News August 25, 2024

రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్

image

హీరోయిన్ అమీ జాక్సన్ రెండో పెళ్లి చేసుకున్నారు. ఇంగ్లిష్ యాక్టర్, మ్యుజీషియన్ ఎడ్వర్డ్ వెస్ట్‌విక్‌తో ఆమె వివాహం జరిగింది. గత కొంతకాలంగా వీరు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అంతకుముందు 2015లో బ్రిటిష్ వ్యాపారవేత్త ఆండ్రియాస్ పనాయోటౌను పెళ్లాడిన ఆమె, 2021లో విడాకులు తీసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అమీ జాక్సన్ తెలుగులో రోబో 2.0, ఐ, ఎవడు సినిమాల్లో నటించారు.

News August 25, 2024

చరిత్ర సృష్టించిన స్త్రీ-2 మూవీ

image

శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ కీలక పాత్రల్లో నటించిన స్త్రీ-2 సినిమా బాలీవుడ్‌లో చరిత్ర సృష్టించింది. రిలీజైన తర్వాత రెండో శనివారం అత్యధిక కలెక్షన్లు(₹33.80cr) సాధించిన చిత్రంగా నిలిచింది. తర్వాతి స్థానాల్లో యానిమల్(₹32.47cr), గదర్-2(₹31.07cr), జవాన్(₹30.10cr), బాహుబలి-2(₹26.50cr), కశ్మీర్ ఫైల్స్(₹24.80cr), పఠాన్(₹22.50cr) ఉన్నాయి. మొత్తంగా స్త్రీ-2 మూవీ 10 రోజుల్లో ₹360crను కొల్లగొట్టింది.

News August 25, 2024

రిజిస్ట్రేషన్ల శాఖలో కొత్త టెక్నాలజీలపై ఫోకస్ చేయాలి: మంత్రి పొంగులేటి

image

TG: అన్ని జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాలయాలకు సొంత భవనాలను రెండేళ్లలో అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న ఆఫీసుల అద్దెలు, విద్యుత్, రెంటెడ్ వాహనాల ఛార్జీలను త్వరలోనే క్లియర్ చేస్తామన్నారు. రిజిస్ట్రేషన్ల శాఖ ఉద్యోగులతో సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా కొత్త టెక్నాలజీలపై ఫోకస్ చేయాలని సూచించారు.

News August 25, 2024

‘ఆదిపురుష్’ నటి కన్నుమూత

image

ప్రముఖ బాలీవుడ్ నటి ఆశా శర్మ(88) వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. ఈమె 40 ఏళ్లుగా హిందీలో అనేక చిత్రాలు, టీవీ సీరియళ్లలో నటించారు. చివరిసారిగా ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రంలో శబరి పాత్ర పోషించారు. దో దిశాయే, ముఝే కుచ్ కెహనా హై, ప్యార్ తో హోనా హీ థా, హమ్ తుమ్హారే హై సనమ్ తదితర సినిమాల్లో నటించారు. ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

News August 25, 2024

Stock Market: మండే మార్కెట్ ముచ్చట్లు

image

ఫెడ్ రేట్ల కోత ఊహాగానాలు, FPI ఇన్‌ప్లోతో దేశీయ సూచీలు గ‌త సెష‌‌న్‌లో ఫ్లాట్‌గా ముగిసినా పాజిటివ్ ట్రెండ్‌లో ఉన్న‌ట్టు నిపుణులు చెబుతున్నారు. వరుసగా 7 సెషన్లలో నిఫ్టీ అప్‌ట్రెండ్‌‌తో మొమెంటమ్ ఇండికేటర్లు RSI, MACD పాజిటివ్ ట్రెండ్‌ సూచిస్తున్నాయి. నిఫ్టీకి 24,700-24,500 వద్ద కీల‌క స‌పోర్ట్ లెవ‌ల్స్‌ ఉండ‌డంతో 24,800 వ‌ద్ద నిల‌క‌డ‌గా సాగితే 25,000 చేరుకోవ‌డం ఖాయ‌మ‌ని నిపుణులు పేర్కొంటున్నారు.

