India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆసీస్తో తొలి టెస్టులో సెంచరీ బాది టీమ్ ఇండియా బ్యాటర్ యశస్వీ జైస్వాల్ రికార్డులు సాధించారు. 23 ఏళ్లకే టెస్టుల్లో అత్యధిక సెంచరీలు బాదిన ఐదో భారత బ్యాటర్గా ఆయన నిలిచారు. ఇప్పటివరకు జైస్వాల్ 4 సెంచరీలు బాదారు. ఈ క్రమంలో గవాస్కర్ (4) రికార్డును సమం చేశారు. అలాగే 23 ఏళ్లకే ఒకే క్యాలెండర్ ఇయర్లో 3 సెంచరీలు బాదిన ఐదో భారత క్రికెటర్గానూ నిలిచారు. గవాస్కర్, కాంబ్లీ ఒకే ఏడాదిలో 4 సెంచరీలు చేశారు.

ఝార్ఖండ్ JMM చీఫ్ హేమంత్ సోరెన్ అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికలు జరగగా రాష్ట్ర ప్రజలు మరోసారి ఆయనకే అధికారం కట్టబెట్టారు. గత పదేళ్లలో జగన్, CBN, రేవంత్ వంటి నేతలూ జైలుకు వెళ్లి వచ్చాక CM అయ్యారు. దీంతో ఈ సెంటిమెంట్ నేతలకు కలిసి వస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. త్వరలో ఢిల్లీ ఎన్నికలు జరగనుండగా కేజ్రీవాల్ విషయంలోనూ ఇదే రిపీట్ అవుతుందంటున్నారు.

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక కలిసి మరోసారి కెమెరాకు చిక్కారు. ఒక రెస్టారెంట్లో వీరిద్దరూ కలిసి కూర్చున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరు డేటింగ్లో ఉన్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయ్ తాను సింగిల్ కాదని, ఓ హీరోయిన్తో డేటింగ్లో ఉన్నానని హింట్ ఇచ్చారు. తాజా ఫొటోతో ఆ ప్రచారం కాస్తా మరింత పెరిగింది.

భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. టీ20ల్లో 5 వేల పరుగులు, 100 వికెట్లు పడగొట్టిన తొలి భారత ప్లేయర్గా నిలిచారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఈ ఘనత సాధించారు. గుజరాత్తో జరిగిన మ్యాచులో ఈ బరోడా ప్లేయర్ 35 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 74* పరుగులు చేశారు. హార్దిక్ దూకుడుతో బరోడా 185 పరుగుల లక్ష్యాన్ని 3 బంతులు మిగిలి ఉండగానే చేరుకుంది.

AP: రాష్ట్రంలో చలి తీవ్రత పెరగడంతో సీజనల్ ఫీవర్స్, ఫుడ్ పాయిజనింగ్పై ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. పీహెచ్సీలకు ఫీవర్ ఎమర్జెన్సీ కిట్స్ను తరలించింది. కలుషిత నీటిపై అధికారులు ఫోకస్ పెట్టాలని, ఎప్పటికప్పుడు శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. ప్రజలు కాచి చల్లార్చిన నీటినే తాగాలని సూచించింది.

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ మరోసారి IPL వేలం బరిలో నిలిచారు. రూ.30 లక్షల బేస్ ప్రైజ్తో ఆయన అందుబాటులో ఉంటారు. టీమ్ ఇండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్ సోదరుడు తేజస్వీ జైస్వాల్ కూడా వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అమెరికా ఆటగాడు ఉన్ముక్త్ చంద్ అన్క్యాప్డ్ ప్లేయర్ల జాబితాలో ఉన్నారు. మరి అర్జున్ టెండూల్కర్ ఈసారి ఎంత ధర పలుకుతారో కామెంట్ చేయండి.

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20 వరకు కొనసాగుతాయి. ఈ సమావేశాల్లో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు సహా 15 కీలక బిల్లులను కేంద్రం సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వాటిపై చర్చించి ఆమోదించనుంది. సమావేశాల నేపథ్యంలో ఇవాళ అఖిలపక్ష భేటీ జరగనుంది. మరోవైపు పార్లమెంట్ పాత భవనంలోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది.

ఎన్టీఆర్ సినీ జీవితం ప్రారంభమై 75 ఏళ్లు పూర్తయ్యాయి. 1949 నవంబర్ 24న ఆయన నటించిన తొలి చిత్రం ‘మనదేశం’ విడుదలైంది. ఈ సినిమా కోసం కొత్త ముఖాలను ఎంపిక చేసే క్రమంలో ఒడ్డు, పొడుగు, చక్కటి వాచకం, గంభీర స్వరం ఉన్న ఎన్టీఆర్ను దర్శకుడు ఎల్వీ ప్రసాద్ తీసుకున్నారు. ఇందులో NTR పోలీస్గా నటించారు. ఈ సినిమా తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. సినిమాలు, స్టూడియోలు, రాజకీయాలతో తన జీవితమంతా బిజీబిజీగా గడిపారు.

TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య(70) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అబ్బయ్య ఉమ్మడి ఏపీలో బూర్గంపాడు నుంచి 1983లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 1994, 2009లో ఇల్లందు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన మృతిపట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు.

TG: తమ ప్రాణాలు తీసినా కంపెనీలకు భూములు ఇచ్చేది లేదని లగచర్ల రైతులు స్పష్టం చేశారు. NHRC బృందం లగచర్ల, రోటితండా, పులిచర్లకుంటతండాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా వారికి బాధితులు తమ గోడు వెల్లబోసుకున్నారు. తమ ప్రాంతంలో కంపెనీలు వద్దని, తమ భర్తలపై పెట్టిన కేసులు కొట్టేసి విడిచిపెట్టాలని మహిళలు కోరారు.
Sorry, no posts matched your criteria.