India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో NDA కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. అక్కడ NDA 217 లీడ్లో ఉంది. అటు ఝార్ఖండ్లో మాత్రం INDIA కూటమి ఆధిక్యం కనబరుస్తోంది. INDIA 50 స్థానాల్లో లీడింగ్లో ఉంది. ఇదే లీడ్ చివరి వరకూ కొనసాగితే ఆయా రాష్ట్రాల్లో గత ప్రభుత్వాలే మళ్లీ కొలువుదీరే అవకాశం ఉంది.

మహారాష్ట్ర ఫలితాల్లో మహాయుతి దూకుడుకు ‘విదర్భ’ అండగా నిలిచింది. ఇక్కడ 62కు 40+ సీట్లలో BJP+ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. చారిత్రకంగా ఇది కాషాయ కంచుకోట. అలాంటిది 2024లో 10 లోక్సీభ సీట్లకు 7 MVA గెలిచి దెబ్బకొట్టింది. అందులో కాంగ్రెస్ 5 గెలిచింది. మహాయుతి 3కే పరిమితమైంది. ఈ ప్రాంతంలో దళిత, మరాఠా, కుంబి, ముస్లిం జనాభా అధికంగా ఉంటుంది. బటేంగేతో, ఏక్ హైతో నినాదాలు బాగా పనిచేసినట్టు విశ్లేషకుల అంచనా.

మహారాష్ట్రలో మహాయుతి ప్రభంజనం సృష్టిస్తోంది. ఏకంగా 225 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇందులో బీజేపీ 118, శివసేన షిండే వర్గం 56, ఎన్సీపీ 37 స్థానాల్లో లీడింగ్లో ఉంది. ఇక ఓట్ల పరంగా చూసుకుంటే బీజేపీ 23శాతం, శివసేన షిండే వర్గం 13శాతం, ఎన్సీపీ 14శాతం సాధించాయి. మరోవైపు తొలుత కాస్త పోటీ ఇచ్చిన మహావికాస్ అఘాడీ తర్వాత పూర్తిగా చేతులెత్తేసింది. ఆ కూటమి 56 స్థానాల్లోనే లీడింగ్లో ఉంది.

మహారాష్ట్ర ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని శివసేన (UBT) నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. మోదీ, షా, అదానీ ఈ కుట్రలో భాగస్వాములని కాసేపటి క్రితం ప్రెస్మీట్లో ఆరోపణలు గుప్పించారు. ప్రస్తుత ఫలితాలు ప్రజా విజయంగా పరిగణించవద్దన్నారు. తాము ఈ ఓటమిని అంగీకరించమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కర్ణాటకలోని చన్నపట్న అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాల్లో హీరో నిఖిల్ కుమారస్వామి ఆధిక్యం సాధించారు. JDS నుంచి బరిలో నిలిచిన ఆయన 783 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఆయన ‘జాగ్వార్’ సినిమాలో హీరోగా నటించారు. కర్ణాటక మాజీ సీఎం, కేంద్రమంత్రి HD కుమారస్వామి కుమారుడే ఈ నిఖిల్.

తాను పీఎండీడీ వ్యాధితో బాధపడినట్లు ప్రముఖ సింగర్ నేహా బాసిన్ తెలిపారు. ఇప్పుడిప్పుడే దీని నుంచి కోలుకుంటున్నట్లు చెప్పారు. ‘నెలలో 15 రోజులు దీనితో బాధపడేదాన్ని. ఇలా ఏడాదిపాటు ఇబ్బందులు ఎదుర్కొన్నా. అతిగా తినడం ప్రారంభించా. నాకు తెలియకుండానే 10 కిలోల బరువు పెరిగా. చివరకు యోగా, ఫిజియోథెరపీతో వ్యాధిని నయం చేసుకున్నా’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. తెలుగులో ‘జైలవకుశ’ మూవీలోని స్వింగ్ జర సాంగ్ ఈమే పాడారు.

మహారాష్ట్ర ఫలితాలు క్లియర్గా ఉన్నా ఝార్ఖండ్ రిజల్ట్స్ మాత్రం ఉత్కంఠ రేపుతున్నాయి. ఎర్లీ ట్రెండ్స్లో ఎన్డీయే ఆధిక్యంలో ఉండగా క్రమంగా ఇండియా కూటమి పుంజుకుంది. ప్రస్తుతం ఇండియా కూటమి 44, ఎన్డీఏ 34 స్థానాల్లో లీడ్ కనబరుస్తున్నాయి.

ఉత్తర్ప్రదేశ్లోని 9 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇందులో 6 చోట్ల బీజేపీ, 2 స్థానాల్లో ఎస్పీ, ఒక చోట RLD ముందంజలో ఉన్నాయి. అటు ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో బీజేపీ అభ్యర్థి ఆశా నాటియాల్ లీడింగ్లో కొనసాగుతున్నారు.

బెంగాల్ ఉప ఎన్నికల్లో టీఎంసీ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. మొత్తం 6 స్థానాల్లో ఉపఎన్నిక జరగ్గా అన్ని చోట్లా ఆ పార్టీనే లీడ్లో ఉంది. నైహతి, సితై, తల్దంగ్ర, హరోవా, మదరిహత్, మెదినిపుర్ నియోజకవర్గాల్లో ఆ పార్టీ దూకుడు కొనసాగుతోంది.

కేరళలోని వయనాడ్ MP స్థానంలో ప్రియాంక గాంధీ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆమె ప్రస్తుతం లక్షకు పైగా ఓట్ల లీడ్లో ఉన్నారు. కాగా ఇటీవల MPగా గెలిచిన రాహుల్ గాంధీ 3.6 లక్షల ఓట్ల మెజారిటీ సాధించారు. 2019లోనూ 4.3 లక్షల ఓట్ల మెజారిటీ సాధించారు. అయితే ఇక్కడ ప్రియాంకా గెలుస్తుందని అంతా భావిస్తున్నారు. మరి ఆమె తన సోదరుడి రికార్డును బ్రేక్ చేస్తారా? చూడాలి.
Sorry, no posts matched your criteria.