India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మహారాష్ట్రలో మహాయుతి విజయంతో నిఫ్టీ 400, సెన్సెక్స్ 2000 పాయింట్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే నేడు ఇన్వెస్టర్లు రూ.10L కోట్లమేర లాభం పొందుతారు. కేంద్ర పాలసీలకు అనుగుణంగా ఉండే కంపెనీల షేర్లలో వారు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఇక మహారాష్ట్రలో BJP అనుకూల ప్రమోటర్లున్న కంపెనీలపై ఆసక్తి పెరిగింది. APలో NDA గెలిచినప్పుడు హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు వరుసగా అప్పర్ సర్క్యూట్ తాకడం తెలిసిందే.

శ్రీశైలం జలాశయం నుంచి AP, TG పోటీ పడి జలవిద్యుదుత్పత్తి చేస్తున్నాయి. రోజూ 40వేల క్యూసెక్కులు వాడుకుంటుండటంతో నీటినిల్వలు వేగంగా పడిపోతున్నాయి. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 215TMCలు కాగా ప్రస్తుతం 149TMCలే మిగిలిఉన్నాయి. వచ్చే వర్షాకాలం వరకు సాగు, తాగు అవసరాల కోసం నీటిని సంరక్షించాలని కృష్ణా బోర్డు లేఖ రాసినా AP, TG పట్టించుకోవట్లేదు. ఇలాగే కొనసాగితే నీటి కటకట తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

డైరెక్టర్ RGVని ఇవాళ ప్రకాశం జిల్లా పోలీసులు విచారించనున్నారు. వ్యూహం సినిమా ప్రమోషన్లలో భాగంగా చంద్రబాబు, పవన్ను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. వారం కిందటే విచారణకు రావాలని పోలీసులు నోటీసులివ్వగా, తనకు సమయం కావాలని వాట్సాప్లో ఆర్జీవీ మెసేజ్ పంపారు. ఆ గడువు అయిపోగా, నేడు ఆయన్ను విచారించడానికి ఒంగోలు PSలో ఏర్పాట్లు చేశారు.

డుప్లెసిస్, ఫిలిప్స్, విలియమ్సన్, సామ్ కరన్, మిచెల్, కృనాల్ పాండ్య, సుందర్, శార్దుల్ ఠాకూర్, ఇంగ్లిస్, దీపక్ చాహర్, ఫెర్గ్యూసన్, భువనేశ్వర్ కుమార్, ముకేశ్ కుమార్, ముజీర్ రెహ్మాన్, మోయిన్ అలీ, టిమ్ డేవిడ్, విల్ జాక్స్, ముస్తాఫిజుర్, నవీన్ ఉల్ హక్, ఉమేశ్ యాదవ్, స్టీవ్ స్మిత్, లూయిస్, శాంట్నర్, హెన్రీ, అల్జరీ జోసెఫ్, హోల్డర్ etc. పూర్తి లిస్ట్ కోసం <

మహారాష్ట్రలో BJP+ కూటమి ఘన విజయంతో స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాల్లో మొదలవుతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. NSE నిఫ్టీ 300-400, BSE సెన్సెక్స్ 1500-2000 పాయింట్ల గ్యాప్అప్తో ఓపెనవుతాయని అంటున్నారు. వ్యాపార, వాణిజ్యానికి కీలకమైన MHలో BJP గెలుపు ప్రభుత్వ పాలసీల్లో సుస్థిరత్వాన్ని ప్రతిబింబిస్తోందని చెప్తున్నారు. గిఫ్ట్ నిఫ్టీ 300 పాయింట్లు పెరగడం సానుకూల సంకేతాలు పంపిందని అంటున్నారు.

IPL హిస్టరీలోనే వేలంలో అత్యధిక ధర పలికిన ఆల్రౌండర్గా వెంకటేశ్ అయ్యర్ నిలిచారు. అతడిని KKR ₹23.75crకు సొంతం చేసుకుంది. నిన్నటి వేలంలో అది మూడో అత్యధిక ధర. 2023లో సామ్ కరన్ ₹18.5cr(PBKS), గ్రీన్ ₹17.5cr(MI), స్టోక్స్ ₹16.25cr(CSK), 2021లో మోరిస్ ₹16.25cr(RR) ధర పలికారు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యను MI ₹16.35 కోట్లకు, జడేజాను CSK ₹18 కోట్లకు, అక్షర్ పటేల్ను DC ₹16.5 కోట్లకు రిటైన్ చేసుకున్నాయి.

లెబనాన్పై ఇజ్రాయెల్ మళ్లీ విరుచుకుపడింది. బీరూట్లోని ఓ బిల్డింగుపై వరుసగా ఎయిర్ స్ట్రైక్స్ చేపట్టింది. భీకరమైన ఈ దాడుల్లో 29 మంది మరణించారు. హెజ్బొల్లాకు చెందిన ఇంటెలిజెన్స్ యూనిట్, మిసైల్ యూనిట్, ఆయుధాలను స్మగ్లింగ్ చేసే 4400 యూనిట్ సహా 12 కమాండ్ సెంటర్లను నాశనం చేశామని IDF ప్రకటించింది. తమ దేశంపై టెర్రరిస్టు దాడుల ప్లానింగ్, కమాండ్, అమలుకు వీటిని వాడేవాళ్లని తెలిపింది.

AP: తిరుమల శ్రీవారి దర్శన, గదుల టికెట్లను నేడు విడుదల కానున్నాయి. ఫిబ్రవరి నెలకు సంబంధించిన రూ.300 స్పెషల్ ఎంట్రీ టికెట్లను ఉ.10 గంటలకు ఆన్లైన్లో ఉంచుతారు. అలాగే ఫిబ్రవరి కోటా గదుల టికెట్లను ఈరోజు మ.3 గంటలకు విడుదల చేయనున్నారు. ఆర్జిత సేవలు, దర్శనం, వసతి కోటా టికెట్లను https://ttdevasthanams.ap.gov.in సైట్ నుంచి మాత్రమే కొనుగోలు చేయాలని టీటీడీ సూచించింది.

TG: సిద్దిపేట జిల్లాకు చెందిన మాజీ MLA డి. రామచంద్రారెడ్డి(85) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన HYDలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి చనిపోయారు. మాజీ సీఎం కేసీఆర్ సమకాలికులైన ఈయన 1985లో దొమ్మాట నియోజకవర్గం(ప్రస్తుతం దుబ్బాక) నుంచి TDP ఎమ్మెల్యేగా గెలుపొందారు. రామచంద్రారెడ్డికి ఇద్దరు కుమార్తెలు ఉండగా, వారి వద్దే ఉంటున్నారు. స్వస్థలం సిద్దిపేట జిల్లా కొండపాక.

RCB మేనేజ్మెంట్ తీరుపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పర్స్ మనీ ఎక్కువగా ఉన్నా మంచి ప్లేయర్లను కొనుగోలు చేయలేదని మండిపడుతున్నారు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ హేజిల్వుడ్కు రూ.12.50 కోట్లు చాలా ఎక్కువ అని.. స్టార్క్, షమీ, నటరాజన్ లాంటి బౌలర్లను కొనాల్సిందంటున్నారు. ప్రస్తుతం RCBలో సుయాశ్ శర్మ, యశ్ దయాల్, రసిక్ సలాం లాంటి సాధారణ బౌలర్లే ఉన్నారు. మరి ఇవాళ RCB ఎలాంటి ప్లాన్స్ వేస్తుందో చూడాలి.
Sorry, no posts matched your criteria.