India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
* TGలో త్వరలో 35వేల ఉద్యోగాలు: CM రేవంత్
* రేపు కవిత బెయిల్పై తీర్పు.. ఢిల్లీకి BRS ఎమ్మెల్యేలు
* TGలో సివిల్స్ అభ్యర్థులకు రూ.లక్ష చొప్పున అందజేత
* సెప్టెంబర్ 1 నుంచి ఏపీలో రెవెన్యూ సదస్సులు: మంత్రి రాంప్రసాద్
* కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
* వైసీపీకి ఏలూరు మేయర్ రాజీనామా
* అక్టోబర్ 3 నుంచి యూఏఈలో మహిళల టీ20 వరల్డ్కప్
* రైతులపై కంగనా కామెంట్స్.. తప్పుపట్టిన బీజేపీ అధిష్ఠానం
ఎప్పటికైనా తన ప్రాధాన్యత రెడ్బాల్ క్రికెట్(టెస్టులు)కే అని భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ వెల్లడించారు. ముంబైలోని స్టేడియాల్లో తాను టెస్ట్ క్రికెట్ ఆడుతూ పెరిగానని చెప్పుకొచ్చారు. టెస్టు ఫార్మాట్పై అప్పుడు పుట్టిన ప్రేమ ఎప్పటికైనా అలాగే ఉంటుందని సూర్య చెప్పారు. బుచ్చిబాబు టోర్నమెంట్ కోసం ప్రిపేర్ అవుతున్న సూర్య ఓ చిట్చాట్లో ఈ విషయాలు వెల్లడించారు.
*ఆగస్టు 28- మాస్
*ఆగస్టు 30- నరసింహనాయుడు
*సెప్టెంబర్ 2- గబ్బర్ సింగ్
*సెప్టెంబర్ 14- 3 మూవీ
*సెప్టెంబర్ 23- డార్లింగ్
*అక్టోబర్ 23- ఈశ్వర్
*జనవరి 26- ఖడ్గం
మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి.
మాలీవుడ్లో లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. తాజాగా మలయాళ నటుడు, మూవీ ఆర్టిస్ట్ల సంఘం ఆఫీస్ బేరర్ బాబూరాజ్ అలువాలోని ఇంట్లో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని మహిళా జూనియర్ ఆర్టిస్ట్ ఆరోపించారు. ఈ ఆరోపణలను ఖండించిన బాబూరాజ్, వీటి వెనుక కొంతమంది స్వార్థపరులు ఉన్నారని అన్నారు. ఇప్పటికే దర్శకుడు రంజిత్, నటులు సిద్ధిక్, జయసూర్య, ముఖేష్, మణియంపిల్ల రాజు, ఇడవేల బాబులపై ఆరోపణలు వచ్చాయి.
TG: సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ మాల సామాజికవర్గం ప్రజాప్రతినిధులు, మాల మహానాడు నేతలు సచివాలయంలో CM రేవంత్ను కలిశారు. SC వర్గీకరణలో మాలలకు అన్యాయం జరగకుండా చూడాలని అభ్యర్థించారు. కాగా SC వర్గీకరణపై కమిటీని నియమించి, ఆ రిపోర్ట్ ఆధారంగా అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని CM హామీ ఇచ్చారు. CMను కలిసిన వారిలో పలువురు MLAలు, MPలు కూడా ఉన్నారు.
TG: ఇంటి అద్దె చెల్లించలేదనే కారణంతో కరీంనగర్ జిల్లాలోని ఓ ఏటీఎం సెంటర్కు తాళం వేశారు. ‘రెంట్ చెల్లించని కారణంగానే మూసివేశాం’ అనే బోర్డు కూడా తగిలించారు. ఒక్క నెల ఈఎంఐ చెల్లించడం కాస్త ఆలస్యమైనా ఫోన్ల మీద ఫోన్లు చేసి, ఛార్జీల మీద ఛార్జీలు వేసే బ్యాంకులకు రెంట్ కట్టేంత డబ్బు లేదా? అని సోషల్ మీడియాలో ఓ యూజర్ ప్రశ్నించారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.
ఆర్థిక శాఖ ప్రతి కుటుంబానికి రూ.46,715 సాయం ఇస్తోందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని కేంద్రం స్పష్టం చేసింది. వ్యక్తిగత వివరాలు కోరుతూ WhatsAppలో వైరల్ అవుతున్న ఈ వార్తలపై స్పందించవద్దని కోరింది. ఇదొక నకిలీ ప్రచారమని, ఆర్థిక శాఖ అలాంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేసింది.
SHARE IT.
ఐటీ రిటర్న్స్ దాఖలుకు గడువు ముగిసి నెల రోజులు కావొస్తున్నా చాలా మందికి ఇంకా రిఫండ్ జమ కాలేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ‘ఐటీ రిటర్న్స్ దాఖలుకు గడువు ఉన్నట్లే, వాటిని ప్రాసెస్ చేసి రిఫండ్ చేసేందుకు ప్రభుత్వానికి కూడా డెడ్లైన్ ఉండాలి. న్యూ ట్యాక్స్ కోడ్లో కేంద్రం దీన్ని చేర్చుతుందని ఆశిస్తున్నా’ అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు Xలో విజ్ఞప్తి చేశారు.
అమెరికా అధ్యక్షుడు బైడెన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య కాసేపటి క్రితం ఫోన్ సంభాషణ జరిగింది. ఇటీవల నెలరోజుల వ్యవధిలో యుద్ధంలో తలపడుతున్న రష్యా, ఉక్రెయిన్ దేశాల పర్యటనకు వెళ్లి వచ్చిన మోదీ ఆ వివరాలను వెల్లడించినట్టు తెలుస్తోంది. బంగ్లాదేశ్ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. బైడెన్ పదవీ కాలం కొన్ని నెలల్లో ముగుస్తుండడంతో మోదీ ఆల్ ది బెస్ట్ చెప్పినట్టు వార్తలొస్తున్నాయి.
పెరుగును పగలు తిన్నప్పుడే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. రాత్రిపూట దాని తీపి, లక్షణాల కారణంగా శరీరంలో పిత్తం, కఫం పెరుగుతాయి. ఆరోగ్యవంతులు ఇలా తింటే కొంతవరకు ఫర్వాలేదు కానీ జలుబు, దగ్గు, అలర్జీతో బాధపడేవాళ్లు రాత్రిపూట తినొద్దని సూచిస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం పెరుగు తింటే సులభంగా జీర్ణం అవుతుంది. ఇందులో కాల్షియం, ప్రొటీన్ల వల్ల కండరాలు బలంగా మారుతాయి.
Sorry, no posts matched your criteria.