News August 25, 2024

రెవెన్యూ అధికారులకు మంత్రి పొంగులేటి హెచ్చరిక

image

TG: రెవెన్యూ శాఖలో పలువురు అధికారుల పనితీరు బాగాలేదని, మార్చుకోకపోతే చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. భూముల మార్కెట్ విలువ పెంపుతో పాటు పలు అంశాలపై ఆయన ఆఫీసర్లతో చర్చించారు. ‘ప్రభుత్వ స్థలాలు పేదవారికి ఇవ్వాలి. వాటిని బడా బాబులకు రిజిస్ట్రేషన్ చేస్తే సహించం. పనితీరు బట్టే పదోన్నతులు ఉంటాయి. పైరవీలు అవసరం లేదు. అధికారులు తప్పు చేస్తే క్షమించేది లేదు’ అని తెలిపారు.

News August 25, 2024

శాంతికి పిలుపునిచ్చిన UN, లెబనాన్

image

భీక‌ర దాడికి దిగిన‌ హెజ్బొల్లా-ఇజ్రాయెల్‌ను శాంతిప‌జేయ‌డానికి UN, లెబ‌నాన్ రంగంలోకి దిగాయి. దాడులు ఆపాలని, ప‌రిస్థితుల‌ను మ‌రింత దిగ‌జార్చే చ‌ర్య‌ల‌ను నిలిపివేయాల‌ని ఇరు వ‌ర్గాల‌కు లెబనాన్‌ ప్రధాని, అక్కడి UN ప్ర‌తినిధులు కోరారు. దాడుల‌ను విరమించి, 2006లో హెజ్బొల్లా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని ముగించేందుకు ఆమోదించిన ఐక్య‌రాజ్య స‌మితి భ‌ద్ర‌తా మండలి-1701 తీర్మానం అమ‌లు ఉత్తమ మార్గమని పేర్కొన్నాయి.

News August 25, 2024

సూర్యతో మను.. దేశం గర్వించే అథ్లెట్లంటూ నెటిజన్ల ప్రశంస

image

పారిస్ ఒలింపిక్స్‌లో 2 బ్రాంజ్ మెడల్స్‌ సాధించిన షూటర్ మనూ భాకర్ టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను కలిశారు. అతడితో దిగిన ఫొటోను Xలో షేర్ చేసిన మను ‘భారత మిస్టర్ 360 వద్ద కొత్త ఆటలో టెక్నిక్స్ నేర్చుకుంటున్నా’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఫొటోలో మను బ్యాటింగ్ చేస్తున్నట్లు, సూర్య పిస్టల్ పట్టుకున్నట్లు పోజు ఇచ్చారు. ‘ఇద్దరూ దేశం గర్వించే అథ్లెట్లు’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News August 25, 2024

పాక్ గ‌గ‌న‌త‌లం మీదుగా మోదీ విమానం?

image

ఇటీవల పోలాండ్ నుంచి భార‌త్‌కు తిరుగు ప్ర‌యాణ‌మైన PM మోదీ ప్ర‌యాణిస్తున్న ప్రత్యేక విమానం 46 నిమిషాలు పాక్ గ‌గ‌న‌త‌లాన్ని వినియోగించుకుంద‌ని అక్కడి మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. రాత్రి 11:00 గంటలకు చిత్రాల్ మీదుగా పాక్‌లోకి ప్రవేశించి, ఇస్లామాబాద్-లాహోర్‌లోని ఎయిర్ కంట్రోల్ ప్రాంతాలను వినియోగించినట్లు చెబుతున్నాయి. తిరిగి అమృత్‌సర్ మీదుగా 11:46 గంటలకు భారత గగనతలంలోకి ప్రవేశించిందని పేర్కొన్నాయి.

News August 25, 2024

కాసేపట్లో వర్షం

image

రానున్న 3 గంటల్లో హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. జనగామ, కామారెడ్డి, కరీంనగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్-మల్కాజిగిరి, పెద్దపల్లి, సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మోస్తరు వానలు పడొచ్చని పేర్కొంది. మరి మీ ప్రాంతంలో వర్షం మొదలైందా? కామెంట్ చేయండి.

