్ర ఫడణవీస్ ఇవాళ సా.5.30 గం.కు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయన CMగా బాధ్యతలు చేపట్టడం ఇది మూడోసారి. ముంబైలోని ఆజాద్ మైదాన్లో జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. ఫడణవీస్తో పాటు Dy.CMగా అజిత్ పవార్ ప్రమాణం చేస్తారు. అయితే డిప్యూటీ పోస్ట్ తీసుకోవడానికి ఏక్నాథ్ శిండే వెనుకాడుతున్నారు. ఆయన ప్రమాణం చేస్తారా? లేదా? అనేది సాయంత్రం తేలనుంది.

ఇకపై ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లలో 4 జనరల్ బోగీలు జత చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన LHB కోచ్లు వీటికి అనుసంధానం చేస్తున్నట్లు వెల్లడించింది. ఒక్కో బోగీలో వంద మంది ప్రయాణించవచ్చని పేర్కొంది. మొత్తం 370 రైళ్లలో వీటిని అందుబాటులోకి తెస్తున్నామని, లక్ష మంది అదనంగా ప్రయాణించవచ్చని వివరించింది. వీటిల్లో ప్రమాదాలు జరిగినా తక్కువ నష్టం కలుగుతుందని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.