India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 16న రాష్ట్రానికి రానున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా HYD బొల్లారంలోని రాష్ట్రపతి భవన్లో బస చేయనున్నారు. ఈ నెల 16 నుంచి 21 వరకు ఆమె హైదరాబాద్లోనే ఉండనున్నారు. అనంతరం ఏపీకి వెళ్లనున్నారు. రాష్ట్రపతి రాక నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్ నియంత వైఖరి, కుటుంబ పాలన, అణచివేతతో ప్రజల్లో అసంతృప్తి రేగింది. 2011లో బషర్కు వ్యతిరేకంగా రెబల్స్ ఏకమవ్వడంతో అంతర్యుద్ధం ప్రారంభమైంది. దానికి ముందు అరబ్ దేశాల్లో జరిగిన ప్రజాస్వామ్య పోరాటాలు(Arab Spring) స్ఫూర్తి నివ్వడంతో సిరియాలో అంతర్యుద్ధం మొదలైంది. అమెరికా, రష్యా, ఇరాన్, టర్కీ దేశాల ప్రయోజనాలు, ఉగ్ర సంస్థల భాగస్వామ్యం సంక్షోభాన్ని పెంచాయి.

ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ను ‘హై-రిస్క్ ఫుడ్ కేటగిరీ’గా వర్గీకరించాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నిర్ణయించింది. దీంతో వీటిని తయారు చేసే కంపెనీలను గుర్తింపుపొందిన థర్డ్ పార్టీ ఏజెన్సీలు ప్రతి ఏటా ఓసారి తనిఖీ చేసి ప్రమాద ఆధారిత ఆడిట్ చేయనున్నాయి. లైసెన్స్ /రిజిస్ట్రేషన్ కోసమూ అధికారులు తనిఖీ చేస్తారు. వినియోగదారుల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా FSSAI చర్యలు చేపట్టింది.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణను పునఃపరిశీలించాలని ఢిల్లీలో కేంద్ర మంత్రి కుమారస్వామికి YCP MPలు వినతి పత్రం అందజేశారు. స్టీల్ ప్లాంట్కు సంబంధించి క్యాప్టివ్ మైనింగ్ లేకపోవడం ప్రధాన అడ్డంకిగా మారిందని, ఇది లాభాలను ప్రభావితం చేస్తుందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్లాంట్ మళ్లీ లాభదాయకమైన వెంచర్గా మారేందుకు సాయం అందించడంపై మంత్రి సానుకూలంగా స్పందించారని MPలు తెలిపారు.

TG: కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ల పాటు అధికారంలో ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బోనస్ డబ్బులతో రైతుల కళ్లలో ఆనందం చూసి తనకు బిర్యానీ తిన్నంత ఖుషీగా ఉందన్నారు. సన్నవడ్లకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్నామని చెప్పారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న ప్రధాని మోదీ హామీలు నెరవేర్చలేకపోయారని విమర్శించారు. రైతులను మరిచిన కేసీఆర్ ఫామ్ హౌజ్కే పరిమితమయ్యారని దుయ్యబట్టారు.

AP: మద్యం అమ్మకాల్లో అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. మద్యాన్ని MRP కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే రూ.5లక్షల ఫైన్ విధించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. మరోసారి అదే తప్పు చేస్తే మద్యం దుకాణం లైసెన్సును రద్దు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది. వైన్స్ పరిధిలో బెల్ట్ షాపులు నిర్వహించినా రూ.5లక్షల జరిమానా ఉంటుందని, బార్ లైసెన్సులకూ ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది.

TG: కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు పదవులు ఊడితేనే యువతకు ఉద్యోగాలు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తొందర్లోనే 563 మంది గ్రూప్-1 అధికారులను రాష్ట్ర నిర్మాణంలో భాగం చేయబోతున్నామని చెప్పారు. TGPSC ప్రక్షాళన ప్రభుత్వ పనితనానికి గీటురాయి అని పేర్కొన్నారు. పరీక్షలు వాయిదా వేస్తే యువత భవిష్యత్తు నాశనం అవుతుందని, ఎలాంటి ఆటంకం లేకుండా నియామక ప్రక్రియ చేపడుతున్నామని తెలిపారు.

TG: ఏటూరు నాగారం ఎన్కౌంటర్లో హతమైన మావోయిస్టుల మృతదేహాలను రేపటి వరకు భద్రపరచాలని, మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు చూపించాలని హైకోర్టు ఆదేశించింది. ఇది బూటకపు ఎన్కౌంటర్ అని దాఖలైన పిటిషన్పై విచారణ జరిపింది. భోజనంలో మత్తు కలిపి, చిత్రహింసలకు గురిచేసి మావోలను చంపారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. మృతదేహాలపై గాయాలున్నాయన్నారు. వాదనల అనంతరం విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.

తెలంగాణ యువత ఉద్యమబాట పట్టి రాష్ట్రాన్ని సాధించుకుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. BRS ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో విఫలమైందని దుయ్యబట్టారు. స్వాతంత్ర్య భారతంలో ఏడాది వ్యవధిలోనే 50వేల ఉద్యోగాలు భర్తీ చేసిన తొలి రాష్ట్రంగా చరిత్ర సృష్టించామన్నారు. నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగ భర్తీ చేస్తామనే నమ్మకం తమ ప్రభుత్వంపై ఏర్పడిందని పేర్కొన్నారు.

TG: ప్రతి నెలా ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ నెలలో 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. పొట్టిశ్రీరాములు యూనివర్సిటీ 39వ వ్యవస్థాపన దినోత్సవాల్లో ఆయన మాట్లాడారు. పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పించాలని తమ ప్రభుత్వం ఆరాటపడుతోందన్నారు. ఇతర కార్పొరేషన్ రంగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.