News August 25, 2024

‘అర్జున్ రెడ్డి’ ఫుల్ కట్ రిలీజ్ చేయాలి: విజయ్ దేవరకొండ

image

<<13936404>>అర్జున్‌రెడ్డి<<>> సినిమా రిలీజై నేటితో ఏడేళ్లు పూర్తయ్యింది. దీనిపై హీరో విజయ్ దేవరకొండ Xలో స్పందించారు. ‘ఈ మూవీకి ఏడేళ్లు పూర్తయ్యాయంటే నమ్మలేకపోతున్నా. గత ఏడాది జరిగినట్లుగానే అనిపిస్తోంది. 10వ వార్షికోత్సవానికి అర్జున్ రెడ్డి ఫుల్ కట్‌ను ప్రజలకు చూపాలని డైరెక్టర్‌ సందీప్‌‌రెడ్డిని కోరుతున్నా’ అని రాసుకొచ్చారు. ఈ చిత్రం ఒరిజినల్ రన్ టైమ్ 220 నిమిషాలపైనే ఉండగా, 182 నిమిషాల నిడివితో రిలీజైంది.

News August 25, 2024

బల్లులు, పిల్లుల కారణంగానే 14% కరెంట్ కోతలు!

image

రాష్ట్రంలో 14% విద్యుత్ అంతరాయాలకు బల్లులు, పిల్లులు, పావురాలు, ఉడుములు కారణమని అధికారులు తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్లు, బ్రేకర్లు, ఫ్యూజ్ సెట్లపై వాలినప్పుడు అవి కాలిపోతున్నాయన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు మెటల్ క్లాంప్‌లకు బదులుగా ఎఫ్‌ఆర్‌బి సిలికాన్ క్లాంప్‌లను తీసుకొస్తున్నట్లు TGSPDCL ఎండీ ముషారఫ్ చెప్పారు. వీటి వల్ల జీవులకు, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగదని పేర్కొన్నారు.

News August 25, 2024

‘హైడ్రా’ నెక్ట్స్ టార్గెట్ వారేనా?

image

అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తున్న హైడ్రా నిన్న హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను నేలమట్టం చేసింది. దీని తర్వాతి టార్గెట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డేనని తెలుస్తోంది. హైదరాబాద్ శివారులో మల్లారెడ్డి కాలేజీని చెరువులోనే నిర్మించారంటూ హైడ్రాకు భారీగా ఫిర్యాదులొస్తున్నాయి. అటు పల్లాకు చెందిన అనురాగ్ కాలేజీ కూడా అక్రమ నిర్మాణమేనని ఆరోపణలున్నాయి.

News August 25, 2024

పాక్ ఓటమి.. బంగ్లాదేశ్‌కు చరిత్రాత్మక విజయం

image

పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 10వికెట్ల తేడాతో గెలిచింది. టెస్ట్ క్రికెట్‌లో పాక్‌పై బంగ్లాకు ఇదే తొలి విజయం. పాక్ గడ్డపై 10వికెట్ల తేడాతో టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి జట్టుగానూ BAN రికార్డు సృష్టించింది. తొలి ఇన్నింగ్స్‌లో 448/6 రన్స్‌కు డిక్లేర్ ఇచ్చిన పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 146పరుగులకే చాపచుట్టేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 565, రెండో ఇన్నింగ్స్‌లో 30రన్స్‌ చేసి బంగ్లా గెలిచింది.

News August 25, 2024

హేమ కమిటీ ఎఫెక్ట్.. పలువురి రాజీనామా

image

మాలీవుడ్‌లో హేమ కమిటీ నివేదిక ప్రకంపనలు సృష్టిస్తోంది. చిత్ర పరిశ్రమలోని పలువురిపై అసభ్య ప్రవర్తన, వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో కేరళ చలనచిత్ర అకాడమీ ఛైర్మన్, దర్శకుడు రంజిత్ బాలకృష్ణ‌న్‌, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, న‌టుడు సిద్ధికి తమ పదవులకు రాజీనామా చేశారు. వీరిపై పలువురు మహిళా ఆర్టిస్టులు వేధింపుల ఆరోపణలు చేశారు. అయితే వీటిని రంజిత్‌, సిద్ధికి ఖండించారు.