India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మరి కొన్ని గంటల్లో ‘పుష్ప-2’ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో అల్లు అర్జున్తో సహా చిత్ర బృందానికి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ <<14786860>>విష్<<>> చేశారు. దీనికి అల్లు అర్జున్ బదులిస్తూ ధన్యవాదాలు తెలిపారు. మీరంతా సినిమాను ఇష్టపడతారని ఆకాంక్షిస్తున్నట్లు రాసుకొచ్చారు. అయితే అక్కడ ‘మీరంతా’ అని ఎవరిని ఉద్దేశించి అన్నారని ఐకాన్ స్టార్ను మెగా ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

అక్కినేని నాగచైతన్య-శోభిత దూళిపాళ వివాహం ఆడంబరంగా జరిగింది. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో ANR విగ్రహం ముందు ఈ జంట ఒక్కటయ్యారు. పెళ్లి వేడుకల్లో వధూవరుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా ఈ జంట రేపు లేదా ఎల్లుండి శ్రీశైలం/తిరుమలకు వెళ్లనున్నారు.

అల్లు అర్జున్ ‘పుష్ప-2’ మూవీపై అభిమానులతో పాటు సెలబ్రిటీల్లోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇవాళ రాత్రి 9.30 గంటలకు ప్రీమియర్ షోలు ప్రదర్శించనుండగా పలువురు సెలబ్రిటీలు థియేటర్లలో వీక్షించనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి.
* సంధ్య(RTC X ROAD)- కుటుంబ సభ్యులతో అల్లు అర్జున్
* నల్లగండ్ల అపర్ణ- దర్శకుడు రాజమౌళి
* AMB- పుష్ప-2 నిర్మాతలు
* శ్రీరాములు(మూసాపేట)-దిల్ రాజు, అనిల్ రావిపూడి, ఇతర ప్రముఖులు

CAPF, అస్సాం రైఫిల్స్లో 1,00,204 ఉద్యోగ ఖాళీలున్నాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. CRPF-33,730, CISF-31,782, BSF-12,808, ITBP-9,861, SSB-8,646, అస్సాం రైఫిల్స్లో 3,377 చొప్పున పోస్టులున్నట్లు చెప్పారు. UPSC, SSC ద్వారా త్వరగా భర్తీ చేస్తామన్నారు. వైద్యపరీక్షల సమయం తగ్గించి, కానిస్టేబుల్ GD కోసం షార్ట్ లిస్టైన వారి కటాఫ్ మార్కులు తగ్గించడం వంటి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

AP: రాష్ట్రంలోని బేడ బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్కు MP బైరెడ్డి శబరి లేఖ రాశారు. సంచార జాతులుగా పేరొందిన వీరు జానపద కథలు చెప్తూ జీవిస్తారు. దీంతో ఒక గ్రామానికి పరిమితం కాకపోగా ఇప్పటికీ దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆమె లేఖలో పేర్కొన్నారు. వీరిని SCల్లో చేర్చడంలో కేంద్రం చొరవ చూపి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అస్సాంలో బీఫ్ (గొడ్డు మాంసం)పై పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. రెస్టారెంట్లు, ఫంక్షన్లు, బహిరంగ ప్రదేశాల్లో అన్ని మతాల వారు బీఫ్ తినడాన్ని బ్యాన్ చేస్తున్నామన్నారు. ఇది వరకు ఆలయాల దగ్గర ఈ నిషేధం విధించామని, ఇప్పుడా నిర్ణయం రాష్ట్రం మొత్తం వర్తిస్తుందని తెలిపారు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ స్వాగతించాలని లేదంటే పాకిస్థాన్ వెళ్లిపోవాలని మంత్రి పిజుష్ ట్వీట్ చేశారు.

ప్రపంచ ఎయిర్లైన్స్లో ఈ ఏడాది అత్యుత్తమైనవి, చెత్తవాటితో కూడిన జాబితాను ఎయిర్హెల్ప్ సంస్థ రూపొందించింది. సమయపాలన, ప్రయాణికుల సంతృప్తి తదితర అంశాల ఆధారంగా ర్యాంకింగ్స్ను ప్రకటించింది. అత్యంత చెత్త ఎయిర్లైన్గా 109వ స్థానంలో టునీస్ఎయిర్ నిలవగా 103వ స్థానంలో భారత ఎయిర్లైన్స్ సంస్థ ఇండిగో ఉంది. అత్యుత్తమ ఎయిర్లైన్గా బ్రస్సెల్స్ ఎయిర్లైన్స్, ఖతర్ ఎయిర్వేస్ తొలి 2 స్థానాలు దక్కించుకున్నాయి.

KCR రూ.1.02 లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని సీఎం రేవంత్ విమర్శించారు. ‘మేం కట్టిన శ్రీశైలం, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులు 60 ఏళ్లు ఎలా ఉన్నాయో, నువ్వు కట్టిన కాళేశ్వరం ఎలా ఉందో చూడ్డానికి రా. లెక్కలు తేలుద్దాం’ అని సవాల్ విసిరారు. కాళేశ్వరం నుంచి చుక్కనీళ్లు లేకపోయినా రికార్డు స్థాయిలో కోటి మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిందని సీఎం తెలిపారు.

TG: బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 15న జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర కమిటీ కోరింది. ఈమేరకు ఆ పార్టీ జాతీయ నేత బీఎల్ సంతోష్ను కలిసి వినతిపత్రం అందజేసింది. అటు రాష్ట్ర కాంగ్రెస్ గిరిజన నేతలు కూడా కేంద్రాన్ని ఇదే విషయమై డిమాండ్ చేశారు. కాగా గతేడాది ఫిబ్రవరి 15న రాష్ట్ర ప్రభుత్వం ఆప్షనల్ హాలీడే ఇచ్చిన విషయం తెలిసిందే.

TG: ప్రజల ఆశీస్సులతోనే సామాన్యుడినైన తాను సీఎం అయ్యానని సీఎం రేవంత్ రెడ్డి పెద్దపల్లి యువ వికాసం సభలో అన్నారు. ‘తెలంగాణ ఇస్తామని సోనియా గాంధీ మొదట ఈ గడ్డపై నుంచే చెప్పారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా సోనియా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కేసీఆర్ పాలనలో గిట్టుబాటు ధర రాక రైతులు ఉరేసుకుని ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆయనకు మాత్రం ఎకరాకు రూ.కోటి ఆదాయం వచ్చింది’ అని విమర్శించారు.
Sorry, no posts matched your criteria.