India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టెలిగ్రాం CEO పావెల్ దురోవ్ను ఫ్రాన్స్ అరెస్టు చేయడాన్ని బిలియనీర్ ఎలన్ మస్క్ ఖండించారు. అతడిని వెంటనే విడుదల చేయాలన్నారు. ‘స్వేచ్ఛ స్వేచ్ఛ! స్వేచ్ఛ’ అని ఫ్రెంచ్లో ట్వీట్ చేశారు. ఇన్స్టాగ్రామ్లో బాలలు పీడితులవుతున్నా దాని యజమాని జుకర్బర్గ్ను మాత్రం అరెస్టు చేయడం లేదన్నారు. ఆయన వాక్ స్వాతంత్ర్యాన్ని సెన్సార్ చేయడం, ప్రభుత్వానికి లోపాయికారిగా యూజర్ల డేటా ఇవ్వడమే ఇందుకు కారణాలని ఆరోపించారు.
పసిఫిక్ మహా సముద్రం మీదుగా అస్తమిస్తున్న చంద్రుడి ఫొటోను నాసా వ్యోమగామి మాథ్యూ డొమినిక్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మేఘాలు, నీలం రంగులపైన చందమామ దృశ్యం ఆకట్టుకుంటోంది. ఇది అద్భుతంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. డొమినిక్ 4 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు చేస్తున్నారు. హవాయి సమీపంలో ఉష్ణమండల తుఫాన్ను చిత్రీకరించడానికి వెళ్తూ చంద్రుడిని క్లిక్మనిపించినట్లు తెలిపారు.
టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అన్లిస్టెడ్ కంపెనీగా కొనసాగేందుకు రూ.20వేల కోట్లకు పైగా రుణాలను తీర్చేసింది. తమ గ్రూపు కంపెనీల్లో పెట్టుబడుల కోసం బ్యాంకులు, మార్కెట్ల నుంచి రుణాలు తీసుకోవడంతో టాటా సన్స్ను NBFC-UL కంపెనీగా ఆర్బీఐ వర్గీకరించింది. నిబంధనల ప్రకారం ఈ తరహా కంపెనీలు మూడేళ్లలోపే లిస్ట్ అవ్వాలి. ఇందుకు ఇష్టపడని టాటా సన్స్ అప్పుల్ని తీర్చేసింది.
AP: ఉచిత ఇసుక పంపిణీని సులభతరం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక వెబ్సైట్ను తీసుకురానుంది. ఇసుక పాలసీకి ఆమోదం తర్వాత SEP 11న ఈ వెబ్సైట్ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఇందులో బుకింగ్, ఇసుక లభ్యత, పెండింగ్, డిస్పాచ్ వంటి వివరాలు ఉంటాయి. ఇప్పటికే పాలసీ మార్గదర్శకాలను అధికారులు రూపొందించారు. ఈ నెల 28న జరిగే క్యాబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి ఆమోదం తెలపనుంది.
AP: పారిశ్రామికవేత్తలుగా రాణించాలనుకునే BC, EBC, కాపు యువత కోసం ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(EDP)ను ప్రభుత్వం తీసుకురానుంది. ఇందుకోసం హైదరాబాద్లోని NIMSMEతో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఏటా వెయ్యి మంది BCలు, 500 మంది EBCలు, 500 మంది కాపులకు శిక్షణ ఇవ్వనుంది. ఒక్కో బ్యాచ్లో 30 మంది చొప్పున 4-6 వారాలు ఈ ప్రోగ్రాం ఉండనుంది. ఇందుకు అయ్యే ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించనున్నాయి.
హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. 8.5 కేజీల మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.8.5 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. డ్రగ్స్ విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. మాదకద్రవ్యాలను ఎక్కడి నుంచి తెచ్చారు? ఎవరికి విక్రయిస్తున్నారనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
అక్టోబర్ 3 నుంచి ప్రారంభమయ్యే ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ కోసం డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా టీమ్ను ప్రకటించింది. అలీసా హీలీ జట్టుకు నాయకత్వం వహించనున్నారు.
జట్టు: హీలీ, డార్సీ బ్రౌన్, ఆష్ గార్డ్నర్, కిమ్ గార్త్, గ్రేస్ హారిస్, అలనా కింగ్, లిచ్ఫీల్డ్, తాలియా మెక్గ్రాత్, సోఫీ మోలినక్స్, బెత్ మూనీ, ఎల్లీస్ పెర్రీ, మెగన్ షట్, సుదర్లాండ్, జార్జియా వారెమ్, వ్లామినెక్.
మహారాష్ట్రలోని నాందేడ్ ఎంపీ, కాంగ్రెస్ నేత వసంత్ బల్వంత్రావు చవాన్(70) కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఇవాళ తెల్లవారుజామున మరణించారు. ఆయన 2009లో తొలిసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి నైగావ్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో అదే స్థానంలో కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు.
రాధాకృష్ణులు గోలోక వాసులు. ప్రేమ స్వరూపిణి, రస దేవత రాధదే అక్కడ ఆధిపత్యం. ఓసారి కన్నయ్యపై ఆమె అలిగింది. ప్రేమ జగడాలు తెలీని సుధాముడు వందేళ్లు స్వామితో వియోగం తప్పదని ఆమెకు శాపమిచ్చాడు. దాంతో వారి అంశలు రాధాకృష్ణులుగా భూమిపై ప్రేమ, రసారాధన గురించి తెలియజేశాయి. వియోగం కోసం రాధ తపస్సుకెళ్లగా కృష్ణుడిలో నారాయణుడు ప్రవేశించాడు. ఆ తర్వాత రుక్మిణీ కళ్యాణం, సత్యభామా కలాపం, భగవద్గీత, మహాభారతం జరిగాయి.
TG: బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయకపోతే భూకంపం సృష్టిస్తానని MLC తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు. బీపీ మండల్ జయంతి సందర్భంగా నిన్న హనుమకొండలో బీసీల శంఖారావం సభలో ఆయన పాల్గొన్నారు. ‘రిజర్వేషన్లు అమలు చేయకపోతే ప్రజల్లో ఒక్కరు కూడా తిరగలేరు. తెలంగాణలో BC సర్కార్ రాబోతోంది. BCలను గెలిపించేలా KCRకు వినతి ఇచ్చేందుకైనా నేను వస్తా. ఇలా మాట్లాడినందుకు మహా అయితే పదవి పోతుంది’ అంటూ ఆవేశంగా మాట్లాడారు.
Sorry, no posts matched your criteria.