India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయంది.
AP: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల్లోని ఎవరైనా వచ్చే ఏడాది మార్చి 31లోపు రిటైర్ అవుతుంటే వారికి సాధారణ బదిలీలు చేయబోమని ప్రభుత్వం తెలిపింది. ప్రజా ప్రయోజనం కోసమే ట్రాన్స్ఫర్స్ ఉంటాయని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. వేరే ఏ ఇతర పరిస్థితుల్లోనూ బదిలీలు ఉండవని స్పష్టం చేశారు.
TG: రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశ ప్రక్రియ పూర్తి కావొచ్చింది. మొత్తం 86,943 సీట్లకు గానూ 75,107 మంది ప్రవేశాలు పొందారు. దీంతో 11,836 సీట్లు మిగిలిపోయాయని విద్యాశాఖ వెల్లడించింది. ఏఐ, సీఎస్ఎన్, సీఎస్ఏ వంటి కోర్సుల్లో పూర్తి స్థాయిలో ప్రవేశాలు జరిగాయి. కాగా సీట్ల భర్తీకి కాలేజీ యాజమాన్యాలు స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించుకునే అవకాశం ఉంది.
TG: హాస్టళ్లలో నెలకోసారి నిద్ర చేయాలని కలెక్టర్లను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో తనిఖీలు నిర్వహిస్తే అక్కడి పరిస్థితులు మెరుగవుతాయని చెప్పారు. హాస్టల్స్, స్కూళ్ల విజిటింగ్, నిద్ర చేయడం వంటివి ప్రతి నెలా కలెక్టర్లు చేపట్టే కార్యక్రమాల్లో ఉండాలన్నారు.
AP: రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది. ఇందుకోసం పట్టా భూముల్లో యజమానికి టన్నుకు రూ.66 చెల్లించాలని నిర్ణయించింది. దీనిపై మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశముంది. మరోవైపు SEP 11 నుంచి ఆన్లైన్ బుకింగ్ చేసుకునేలా ప్రభుత్వం పోర్టల్ను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం ఇసుక డిమాండ్ తక్కువగా ఉందని, నవంబర్, డిసెంబర్లో పెరిగే అవకాశం ఉందని భావిస్తోంది.
పాపులర్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ఫౌండర్ పర్వేల్ దురోవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాదం, మాదకద్రవ్యాల సరఫరా, మోసాలు, మనీలాండరింగ్ వంటి వాటికి సహకరిస్తున్నారనే ఆరోపణలతో ఆయనను ఫ్రాన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. దీనిపై టెలిగ్రామ్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ రైల్వే నెట్ వర్క్(కర్బన ఉద్గార రహిత)ను కలిగి ఉన్న దేశంగా భారత్ నిలిచినట్లు రైల్వే అధికారులు తెలిపారు. 68వేల కి.మీ.లకు పైగా ఉన్న ట్రాక్లో 95శాతం విద్యుదీకరణ పూర్తయినట్లు చెప్పారు. రైల్వేను విస్త్రృత పరిచేందుకు గత ఏడాది రూ.85వేల కోట్ల బడ్జెట్ కేటాయింపులు చేసినట్లు పేర్కొన్నారు. రైల్వే ఆధునీకరణ భారత ఆర్థిక వృద్ధిలో కీలకమని వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని చేరుకుంటుందన్నారు.
నాలుగేళ్ల క్రితం ‘కాఫీ విత్ కరణ్’ షో ఇంటర్వ్యూ వివాదం తనను ఎంతగానో భయపెట్టిందని భారత క్రికెటర్ KL రాహుల్ అన్నారు. ఆ ఇంటర్వ్యూతో తన జీవితం మారిపోయిందని ఓ పాడ్ కాస్ట్ షోలో చెప్పారు. మహిళపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని జట్టు నుంచి సస్పెన్షన్కు గురైనట్లు గుర్తుచేశారు. కాగా ఈ షోలో మహిళలపై అభ్యంతకర వ్యాఖ్యలు చేయడంతో వారిపై రూ.20 లక్షల చొప్పున ఫైన్తో పాటు కొంతకాలం సస్పెన్షన్ విధించింది.
హరియాణాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీని మార్చాలని ఈసీని బీజేపీ కోరింది. పోలింగ్కు ముందు, తర్వాత సెలవులు ఉండటంతో ఓటింగ్పై ప్రభావం చూపే అవకాశం ఉందని లేఖలో పేర్కొంది. ఈ ప్రతిపాదనతో కాషాయ పార్టీ నేతలు ఇప్పుడే పరాజయాన్ని అంగీకరించారని కాంగ్రెస్ నేత, మాజీ CM భూపిందర్ సింగ్ హుడా విమర్శించారు. కాగా బీజేపీ అభ్యర్థనపై ఈసీ స్పందించాల్సి ఉంది. హరియాణాలో 90 స్థానాలకు అక్టోబర్ 1న పోలింగ్ జరగనుంది.
దేశంలో 2026కల్లా నక్సలిజాన్ని రూపుమాపుతామని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. చివరి దాడికి సమయం ఆసన్నమైందని రాయ్పుర్లో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు నక్సలిజం అతిపెద్ద సమస్య అని భావిస్తున్నట్లు చెప్పారు. డిసెంబర్లో బీజేపీ తిరిగి అధికారంలో వచ్చాక 126 మంది నక్సల్స్ హతమైనట్లు షా పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.