News August 25, 2024

PHOTO: జైలులో స్టార్ హీరోకు VIP ట్రీట్‌మెంట్

image

హ‌త్య కేసులో అరెస్టై బెంగ‌ళూరు ప‌ర‌ప్పన అగ్ర‌హార కేంద్ర కారాగారంలో ఉన్న క‌న్న‌డ హీరో ద‌ర్శ‌న్‌కు వీఐపీ ట్రీట్‌మెంట్ ల‌భిస్తున్న‌ట్టుంది. దీనికి సంబంధించిన ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. జైలులో పార్క్ లాంటి ప్ర‌దేశంలో కూర్చొని చేతిలో గ్లాసు, సిగ‌రెట్ ప‌ట్టుకొని ద‌ర్శ‌న్ ఉల్లాసంగా గడుపుతున్న‌ట్టు కనిపిస్తోంది. ఈ ఫొటో జైలు లోప‌లిదా? కాదా? అనేది జైలు అధికారులు ధ్రువీక‌రించాల్సి ఉంది.

News August 25, 2024

పనితీరు బాగున్న వారికే ప్రాధాన్యం: చంద్రబాబు

image

పనితీరు బాగున్న వారికే పార్టీలో ప్రాధాన్యం ఇస్తామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. HYDలోని ఎన్టీఆర్ భవన్‌లో TG నేతలతో ఆయన సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం, లోకల్ బాడీ ఎలక్షన్స్‌పై చర్చించారు. పార్టీ సభ్యత్వ నమోదుపై దృష్టి సారించాలని నేతలకు సూచించారు. ఇప్పటివరకు ఉన్న అన్ని కమిటీలను రద్దు చేశారు. ఈ భేటీలోనే టీటీడీపీ చీఫ్ ఎంపికపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

News August 25, 2024

టీడీపీలోకి బాబుమోహన్?

image

TG: హాస్యనటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ త్వరలో టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబును ఆయన తాజాగా కలవడం ఈ వార్తకు బలాన్ని చేకూరుస్తోంది. గతంలో ఆయన టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది, మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్, బీజేపీ, ప్రజాశాంతి పార్టీలకు మారుతూ వచ్చారు.

News August 25, 2024

ఆ వ్యాఖ్య‌లు ప్రభాస్ పాత్ర‌ను ఉద్దేశించి అయ్యుండొచ్చు: పూనమ్ ధిల్లాన్

image

హీరో ప్ర‌భాస్‌పై అర్ష‌ద్ వార్సి చేసిన వ్యాఖ్యలు చిత్రంలోని ప్రభాస్ పాత్రను ఉద్దేశించి మాత్రమే అయ్యుండొచ్చని సినీ, టీవీ ఆర్టిస్ట్స్ సంఘం అధ్య‌క్షురాలు పూన‌మ్ ధిల్లాన్ అభిప్రాయపడ్డారు. ఒక ఆర్టిస్టుగా అర్ష‌ద్ వ్యాఖ్య‌లు కేవలం సినిమా పాత్రను మాత్రమే ఉద్దేశించి ఉండొచ్చని, ప్రభాస్‌‌పై వ్య‌క్తిగ‌తంగా చేసిన‌వి కాక‌పోవ‌చ్చ‌ని నమ్ముతున్నానని అన్నారు. అయినా ఈ విషయమై అర్ష‌ద్ నుంచి వివ‌ర‌ణ కోర‌తామ‌న్నారు.

News August 25, 2024

వైద్యురాలిపై హత్యాచారం.. ర్యాలీల్లో పాల్గొన్న స్కూళ్లకు నోటీసులు

image

కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. బెంగాల్‌లో నిరసనలు హోరెత్తుతున్నాయి. ఈ నెల 23న జరిగిన ఆందోళనల్లో స్కూల్ విద్యార్థులు, టీచర్లు పాల్గొన్నారు. దీంతో సీరియస్ అయిన ప్రభుత్వం పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విద్యార్థులు రోడ్లపైకి రావడం సురక్షితం కాదని, దీనిపై యాజమాన్యాలు 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.