News August 27, 2024

హార్దిక్ పాండ్యతో విడాకుల తర్వాత ప్రేమపై నటాషా పోస్ట్

image

క్రికెటర్ హార్దిక్ పాండ్యతో విడిపోయిన తర్వాత నటాషా స్టాంకోవిక్ కొడుకు అగస్త్యతో కలిసి సెర్బియాలో ఉంటున్నారు. తాజాగా ఆమె ప్రేమ గురించి ఇన్‌స్టాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. ‘ప్రేమకు సహనం ఎక్కువ. ప్రేమ దయగలది. లవ్‌లో ద్వేషం, అసూయ ఉండవు. స్వార్థపూరితంగా వ్యవహరించడం ప్రేమకు తెలియదు. ప్రేమ తప్పు ఒప్పులను లెక్కిస్తూ కోపం ప్రదర్శించదు. ప్రేమ ఎప్పటికీ విఫలం కాదు’ అని ఆమె పోస్ట్‌లో పేర్కొన్నారు.

News August 27, 2024

‘సరిపోదా శనివారం’ నిడివి 2 గం. 54 నిమిషాలు: సెన్సార్ బోర్డ్

image

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ‘సరిపోదా శనివారం’ సినిమా ఎల్లుండి రిలీజ్ కానుంది. ఈక్రమంలో సినిమాకు సంబంధించిన సెన్సార్ రిపోర్ట్‌ను సినీవర్గాలు షేర్ చేస్తున్నాయి. సినిమా పూర్తిగా 2 గం. 54 నిమిషాల నిడివితో ఉండనుంది. మూవీలో ఏ సీన్లపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ, రెండుచోట్ల ఓ పదాన్ని మ్యూట్ చేయాలని, మరోచోట ధూమపాన నిషేధం ట్యాగ్ ఇవ్వాలని పేర్కొంది.

News August 27, 2024

రాజ్యసభ MPగా సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవం

image

తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మను సింఘ్వీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోటీలో ఎవరూ లేకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. కె.కేశవరావు MP పదవికి రాజీనామా చేసి BRS నుంచి కాంగ్రెస్‌లోకి మారడంతో ఆ స్థానం ఖాళీగా మారింది. ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ సింఘ్వీని నామినేట్ చేసింది.

News August 27, 2024

జిల్లాల వారీగా విజన్ డాక్యుమెంట్లు: CM చంద్రబాబు

image

AP: 2047 నాటికి రాష్ట్రాన్ని 2 ట్రిలియన్ల డాలర్ల ఆర్థికవ్యవస్థగా మార్చడమే తమ లక్ష్యమని CM CBN వెల్లడించారు. వికసిత్ AP-2047 డాక్యుమెంట్ రూపకల్పనపై నీతిఆయోగ్ ప్రతినిధితులతో చర్చించారు. వచ్చే ఐదేళ్లకు జిల్లాల వారీగా విజన్ డాక్యుమెంట్లు సిద్ధం చేస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని ఆహార శుద్ధి పరిశ్రమల కేంద్రంగా, లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దుతామని, యువతలో నైపుణ్యం పెంచేలా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు.

News August 27, 2024

ఆర్జీ కర్ ఆస్పత్రిలో సాధారణ పరిస్థితులు: మెడికల్ సూపరింటెండెంట్

image

కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని సూపరింటెండెంట్ సప్తర్షి ఛటర్జీ తెలిపారు. ప్రతిరోజూ విద్యార్థులతో మాట్లాడి రోగులకు ఇబ్బందులు కలగకుండా అధ్యాపకులు తమ వంతు సాయం అందిస్తున్నారని చెప్పారు. చికిత్స కోసం వస్తున్న వారి సంఖ్య 100 నుంచి 1000కి చేరుకుందని వెల్లడించారు. అన్ని డిపార్ట్‌మెంట్లతోపాటు OPD, ఎమర్జెన్సీ సేవలు పనిచేస్తున్నాయన్నారు.

News August 27, 2024

టీడీపీలో చేరిన ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్

image

AP: ఏలూరు కార్పొరేషన్ మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త ఎస్.ఎమ్.ఆర్ పెదబాబు టీడీపీలో చేరారు. వీరితో పాటు పలువురు వైసీపీ నేతలకు మంత్రి నారా లోకేశ్ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. ఎన్నికల్లో ఓటమి నుంచి వైసీపీ గుణపాఠం నేర్చుకోలేదని, ప్రజా ప్రభుత్వంపై నిత్యం దుష్ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటోందని లోకేశ్ విమర్శించారు. ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు.

News August 27, 2024

AMMA అధ్యక్ష పదవికి మోహన్‌లాల్ రాజీనామా

image

మలయాళ సినీ ఇండస్ట్రీలో పలువురు నటులు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా దీనికి నైతిక బాధ్యత వహిస్తూ AMMA(అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్) అధ్యక్షుడు మోహన్‌లాల్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. పాలకమండలి సభ్యులంతా రాజీనామా చేశారు. రెండు నెలల్లో కొత్త పాలకమండలి ఏర్పాటయ్యే అవకాశం ఉంది.

News August 27, 2024

కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

image

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. సెప్టెంబర్ 3 వరకు పొడిగిస్తూ మంగళవారం ఆదేశాలిచ్చింది. కేజ్రీవాల్‌తో పాటు మరో ఐదుగురిని నిందితులుగా పేర్కొంటూ సీబీఐ దాఖలు చేసిన నాలుగో అనుబంధ చార్జిషీట్‌పైనా కోర్టు తన నిర్ణయాన్నిరిజర్వ్‌లో ఉంచింది. దీనిపై కూడా సెప్టెంబర్ 3న విచారణ జరపనుంది.

News August 27, 2024

అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో ‘పుష్ప 3’ కూడా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన చర్చలు పూర్తైనట్లు సమాచారం. పుష్ప2 విడుదలయ్యాక మూడో భాగంపై ప్రకటన రావొచ్చని అంచనా. ‘పుష్ప2’లో అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

News August 27, 2024

పొద్దున బైడెన్.. మధ్యాహ్నం పుతిన్‌కు మోదీ ఫోన్

image

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో మాట్లాడానని ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. 2 దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించానని పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ వివాదంపై భారత వైఖరి, ఉక్రెయిన్‌లో తాజా పర్యటన గురించి వివరించానన్నారు. వివాదం త్వరగా సమసిపోయేందుకు, శాంతికి భారత్ కట్టుబడినట్టు చెప్పానన్నారు. కాగా US అధ్యక్షుడు జో బైడెన్‌తోనూ మోదీ చర్చించిన సంగతి తెలిసిందే.