India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం 9.17 గంటలకు 117 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 80,962 వద్ద, 35 పాయింట్ల లాభంతో నిఫ్టీ 24,492 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలకు తోడు ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానాలపై మదుపర్లు దృష్టి పెట్టి ఆచితూచి వ్యవహరిస్తున్నారు. డాలర్తో రూపాయి మారకం విలువ 84.68గా ఉంది.

తాము ప్రయాణించాల్సిన ట్రైన్ 2 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం ఆలస్యమైతే ప్రయాణికులకు IRCTC ఉచిత భోజనం అందించనుంది. ప్రస్తుతం ఈ సర్వీస్ రాజధాని, శతాబ్ది, దురంతో ఎక్స్ప్రెస్ వంటి ప్రీమియం రైళ్లలో అందుబాటులో ఉంది. టీ, కాఫీ, బిస్కెట్లు, బ్రెడ్, భోజనం ఆర్డర్ చేయొచ్చు. ట్రైన్ ఎక్కకముందే 3 గంటల కన్నా ఎక్కువ సమయం ఆలస్యమైతే టికెట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. వెయిటింగ్ రూమ్స్లో అదనపు ఛార్జీలు కూడా ఉండవు.

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వీరికి అటెండెన్స్ యాప్ అందుబాటులో ఉండగా సచివాలయానికి వచ్చిన, డ్యూటీ అనంతరం తిరిగి వెళ్లే సమయాల్లో బయోమెట్రిక్ హాజరు వేయాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల మంది గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది వరుసగా 13 రోజులు బయోమెట్రిక్ వేయలేదని ప్రభుత్వం గుర్తించింది. ఇందుకు కారణం తెలపాలని వారందరికీ నోటీసులు జారీ చేసింది.

భూప్రకంపనలకు అవకాశం ఉన్న ప్రాంతాలను భూకంప మండలాలు(సెస్మిక్ జోన్లు) అంటారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ప్రకారం మన దేశంలో 4భూకంప మండలాలున్నాయి. V, IV, III, II జోన్లు ఉండగా.. జోన్ Vలో అత్యధికంగా, IIలో అత్యల్ప భూకంపాలకు అవకాశం ఉంది. కాగా AP, TG జోన్ II పరిధిలో ఉన్నాయి. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు రాగా ప్రజలు ఆందోళన చెందారు. మనం జోన్ 2లో ఉండటంతో అంతగా భయపడాల్సిన అవసరం లేదు.

TG: బీఆర్ఎస్ ఏడాది కాలంగా చాలా ఎదురుదెబ్బలు, సవాళ్లు ఎదుర్కొందని KTR అన్నారు. గత ఏడాది పార్టీకి చాలా కష్టంగా గడిచిందన్నారు. ‘మీరు ఎంత గట్టిగా దెబ్బకొట్టారన్నది కాదు. ఎంత గట్టి దెబ్బ తగిలినా పోరాటం కొనసాగించడమే ముఖ్యం. ఇప్పుడు మనం రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడి పోరాడుతున్నాం. KCR నాయకత్వానికి, పార్టీ కార్యకర్తలకు, సోషల్ మీడియా వారియర్లకు థాంక్యూ. మరో 4 ఏళ్లు మిగిలుంది’ అని ట్వీట్ చేశారు.

AP: పుస్తక ప్రియులకు గుడ్న్యూస్. జనవరి 2 నుంచి 12వ తేదీ వరకు విజయవాడ పాలిటెక్నిక్ కాలేజీ గ్రౌండ్స్లో బుక్ ఫెస్టివల్ జరగనుంది. ప్రభుత్వ, ప్రైవేట్, తెలుగు, జాతీయ, అంతర్జాతీయ ప్రచురణ సంస్థలకు చెందిన దాదాపు 200కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాది ఆరుద్ర, దాశరధి, నాజర్, నార్ల చిరంజీవి, ఎన్.నటరాజన్, భానుమతి శతజయంతి వేడుకలను పుస్తక ప్రదర్శనలో నిర్వహించనున్నారు.

నాగ చైతన్య, శోభిత ధూళిపాళ వివాహం ఈరోజు రాత్రి 8.13 గంటలకు జరగనున్న విషయం తెలిసిందే. దీనికోసం అన్నపూర్ణ స్టూడియోస్లో ప్రత్యేక సెట్ను ఏర్పాటు చేశారు. పూర్తి హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగే ఈ వేడుకకు టాలీవుడ్ హీరోలు తమ కుటుంబంతో హాజరవుతారని సమాచారం. ఇప్పటికే ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరగ్గా దీనికి సంబంధించిన ఫొటోలు వైరలయ్యాయి.

ధోనీ, తాను దాదాపు 10 ఏళ్లుగా మాట్లాడుకోవడం లేదని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తెలిపారు. దీనికి కారణాలు ఏవీ లేవని, తామెప్పుడూ టచ్లో లేమని చెప్పుకొచ్చారు. IPLలో CSK తరఫున ఆడినప్పుడు చివరిసారిగా తాము మాట్లాడుకున్నామని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. గ్రౌండ్లో మాత్రమే మాట్లాడేవాళ్లమని, ఆ తర్వాత ఒకరి గదికి మరొకరు ఎప్పుడూ వెళ్లలేదన్నారు. యువరాజ్, ఆశిష్ నెహ్రాతో తాను రెగ్యులర్గా టచ్లో ఉంటానని చెప్పారు.

TG: రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. ధరలు పెంచాలని ఉత్పత్తిదారులు, పెంపుపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ప్రతిపాదనలు చేసినా ప్రభుత్వం అంగీకరించలేదని తెలుస్తోంది. ప్రతి రెండేళ్లకోసారి ధరల పెంపుపై త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుంటుంది. ఇటీవల కూడా బీర్ల ధరలు రూ.20 చొప్పున, ఇతర మద్యం ధరలు రూ.30-40 చొప్పున పెంచాలని కమిటీ సిఫార్సు చేసింది.

TG: ములుగు జిల్లా వాజేడు SI హరీశ్ (29) ఆత్మహత్య వెనుక విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. SI చనిపోయిన సమయంలో అక్కడ ఓ యువతి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సూర్యాపేట జిల్లాకు చెందిన ఆమె గతంలో ముగ్గురు యువకులను ప్రేమ పేరుతో మోసం చేసిందని, ఆ ముగ్గురిపై కేసులు కూడా పెట్టినట్లు సమాచారం. డబ్బు, పలుకుబడి ఉన్నవారిని ఆ యువతి లొంగదీసుకుంటుందని, ఈ క్రమంలోనే హరీశ్ను కూడా ప్రేమలోకి దించిందని సమాచారం.
Sorry, no posts matched your criteria.